Paris olympics: పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులకు ఎదురు దెబ్బ

వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం సిద్ధమవుతున్న నిర్వాహకులకు ఎదురు దెబ్బ తగిలింది. పారాట్రయథ్లాన్‌లో భాగంగా ప్రముఖ సెన్‌ నదిలో నిర్వహించాల్సిన ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌ టెస్టు ఈవెంట్‌ను రద్దు చేశారు.

Updated : 20 Aug 2023 09:34 IST

పారిస్‌: వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం సిద్ధమవుతున్న నిర్వాహకులకు ఎదురు దెబ్బ తగిలింది. పారాట్రయథ్లాన్‌లో భాగంగా ప్రముఖ సెన్‌ నదిలో నిర్వహించాల్సిన ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌ టెస్టు ఈవెంట్‌ను రద్దు చేశారు. ఆ నదిలో నీటి నాణ్యత పేలవంగా ఉండడమే అందుకు కారణం. దీంతో కేవలం పరుగు, బైకింగ్‌ విభాగాల్లో మాత్రమే పోటీలు నిర్వహించారు. గురు, శుక్రవారాల్లో ఈ నదిలో స్విమ్మర్లు పోటీపడ్డారు. కానీ నీటి నాణ్యత పరీక్షల్లో ఫలితాలు ప్రతికూలంగా రావడంతో శనివారం ఈవెంట్‌ను రద్దు చేశారు. అథ్లెట్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం మరోసారి నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాత.. స్విమ్మింగ్‌ పోటీలు పెట్టాలా? వద్దా? అనేది నిర్ణయించనున్నారు. అంతకంటే ముందు ఈ నెల ఆరంభంలో జరగాల్సిన టెస్టు ఈవెంట్‌ కూడా రద్దయింది. భారీ వర్షాల కారణంగా నదిలో శుద్ధి చేయని వ్యర్థాలు పొంగి పొర్లడంతో అప్పుడు రద్దు చేశారు. ఒలింపిక్స్‌ తర్వాత ఈ నదిలో తిరిగి ఈత కొట్టేందుకు ప్రజలను అనుమతించాలనే ఉద్దేశంతో అక్కడి అధికారులున్నారు. కానీ ఇప్పుడు నీటి నాణ్యత విషయం ఇబ్బందిగా మారింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని