Amol Muzumdar - Team India: మా అమ్మాయిలు విజయానికి అర్హులు: అమోల్ మజుందార్

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి భారతీయుడూ గర్వపడేలా మహిళా జట్టు చేసిందని ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది మహిళా క్రికెట్కు సువర్ణాధ్యాయమని వ్యాఖ్యానించాడు. రెండేళ్ల కిందట భారత జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా ఓటములను చవిచూశామని.. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ఈ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించాడు.
‘‘ఇప్పుడేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. భారత మహిళా క్రికెట్ అద్భుతం చేసింది. ఇప్పుడు సాధించిన ప్రతిదానికీ వారు పూర్తి అర్హులు. కఠినమైన శ్రమ, నమ్మకంతోనే ఇది సాధ్యమైంది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిన జట్టుకు అభినందనలు. కోచ్గా వచ్చిన తొలినాళ్లలో ఓటములు ఎదురయ్యాయి. కానీ, వాటి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. చాలా మ్యాచుల్లో ఆధిపత్యం ప్రదర్శించాం. కొన్ని మ్యాచుల్లో ఇంకాస్త మెరుగ్గా ఫినిష్ చేయాల్సింది. చేయలేకపోయాం. కానీ, ఇప్పుడు ముగింపు మాత్రం అద్భుతం’’ అని మజుందార్ వెల్లడించాడు.
ఫిట్నెస్, ఫీల్డింగ్ సూపర్
‘‘జట్టులోని ప్రతిఒక్కరూ విజయం కోసం చివరివరకూ అద్భుతంగా పోరాడారు. ఫిట్నెస్ను కాపాడుకుంటూనే ఫీల్డింగ్లో మెరుపులు మెరిపించారు. కీలక సమయంలో వికెట్లు తీసిన షెఫాలీ వర్మ స్పెల్ సూపర్. ఫీల్డింగ్ గురించి కూడా డ్రెస్సింగ్ రూమ్లో చర్చించుకున్నాం. దాని ఫలితం ఈ ఫైనల్లో కనిపించింది. నేను ఇంతకంటే ఎక్కువేం అడగను. సెమీస్, ఫైనల్కు స్టేడియం మొత్తం నిండిపోవడం చాలా బాగుంది. ఫైనల్లో పరుగులు చేయడమే కాకుండా వికెట్లు కూడా తీసిన షెఫాలీ మాయ చేసిందనే చెప్పాలి’’ అని మజుందార్ వ్యాఖ్యానించాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో టీమ్ఇండియా గెలిచింది. షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీతోపాటు రెండు కీలక వికెట్లు తీసింది. ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

కథానాయకి
మేటి క్రికెటర్లందరూ గొప్ప కెప్టెన్లు అవుతారనే గ్యారెంటీ లేదు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ కొందరిని చూస్తే సహజ నాయకుల్లా కనిపిస్తారు. - 
                                    
                                        

కసి రేగెను.. కథ మారెను
నెల కిందట మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతున్నపుడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత మహిళల జట్టు విజేతగా నిలవగలదని అనుకున్నామా? - 
                                    
                                        

అంబరాన్ని అంటిన సంబరాలు
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ అందుకున్న భారత్.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. - 
                                    
                                        

కోట్ల రూపాయలు.. వజ్రాల హారాలు
చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై నజరానాల వర్షం కురుస్తోంది. హర్మన్ప్రీత్ బృందానికి బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. - 
                                    
                                        

ఈ 7 గంటలు మీవే కావాలి..
చక్దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. - 
                                    
                                        

పాపం.. ప్రతీక
ప్రతీక రావల్ ఈ ప్రపంచకప్లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(5)
భారత స్టార్ దివ్య దేశ్ముఖ్.. చెస్ ప్రపంచకప్లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచకప్ విజేత.. తొలి రౌండ్లో 0-2తో అర్డిటిస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూసింది. - 
                                    
                                        

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
ప్రపంచ మహిళల వన్డే వరల్డ్ కప్ను టీమ్ఇండియా (Team India) కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్లో మహిళల క్రికెట్ ప్రస్థానంపై చర్చ నడుస్తోంది. - 
                                    
                                        

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
నవీముంబయి స్టేడియంలో వెలుగులు విరజిమ్మే దీపకాంతుల మధ్య.. భారత మహిళల జట్టు (Team India) కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆఖరు క్యాచ్ అందుకుంది. దీంతో టీమ్ఇండియా చరిత్రలో తొలిసారిగా విశ్వవిజేతగా అవతరించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 


