ఐపీఎల్ 2024: ముంబయికి షాక్.. ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం
ముంబయితో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది.
అహ్మదాబాద్: ఐపీఎల్ 2024లో గుజరాత్ బోణీ కొట్టింది. ముంబయితో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 6 పరుగుల తేడాతో నెగ్గింది. 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (43; 29 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), డెవాల్డ్ బ్రెవిస్ (46; 38 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించడంతో ముంబయి 15 ఓవర్లకు 126/3 స్కోరుతో నిలిచింది. దీంతో ముంబయి సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ, చివరి ఐదు ఓవర్లలో గుజరాత్ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ని చేజిక్కించుకున్నారు. గుజరాత్ బౌలర్లలో ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.
హార్దిక్ దూకుడుతో ఆశలు..
ముంబయి విజయానికి చివరి రెండు ఓవర్లలో 27 పరుగులు అవసరం కాగా.. స్పెన్సర్ జాన్సన్ వేసిన 19 ఓవర్లో తొలి బంతికి సిక్స్ బాదిన తిలక్ వర్మ (25).. తర్వాతి బంతికే అభినవ్ మనోహర్కు క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో చివరి బంతికి కొయెట్జీ (1) జాన్సన్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. చివరి ఓవర్లో ముంబయి విజయ సమీకరణం 19 పరుగులు కాగా.. తొలి రెండు బంతులకు హార్దిక్ పాండ్య (11) వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో ముంబయి శిబిరం ఆనందంలో ముగినితేలింది. కానీ, వరుస బంతుల్లో పాండ్య, పీయూష్ చావ్లా (0) ఔటయ్యారు. దీంతో ముంబయి ఓటమి ఖాయమైంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (45: 39 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. కెప్టెన్ శుభ్మన్ గిల్ (31: 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. సాహా(19), రాహుల్ తివాతియా (22) పరుగులు చేశారు. మిగతావారు విఫలం కావడంతో గుజరాత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ముంబయి బౌలర్లలో బుమ్రా మూడు, గెరాల్డ్ కొయెట్జి రెండు వికెట్లు పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్