Sachin Tendulkar: సచిన్‌ చేతుల మీదుగా..

Eenadu icon
By Sports News Desk Updated : 03 Nov 2025 06:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ముంబయి: మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ మైదానంలోకి వచ్చాడు. వెలుగు జిలుగుల మధ్య అతడు ప్రపంచకప్‌ ట్రోఫీతో ప్రవేశించగానే అభిమానుల అరుపులతో డీవై పాటిల్‌ స్టేడియం దద్దరిల్లింది. భారత ప్లేయర్లతో మాట్లాడి అతడు అభినందనలు తెలిపాడు. భారత మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఫైనల్‌ ఆరంభానికి ముందు ప్రముఖ గాయని సునిధి చౌహాన్‌ జనగణమన ఆలపించింది. తర్వాత 60 మంది డ్యాన్సర్లతో సునిధి చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్‌ సంజయ్‌ శెట్టి ఫైర్‌వర్క్స్‌ ప్రదర్శన, డ్రోన్‌ డిస్‌ప్లే, లేజర్‌ షో అభిమానులను విశేషంగా అలరించాయి. 

ప్రైజ్‌మనీ

  • విజేత జట్టుకు రూ.37.3 కోట్లు 
  • రన్నరప్‌నకు రూ.20 కోట్లు  
Tags :
Published : 03 Nov 2025 06:37 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు