Ind vs SL: భారత్, శ్రీలంక తొలి టీ20.. హార్దిక్ పాండ్య గాయంపై అప్డేట్
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఫీల్డింగ్, బౌలింగ్ చేస్తున్న సమయంలో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య వెన్ను నొప్పితో కాస్త ఇబ్బందికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం తన గాయంపై హార్దిక్ స్పష్టతనిచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి టీ20లో భారత్ చివరి వరకు పోరాడి విజయం సాధించింది. ఆఖరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన స్థితిలో.. జోరుమీదున్న చమికకు షాట్ ఆడే అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన బంతిని వేసి జట్టును గట్టెక్కించాడు అక్షర్పటేల్. శ్రీలంక ఇన్నింగ్స్లో హార్దిక్ తన మూడో ఓవర్ (ఇన్నింగ్స్ ఐదో ఓవర్) వేస్తున్నప్పుడు వెన్ను నొప్పితో అసౌకర్యానికి గురై బౌలింగ్ చేయడానికి ఇబ్బందిపడ్డాడు. దీంతో అతడికి ఏమైందని టీమ్ఇండియా శిబిరంతోపాటు అభిమానులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఇది జరిగిన తర్వాత పాండ్య మరో ఓవర్ వేయలేదు. కానీ, ఫీల్డింగ్ చేశాడు. శివమ్ మావి వేసిన 15వ ఓవర్లో హసరంగ క్యాచ్ను అందుకున్న తర్వాత హార్దిక్.. కాలు కండరాల నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే మైదానాన్ని వీడాడు. కొద్ది సేపటి అనంతరం మళ్లీ గ్రౌండ్లోకి వచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం తన గాయం గురించి హార్దిక్ మాట్లాడాడు.
‘నా గాయం గురించి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ, నేను బాగానే ఉన్నాను. నేను సరిగ్గా నిద్రపోలేదు. తగినంత నీరు తాగలేదు. అందువల్ల కండరాలు పట్టేశాయి’అని పేర్కొన్నాడు. జట్టులోని యువ ఆటగాళ్లు బాగా ఆడారని, ముఖ్యంగా అరంగేట్ర బౌలర్ శివమ్ మావి అద్భుతంగా బౌలింగ్ చేశాడని హార్దిక్ ప్రశంసించాడు. ఆటగాళ్లు తమపై తాము నమ్మకం ఉంచుకోవాని, వైఫల్యాలను చూసి భయపడకూడదని సూచించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి