ODI WC 2023 in UPPAL Stadium: వరుస రోజుల్లో మ్యాచ్లు నిర్వహిస్తే సెక్యూరిటీ కష్టమే.. HYD పోలీసుల ఆందోళన!
వన్డే వరల్డ్ కప్ (ODi World Cup 2023) సమీపస్తున్న కొద్దీ ఆయా సంఘాల నుంచి విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరగనున్న పాక్-శ్రీలంక మ్యాచ్ షెడ్యూల్ను మార్చాలని బీసీసీఐని హెచ్సీఏ కోరుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. కొన్ని టీమ్లు తమ ప్రాథమిక జట్లనూ ప్రకటించాయి. ఐసీసీ, బీసీసీఐ (BCCI) కూడా మ్యాచ్ల రీషెడ్యూల్ను ఖరారు చేసేశాయి. ఉప్పల్ వేదికగా మూడు వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో భారత్ ఆడే మ్యాచ్లు లేవు. అక్టోబర్ 6న పాకిస్థాన్ - నెదర్లాండ్స్, అక్టోబర్ 9న న్యూజిలాండ్ - నెదర్లాండ్స్, అక్టోబర్ 10న పాకిస్థాన్ - శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్లు ఉన్నాయి. అయితే.. వరుస రోజుల్లో మ్యాచ్లపై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) భద్రతాపరమైన ఆందోళనను వ్యక్తం చేయగా.. బీసీసీఐ దృష్టికి ‘హైదరాబాద్ క్రికెట్ సంఘం’ (HCA) ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులకు ఎదురు దెబ్బ
వరుస రోజుల్లో రెండు మ్యాచులను నిర్వహించడం, సెక్యూరిటీని కల్పించడం ఇబ్బందిగా మారుతుందని హైదరాబాద్ పోలీస్ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. తొలి షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ - శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 12న జరగాల్సింది. కానీ, అహ్మదాబాద్ వేదికగా జరగనున్న భారత్ - పాక్ మ్యాచ్ను అక్టోబర్ 14కి రీషెడ్యూల్ చేశారు. దీంతో పాకిస్థాన్కు తగినంత సమయం ఇవ్వడానికి లంకతో జరగాల్సిన మ్యాచ్ను అక్టోబర్ 10కి మార్చారు. అలాగే కోల్కతా వేదికగా జరగనున్న పాక్ - ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా నవంబర్ 12కి బదులు నవంబర్ 11న నిర్వహించేలా రీషెడ్యూల్ చేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు, హెచ్సీఏ విజ్ఞప్తిపై బీసీసీఐ, ఐసీసీ ఏ విధంగా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా తలపడనుంది. ఇప్పటికే వరల్డ్ కప్ మ్యాచుల టికెట్ల విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 25 నుంచి అధికారికంగా విక్రయాలు జరగనున్నాయి. తొలిసారి భారత్ పూర్తిస్థాయి టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. దేశవ్యాప్తంగా పది వేదికల్లో వరల్డ్ కప్ మ్యాచ్లను నిర్వహించనుండటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి