ICC: రవూఫ్, సూర్యలకు జరిమానా

Eenadu icon
By Sports News Desk Published : 27 Sep 2025 03:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దుబాయ్‌: ఆసియాకప్‌లో భారత్‌తో మ్యాచ్‌లో రెచ్చగొట్టే హావభావాలను ప్రదర్శించిన పాకిస్థాన్‌ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌కు జరిమానా పడింది. తన మ్యాచ్‌ ఫీజులో అతడు 30 శాతం కోల్పోనున్నాడు. అర్ధసెంచరీ చేసిన తర్వాత గన్‌ఫైర్‌ సంబరాలు చేసుకున్న ఫర్హాన్‌ను ఐసీసీ మందలించింది. భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు కూడా మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానా పడింది. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు సంఘీభావాన్ని తెలపడంతో పాటు... పాక్‌పై తమ విజయాన్ని ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న భారత సాయుధ దళాలకు సూర్య అంకితం ఇవ్వడంపై పాక్‌ ఫిర్యాదు చేసింది. అయితే సూర్యకు జరిమానా విధించడాన్ని బీసీసీఐ సవాల్‌ చేసినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు