పంత్‌ విఫలం.. ఇండియా-ఎ 234

Eenadu icon
By Sports News Desk Published : 01 Nov 2025 02:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

బెంగళూరు: ఇండియా-ఎతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా-ఎకు ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 299/9తో రెండో రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా-ఎ 309 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇండియా-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 58 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఆయుష్‌ మాత్రె (65), సాయి సుదర్శన్‌ (32) తొలి వికెట్‌కు 90 పరుగులతో శుభారంభం అందించినా మిగతా బ్యాటర్లు తేలిపోయారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (6), రజత్‌ పాటీదార్‌ (19) కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (17) నిరాశపరిచారు. ఆయుష్‌ బదోని (38) రాణించాడు. ప్రెనెలన్‌ సుబ్రాయెన్‌ (5/61), లూథో సిపామ్లా (2/35) సత్తాచాటడంతో దక్షిణాఫ్రికా-ఎకు 75 పరుగుల ఆధిక్యం లభించింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా-ఎ రెండో ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 30 పరుగులు సాధించింది. మరో రెండ్రోజుల ఆట మిగిలివున్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా-ఎ 105 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు