టీ20లకు విలియమ్సన్‌ వీడ్కోలు

Eenadu icon
By Sports News Desk Updated : 03 Nov 2025 05:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ దిగ్గజ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ టీ20లకు వీడ్కోలు పలికాడు. కివీస్‌ తరఫున 93 టీ20లు ఆడిన కేన్‌.. 2575 పరుగులు సాధించాడు. 2011లో జింబాబ్వేపై పొట్టి క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ స్టార్‌ బ్యాటర్‌.. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పపువా న్యూగినియాపై ఆఖరి మ్యాచ్‌ ఆడాడు. టెస్టులు, వన్డేల్లో కొనసాగనున్న 35 ఏళ్ల కేన్‌.. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు వ్యూహ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 


భారత్‌-ఎ విజయం 

బెంగళూరు: దక్షిణాఫ్రికా-ఎతో నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత్‌-ఎ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 275 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 119/4తో ఆఖరి రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌.. మరో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రిషబ్‌ పంత్‌ (90) సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 309...భారత్‌ 234 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 199 పరుగులకే ఆలౌటైంది. 


పాకిస్థాన్‌దే టీ20 సిరీస్‌ 

లాహోర్‌: దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్థాన్‌ 2-1తో గెలుచుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో పాక్‌ 4 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది.బాబర్‌ (68) మెరవడంతో లక్ష్యాన్ని పాక్‌ 19 ఓవర్లలోనే ఛేదించింది.

Tags :
Published : 03 Nov 2025 03:08 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు