IND vs PAK: ‘కెప్టెన్ కూల్’ ధోనీ వల్ల.. ఆ గొడవకు అక్కడితో తెర: కమ్రాన్ అక్మల్
ప్రపంచ క్రికెట్లో హైఓల్టేజీ మ్యాచుల్లో దాయాదుల పోరు (IND vs PAK) తప్పక ఉంటుంది. ఆటగాళ్లూ దూకుడుగా బరిలోకి దిగుతారు. గతంలో జరిగిన ఓ సంఘటనను పాక్ మాజీ కెప్టెన్ కమ్రాన్ అక్మల్ గుర్తు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ అంటే అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి. ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ. ఒక్కోసారి సహనం కోల్పోయి మాటల యుద్ధం కూడా జరుగుతుంటుంది. అలాంటి సంఘటన 2012/13 సీజన్లో బెంగళూరు వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో చోటు చేసుకుంది. భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma), పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి వెళ్లింది. అయితే, ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీతోపాటు సురేశ్ రైనా కలగజేసుకుని ఇరువురిని శాంతింపజేయడంతో అక్కడితో వివాదం ముగిసింది. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కమ్రాన్ అక్మల్ గుర్తు చేశాడు.
బుమ్రా.. నీకు నాదొక సలహా: చాపెల్
‘‘ఇషాంత్ శర్మ అసభ్య పదం వాడాడు. తిరిగి పదాలు అనిపించుకోవాల్సి వచ్చింది. బెంగళూరు నుంచి తర్వాతి రోజు మరో టీ20 మ్యాచ్ కోసం మేం (పాక్ జట్టు) అహ్మదాబాద్కు వెళ్లాం. నాతోపాటు విరాట్, షోయబ్ మాలిక్, హఫీజ్ కూర్చొని ఉన్నాం. బెంగళూరు మ్యాచ్ సందర్భంగా ఏం జరిగిందని వారిలో ఎవరో అడిగారు. ఇషాంత్ బౌలింగ్ చేసిన తర్వాత ఏదో అన్నాడు. నేను కూడా ఓ అసభ్య పదం వాడానని చెప్పా. అయితే, మ్యాచ్ సందర్భంగా పరిస్థితి సీరియస్గా మారుతుందన్నప్పుడు ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా వచ్చి సర్ది చెప్పారు. దీంతో అక్కడితో వివాదానికి ముగింపు పలకాలని భావించారు. లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేది. అయితే, దాని వల్ల నేను రెండు మ్యాచ్ల నిషేధంతోపాటు భారీగా మ్యాచ్ ఫీజును జరిమానాగా ఎదుర్కొన్నా’’ అని కమ్రాన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. ఎండ్రియల్లో యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
-
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
-
పెద్దపల్లి పోరు.. తండ్రీకొడుకులపై పోటీ
-
మాట తప్పిన జోగి.. మా సొమ్ములేవి?