IND vs ENG: ఆకాశ్కు మూడు వికెట్లు.. రూట్ సెంచరీ.. ముగిసిన తొలి రోజు ఆట
నాలుగో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో భారత్ - ఇంగ్లాండ్ జట్లు సరిసమానంగా నిలిచాయి. ఆతిథ్య జట్టు ఏడు వికెట్లు తీస్తే.. ఇంగ్లాండ్ 300+ స్కోరు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: రాంచీ వేదికగా ప్రారంభమైన (IND vs ENG) నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. భారత అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్ (3/70) అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే, కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ను జో రూట్ (106*) సెంచరీతో ఆదుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. క్రీజ్లో జో రూట్తోపాటు ఓలీ రాబిన్సన్ (31*) ఉన్నాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు 57 పరుగులు జోడించారు. అంతకుముందు ఓపెనర్ జాక్ క్రాలే (42), జానీ బెయిర్ స్టో (38), బెన్ ఫోక్స్ (47) విలువైన పరుగులు సాధించారు. భారత బౌలర్లలో ఆకాశ్ 3, సిరాజ్ 2.. అశ్విన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.
అదరగొట్టిన కొత్త బౌలర్..
భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆకాశ్ దీప్ తొలి ఓవర్ నుంచే అదరగొట్టాడు. పదునైన బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బందికి గురి చేశాడు. ఓవైపు జాక్ క్రాలే దూకుడుగా ఆడుతున్నా.. మరోవైపు బెన్ డకెట్ (11) మాత్రం ఆకాశ్ బౌలింగ్లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. ఒకే ఓవర్లో డకెట్తోపాటు ఓలీ పోప్ (0)ను ఔట్ చేసి భారత్కు శుభారంభం అందించాడు. తన రెండో ఓవర్లోనే క్రాలేను బౌల్డ్ చేశాడు. అయితే, అది నోబాల్. దీంతో తనకొచ్చిన ఛాన్స్ను క్రాలే సద్వినియోగం చేసుకుని ఎటాకింగ్ గేమ్ ఆడాడు. చివరికి ఆకాశ్ బౌలింగ్లోనే క్రాలే క్లీన్బౌల్డ్ అయి పెవిలియన్కు చేరాడు.
కాపాడిన రూట్..
గత మూడు టెస్టుల్లో గొప్ప ప్రదర్శన చేయలేకపోయిన జో రూట్.. ఈసారి మాత్రం క్రీజ్లో పాతుకుపోయాడు. బజ్బాల్ ఆడొద్దని ఇంగ్లాండ్ మాజీలు చేసిన సూచనలను పాటించాడేమో తనదైన ఆటతీరుతో సెంచరీ సాధించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం నింపాదిగా ఆడేశాడు. ఈక్రమంలో భారత్పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలిచాడు. కేవలం 52 ఇన్నింగ్స్ల్లోనే 10 శతకాలు చేశాడు. స్టీవ్ స్మిత్ (9 సెంచరీలు) పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించాడు. బెన్ ఫోక్స్తో కలిసి ఆరో వికెట్కు 113 పరుగులు, టామ్ హార్ట్లీతో ఏడో వికెట్కు 20 పరుగులు, ఓలీ రాబిన్సన్తో కలిసి రూట్ ఎనిమిదో వికెట్కు 57 పరుగులు జోడించాడు. రూట్ లేకపోతే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎప్పుడో ముగిసేది.
మరికొన్ని విశేషాలు..
- అరంగేట్రం చేసిన టెస్టులోనే ఆకాశ్ దీప్ తొలి ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్కు చేర్చాడు. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్ను ఔట్ చేశాడు.
- ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు ఒక్క వికెట్ తీసిన అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై 1000+ పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా అవతరించాడు.
- జో రూట్ అత్యంత నెమ్మదైన సెంచరీ చేయడం ఇది మూడోసారి. ఇప్పుడు 219 బంతుల్లో శతకం చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్పై హామిల్టన్ (2019) 259 బంతులు, ఆసీస్పై లార్డ్స్లో (2013) 247 బంతులు తీసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?