IND vs ENG: ఆకాశ్కు మూడు వికెట్లు.. రూట్ సెంచరీ.. ముగిసిన తొలి రోజు ఆట
నాలుగో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో భారత్ - ఇంగ్లాండ్ జట్లు సరిసమానంగా నిలిచాయి. ఆతిథ్య జట్టు ఏడు వికెట్లు తీస్తే.. ఇంగ్లాండ్ 300+ స్కోరు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: రాంచీ వేదికగా ప్రారంభమైన (IND vs ENG) నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. భారత అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్ (3/70) అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే, కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ను జో రూట్ (106*) సెంచరీతో ఆదుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. క్రీజ్లో జో రూట్తోపాటు ఓలీ రాబిన్సన్ (31*) ఉన్నాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు 57 పరుగులు జోడించారు. అంతకుముందు ఓపెనర్ జాక్ క్రాలే (42), జానీ బెయిర్ స్టో (38), బెన్ ఫోక్స్ (47) విలువైన పరుగులు సాధించారు. భారత బౌలర్లలో ఆకాశ్ 3, సిరాజ్ 2.. అశ్విన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.
అదరగొట్టిన కొత్త బౌలర్..
భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆకాశ్ దీప్ తొలి ఓవర్ నుంచే అదరగొట్టాడు. పదునైన బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బందికి గురి చేశాడు. ఓవైపు జాక్ క్రాలే దూకుడుగా ఆడుతున్నా.. మరోవైపు బెన్ డకెట్ (11) మాత్రం ఆకాశ్ బౌలింగ్లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. ఒకే ఓవర్లో డకెట్తోపాటు ఓలీ పోప్ (0)ను ఔట్ చేసి భారత్కు శుభారంభం అందించాడు. తన రెండో ఓవర్లోనే క్రాలేను బౌల్డ్ చేశాడు. అయితే, అది నోబాల్. దీంతో తనకొచ్చిన ఛాన్స్ను క్రాలే సద్వినియోగం చేసుకుని ఎటాకింగ్ గేమ్ ఆడాడు. చివరికి ఆకాశ్ బౌలింగ్లోనే క్రాలే క్లీన్బౌల్డ్ అయి పెవిలియన్కు చేరాడు.
కాపాడిన రూట్..
గత మూడు టెస్టుల్లో గొప్ప ప్రదర్శన చేయలేకపోయిన జో రూట్.. ఈసారి మాత్రం క్రీజ్లో పాతుకుపోయాడు. బజ్బాల్ ఆడొద్దని ఇంగ్లాండ్ మాజీలు చేసిన సూచనలను పాటించాడేమో తనదైన ఆటతీరుతో సెంచరీ సాధించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం నింపాదిగా ఆడేశాడు. ఈక్రమంలో భారత్పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలిచాడు. కేవలం 52 ఇన్నింగ్స్ల్లోనే 10 శతకాలు చేశాడు. స్టీవ్ స్మిత్ (9 సెంచరీలు) పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించాడు. బెన్ ఫోక్స్తో కలిసి ఆరో వికెట్కు 113 పరుగులు, టామ్ హార్ట్లీతో ఏడో వికెట్కు 20 పరుగులు, ఓలీ రాబిన్సన్తో కలిసి రూట్ ఎనిమిదో వికెట్కు 57 పరుగులు జోడించాడు. రూట్ లేకపోతే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎప్పుడో ముగిసేది.
మరికొన్ని విశేషాలు..
- అరంగేట్రం చేసిన టెస్టులోనే ఆకాశ్ దీప్ తొలి ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్కు చేర్చాడు. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్ను ఔట్ చేశాడు.
- ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు ఒక్క వికెట్ తీసిన అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై 1000+ పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా అవతరించాడు.
- జో రూట్ అత్యంత నెమ్మదైన సెంచరీ చేయడం ఇది మూడోసారి. ఇప్పుడు 219 బంతుల్లో శతకం చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్పై హామిల్టన్ (2019) 259 బంతులు, ఆసీస్పై లార్డ్స్లో (2013) 247 బంతులు తీసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు