షమి దేశవాళీ బాట

కోల్కతా: ఎన్నో ఏళ్ల పాటు టీమ్ఇండియా ప్రధాన పేసర్లలో ఒకడిగా ఉన్న మహ్మద్ షమి.. ఇప్పుడు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. వయసు పెరగడం, ఫిట్నెస్ సమస్యలు తలెత్తడం, ఫామ్ కూడా అంత బాగా లేకపోవడమే ఇందుక్కారణం. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం కారణంగా షమి ఏడాదికి పైగా ఆటకు దూరమయ్యాడు. నిరుడు పునరాగమనం చేసినప్పటికీ.. మునుపటిలా సత్తా చాటలేకపోయాడు. దీనికి తోడు ఫిట్నెస్ సమస్యలు పూర్తిగా సమసిపోకపోవడంతో షమిని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదు. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్కూ అతను జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున ఘోరంగా విఫలమైన అతను నెల రోజులకు పైగా మైదానంలోకే రాలేదు. ఇప్పుడు తిరిగి దేశవాళీల్లో ఆడబోతున్న షమి.. అక్కడ సత్తా చాటి టీమ్ఇండియాలోకి పునరాగమనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాబోయే దేశవాళీ సీజన్ కోసం బెంగాల్ జట్టు ప్రకటించిన 50 మంది ప్రాబబుల్స్లో షమికి చోటు దక్కింది. తాను బెంగాల్ జట్టుకు అందుబాటులో ఉంటానని షమి ఇచ్చిన సమాచారం మేరకే అతణ్ని ప్రాబబుల్స్లో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం టెస్టు జట్టులో సభ్యులైన ఆకాశ్ దీప్, అభిమన్యు ఈశ్వరన్ కూడా ఈ ప్రాబబుల్స్లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


