Ishan - Shreyas: ఎవరితోనూ బలవంతంగా ఏమీ చేయించలేం: వృద్ధిమాన్ సాహా
ఇషాన్ కిషన్, శ్రేయస్ వ్యవహారంలో బీసీసీఐ తీసుకున్న చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వారిద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్లను బోర్డు రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్కు (Ishan Kishan - Shreyas Iyer) సెంట్రల్ కాంట్రాక్ట్లు ఇవ్వకుండా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. రంజీల్లో ఆడకపోవడంతోనే వీరిపై వేటు వేసింది. ఈ అంశంపై సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘‘ఆ ఇద్దరు క్రికెటర్లు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయంపై బీసీసీఐ స్పందించింది. వారి కాంట్రాక్ట్లను రద్దు చేసింది. అయితే, బలవంతంగా వారితో ఆడించలేరు. వారు ఆడాలనుకుంటేనే ఆడతారు’’ అని తెలిపాడు.
ప్రతి మ్యాచూ కీలకమే..
‘‘క్రికెటర్గా ప్రతి మ్యాచ్కూ సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. ఫిట్గా ఉండి క్లబ్ మ్యాచ్లు ఆడినా.. ఒక్కోసారి ఆఫీస్ స్థాయిలోనూ ఆడినా.. ప్రతి మ్యాచ్ను ఒకేలా చూస్తా. ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచించగలిగితే వారి కెరీర్తోపాటు భారత క్రికెట్కు మరింత ప్రయోజనం చేకూర్చిన వారవుతారు. దేశవాళీ క్రికెట్ ఎంత ముఖ్యమో సర్ఫరాజ్ ఖాన్ను చూస్తేనే అర్థమవుతుంది. గత నాలుగైదేళ్లుగా డొమిస్టిక్లో విపరీతంగా ఆడి పరుగులు సాధించాడు. ఇప్పుడు జాతీయ జట్టుకు ఎంపికై మంచి ప్రదర్శన చేస్తున్నాడు. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ను దేశవాళీ క్రికెట్లో పెద్దగా చూడలేదు. ఈ టెస్టు సిరీస్లోనూ అతడి ఇన్నింగ్స్ హైలైట్స్ను మాత్రమే చూశా. అద్భుతమైన బ్యాటింగ్ సత్తా ఉంది. గత టెస్టులో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. జాతీయ జట్టులో రిజర్వ్ బెంచ్ బలంగా ఉండాలంటే దేశవాళీ క్రికెట్దే ముఖ్య భూమిక. అయితే, కొందరు అవకాశాలు ఉన్నప్పటికీ ఆడేందుకు ఇష్టపడటం లేదు. తప్పకుండా ఏదొక ఫార్మాట్లో ప్రతి ఒక్కరూ ఆడితేనే ఫామ్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది’’ అని సాహా వ్యాఖ్యానించాడు.
ఆటగాళ్లకు గట్టి సందేశం ఇచ్చినట్లైంది: హర్షా భోగ్లే
‘‘సెంట్రల్ కాంట్రాక్ట్లపై బీసీసీఐ తీసుకున్న నిర్ణయం క్రికెటర్లకు గట్టి సందేశం ఇచ్చినట్లే. ఫిట్గా ఉండి భారత్ తరఫున సుదీర్ఘ ఫార్మాట్లో ఆడాలనుకుంటే దేశవాళీలో సత్తా నిరూపించుకొని రావాలి. ఫస్టక్లాస్ క్రికెట్ స్థాయిని తక్కువ చేయకూడదు. ఒకవేళ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడదామని భావిస్తే.. దేశవాళీలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నీల్లో పాల్గొనాలి. శ్రేయస్, ఇషాన్ అద్భుతమైన ఆటగాళ్లు. అందులో అనుమానం లేదు. వారిద్దరూ భారీగా పరుగులు చేసి మళ్లీ జాతీయ జట్టులోకి రావాలని కోరుకుంటున్నా. గతంలో స్టార్ క్రికెటర్లూ ఇదే చేశారు. గంగూలీ. లక్ష్మణ్, జడేజా, కుంబ్లే.. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఫామ్ను అందుకొన్నవారే. చాహల్ కూడా మళ్లీ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి