Ishan Kishan: వరల్డ్ కప్లో రిజర్వ్ బెంచ్కే పరిమితమైనా.. నేనలా ప్రశ్నించుకొనేవాడిని: ఇషాన్ కిషన్
టీమ్ఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆసీస్తో తొలి టీ20లో (IND vs AUS) అదరగొట్టేశాడు. సూర్యతోపాటు ఇషాన్ కూడా అర్ధశతకం బాదడంతో భారత్ 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఆరంభంలో శుభ్మన్ గిల్ గైర్హాజరీలో మ్యాచులను ఆడిన భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆ తర్వాత రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఆసీస్తో టీ20 సిరీస్లో (IND vs AUS) స్థానం దక్కించుకున్న ఇషాన్ తొలి మ్యాచ్లోనే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వరల్డ్ కప్లో రిజర్వ్ బెంచ్కే పరిమితమైనప్పటికీ నెట్స్లో ప్రాక్టీస్ చేయడం మాత్రం ఆపలేదని ఇషాన్ (Ishan Kishan) తెలిపాడు. ఇప్పుడదే టీ20 మ్యాచ్లో రాణించేందుకు సాయపడిందని పేర్కొన్నాడు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా బౌలింగ్లోనే ఇషాన్ పెవిలియన్కు చేరినా.. అతడి బౌలింగ్లో కేవలం 10 బంతుల్లోనే 30 పరుగులు రాబట్టడం గమనార్హం.
‘‘వరల్డ్ కప్ సందర్భంగా నేను తుది జట్టులో లేనప్పుడు కూడా ప్రాక్టీస్ చేయడం మాత్రం ఆపలేదు. ‘ఇవాళ నేనేం చేయాలి. ఈ సెషన్ నాకు ఎందుకు ముఖ్యం’ అని నాకు నేనుగా ప్రశ్నించుకునేవాడిని. నెట్స్లో విపరీతంగా శ్రమిస్తూనే ఉన్నా. కోచింగ్ సిబ్బందితో నా ఆట గురించి మాట్లాడుతూనే ఉన్నా. ఏ బౌలర్ను టార్గెట్ చేయాలి? గేమ్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఎడమ చేతివాటం బ్యాటర్గా లెగ్ స్పిన్నర్ వేసే బంతులపై ఓ అంచనా ఉంది. భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు 20 ఓవర్లపాటు క్రీజ్లో ఉండేందుకు ప్రయత్నించాలి. తప్పకుండా ఎవరో ఒక బౌలర్ను లక్ష్యం చేసుకోవాలి. ఇన్నింగ్స్పై సూర్యకుమార్తో మాట్లాడా. సంఘా బౌలింగ్ను ఎటాక్ చేయాల్సిన అవసరం ఉందని భావించాం.
ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో వీలైనన్ని ఎక్కువ రన్స్ టాప్ ఆర్డర్ చేయాలి. అప్పుడే ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చివర్లో భారీ షాట్లు కొట్టడం కష్టం. అందుకే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావించా. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయాం. దీంతో సూర్యతో భాగస్వామ్యం నిర్మించడం చాలా కీలకం. అదే సమయంలో రన్రేట్ పడిపోకుండా చూసుకోవాలి. ఐపీఎల్లో మేమిద్దరం కలిసి ఆడిన అనుభవం ఉంది. నేను ఎలా ఆడతాననేది సూర్యకు తెలుసు. అతడి షాట్లు గురించి నాకు తెలుసు. మా మధ్య కమ్యూనికేషన్ అద్భుతం. ఏ బౌలర్ను టార్గెట్ చేయాలని మాట్లాడుకుంటూనే ఉన్నాం.
విశాఖ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా లేదు. మన బౌలర్లకే కాకుండా ఆసీస్ స్పిన్నర్లూ ఇబ్బంది పడ్డారు. రవి బిష్ణోయ్ ఎక్కువగా పరుగులు సమర్పించినా ఇబ్బందేం లేదు. ఇలాంటి వికెట్పై బౌలింగ్ చేయడం ఎవరికైనా కష్టమే. జోష్ ఇంగ్లిస్ ఆడిన తీరును చూశాక బ్యాటింగ్కు పిచ్ అనుకూలంగానే అనిపించింది. లక్ష్య ఛేదనలోనూ మేం ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. చివర్లో రింకు సింగ్ ఫినిషింగ్ అద్భుతం. ఐపీఎల్లో ఇప్పటికే అతడి ఆటతీరును చూశాం. ఇప్పుడు ఆసీస్పైనా అదే దూకుడు కొనసాగించడం అభినందనీయం’’ అని ఇషాన్ కిషన్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి