380 పరుగుల లక్ష్యం అనుకున్నాం: అమన్‌జ్యోత్‌

Eenadu icon
By Sports News Desk Published : 01 Nov 2025 02:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ముంబయి: ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 380 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని అనుకున్నామని భారత ఆల్‌రౌండర్‌ అమన్‌జ్యోత్‌ కౌర్‌ తెలిపింది. ‘‘వీలైనంత వరకు పరుగులు నియంత్రించడానికి ప్రయత్నించా. లిచ్‌ఫీల్డ్‌ చాలా దూకుడు బ్యాటర్‌. ఆమెతో కొన్ని డాట్‌ బాల్స్‌ ఆడిస్తే భిన్నంగా ప్రయత్నిస్తుందని తెలుసు. స్టంప్స్‌ లక్ష్యంగా బౌలింగ్‌ చేయడం ప్రాథమిక ప్రణాళిక మాత్రమే. వికెట్‌ చాలా బాగుంది కాబట్టి ఆసీస్‌ 380 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని అనుకున్నాం. అయితే లిచ్‌ఫీల్డ్‌ ఔటవడంతో ఆట మాకు అనుకూలంగా మారింది. అక్కడ్నుంచి ఎక్కువ పరుగులివ్వలేదు. లిచ్‌ఫీల్డ్‌ వికెట్‌ తీసిన శ్రీచరణి అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. వేడి వాతావరణంలో రెండో ఓవర్లో బరిలో దిగిన జెమీమా చివరి వరకు క్రీజులో ఉండటం గొప్ప విషయం. మ్యాచ్‌ను విడిచిపెట్టకుండా ఆఖరి వరకు పోరాడింది’’ అని అమన్‌జ్యోత్‌ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు