Ishan - Shreyas: ఎవరితోనూ బలవంతంగా ఏమీ చేయించలేం: వృద్ధిమాన్ సాహా
ఇషాన్ కిషన్, శ్రేయస్ వ్యవహారంలో బీసీసీఐ తీసుకున్న చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వారిద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్లను బోర్డు రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్కు (Ishan Kishan - Shreyas Iyer) సెంట్రల్ కాంట్రాక్ట్లు ఇవ్వకుండా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. రంజీల్లో ఆడకపోవడంతోనే వీరిపై వేటు వేసింది. ఈ అంశంపై సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘‘ఆ ఇద్దరు క్రికెటర్లు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయంపై బీసీసీఐ స్పందించింది. వారి కాంట్రాక్ట్లను రద్దు చేసింది. అయితే, బలవంతంగా వారితో ఆడించలేరు. వారు ఆడాలనుకుంటేనే ఆడతారు’’ అని తెలిపాడు.
ప్రతి మ్యాచూ కీలకమే..
‘‘క్రికెటర్గా ప్రతి మ్యాచ్కూ సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. ఫిట్గా ఉండి క్లబ్ మ్యాచ్లు ఆడినా.. ఒక్కోసారి ఆఫీస్ స్థాయిలోనూ ఆడినా.. ప్రతి మ్యాచ్ను ఒకేలా చూస్తా. ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచించగలిగితే వారి కెరీర్తోపాటు భారత క్రికెట్కు మరింత ప్రయోజనం చేకూర్చిన వారవుతారు. దేశవాళీ క్రికెట్ ఎంత ముఖ్యమో సర్ఫరాజ్ ఖాన్ను చూస్తేనే అర్థమవుతుంది. గత నాలుగైదేళ్లుగా డొమిస్టిక్లో విపరీతంగా ఆడి పరుగులు సాధించాడు. ఇప్పుడు జాతీయ జట్టుకు ఎంపికై మంచి ప్రదర్శన చేస్తున్నాడు. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ను దేశవాళీ క్రికెట్లో పెద్దగా చూడలేదు. ఈ టెస్టు సిరీస్లోనూ అతడి ఇన్నింగ్స్ హైలైట్స్ను మాత్రమే చూశా. అద్భుతమైన బ్యాటింగ్ సత్తా ఉంది. గత టెస్టులో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. జాతీయ జట్టులో రిజర్వ్ బెంచ్ బలంగా ఉండాలంటే దేశవాళీ క్రికెట్దే ముఖ్య భూమిక. అయితే, కొందరు అవకాశాలు ఉన్నప్పటికీ ఆడేందుకు ఇష్టపడటం లేదు. తప్పకుండా ఏదొక ఫార్మాట్లో ప్రతి ఒక్కరూ ఆడితేనే ఫామ్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది’’ అని సాహా వ్యాఖ్యానించాడు.
ఆటగాళ్లకు గట్టి సందేశం ఇచ్చినట్లైంది: హర్షా భోగ్లే
‘‘సెంట్రల్ కాంట్రాక్ట్లపై బీసీసీఐ తీసుకున్న నిర్ణయం క్రికెటర్లకు గట్టి సందేశం ఇచ్చినట్లే. ఫిట్గా ఉండి భారత్ తరఫున సుదీర్ఘ ఫార్మాట్లో ఆడాలనుకుంటే దేశవాళీలో సత్తా నిరూపించుకొని రావాలి. ఫస్టక్లాస్ క్రికెట్ స్థాయిని తక్కువ చేయకూడదు. ఒకవేళ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడదామని భావిస్తే.. దేశవాళీలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నీల్లో పాల్గొనాలి. శ్రేయస్, ఇషాన్ అద్భుతమైన ఆటగాళ్లు. అందులో అనుమానం లేదు. వారిద్దరూ భారీగా పరుగులు చేసి మళ్లీ జాతీయ జట్టులోకి రావాలని కోరుకుంటున్నా. గతంలో స్టార్ క్రికెటర్లూ ఇదే చేశారు. గంగూలీ. లక్ష్మణ్, జడేజా, కుంబ్లే.. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఫామ్ను అందుకొన్నవారే. చాహల్ కూడా మళ్లీ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!