INDw vs AUSw: ఆస్ట్రేలియాపై రికార్డు ఛేదన.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్

ముంబయి: మహిళల వన్డే ప్రపంచకప్ (ICC Womens World Cup 2025)లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాకు సెమీస్లో షాక్ ఇచ్చింది. కంగారూల జట్టుపై టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్ (127*; 134 బంతుల్లో 14 ఫోర్లు) సెంచరీతో మెరిసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (89; 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు) శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. జెమీమా, హర్మన్ప్రీత్ మూడో వికెట్కు 167 పరుగుల భాగస్వామ్యం (156 బంతుల్లో) నెలకొల్పారు.
దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26), స్మృతి మంధాన (24), అమన్జ్యోత్ కౌర్ (15*), షెఫాలీ వర్మ (10) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్ రెండేసి వికెట్లు పడగొట్టారు. టీమ్ఇండియా ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 2005, 2017లో ఫైనల్కు వెళ్లినా టైటిల్ సాధించలేకపోయింది. నవంబర్ 2న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు విశ్వవిజేతగా నిలవకపోవడంతో ఈ సారి కొత్త ఛాంపియన్ను చూడబోతున్నాం.
ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ లీచ్ ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడి సెంచరీ బాదింది. ఎలీస్ పెర్రీ (77; 88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకంతో రాణించింది. లీచ్ఫీల్డ్, ఎలీస్ పెర్రీ రెండో వికెట్కు 155 పరుగుల భాగస్వామ్యం (133 బంతుల్లో) నెలకొల్పారు. ఆష్లీన్ గార్డ్నర్ (63; 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) చివర్లో మెరుపులు మెరిపించింది. బెత్ మూనీ (24), కిమ్ గార్త్ (17), తాహిలా మెక్గ్రాత్ (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్, అమన్జ్యోత్ కౌర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
- ఈ మ్యాచ్తో వన్డేల్లో అత్యధిక రన్స్ ఛేజ్ చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఇదే టోర్నీలో భారత్ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు సృష్టించగా.. ఇప్పుడు దాన్ని టీమ్ఇండియా బ్రేక్ చేసింది.
 - వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా జైత్రయాత్రకు ఈ మ్యాచ్తో బ్రేక్ పడింది. వరుసగా 15 విజయాల తర్వాత కంగారూలు ఓటమిని చవిచూశారు.
 
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

కథానాయకి
మేటి క్రికెటర్లందరూ గొప్ప కెప్టెన్లు అవుతారనే గ్యారెంటీ లేదు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ కొందరిని చూస్తే సహజ నాయకుల్లా కనిపిస్తారు. - 
                                    
                                        

కసి రేగెను.. కథ మారెను
నెల కిందట మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతున్నపుడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత మహిళల జట్టు విజేతగా నిలవగలదని అనుకున్నామా? - 
                                    
                                        

అంబరాన్ని అంటిన సంబరాలు
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ అందుకున్న భారత్.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. - 
                                    
                                        

కోట్ల రూపాయలు.. వజ్రాల హారాలు
చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై నజరానాల వర్షం కురుస్తోంది. హర్మన్ప్రీత్ బృందానికి బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. - 
                                    
                                        

ఈ 7 గంటలు మీవే కావాలి..
చక్దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. - 
                                    
                                        

పాపం.. ప్రతీక
ప్రతీక రావల్ ఈ ప్రపంచకప్లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(5)
భారత స్టార్ దివ్య దేశ్ముఖ్.. చెస్ ప్రపంచకప్లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచకప్ విజేత.. తొలి రౌండ్లో 0-2తో అర్డిటిస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూసింది. - 
                                    
                                        

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
ప్రపంచ మహిళల వన్డే వరల్డ్ కప్ను టీమ్ఇండియా (Team India) కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్లో మహిళల క్రికెట్ ప్రస్థానంపై చర్చ నడుస్తోంది. - 
                                    
                                        

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
నవీముంబయి స్టేడియంలో వెలుగులు విరజిమ్మే దీపకాంతుల మధ్య.. భారత మహిళల జట్టు (Team India) కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆఖరు క్యాచ్ అందుకుంది. దీంతో టీమ్ఇండియా చరిత్రలో తొలిసారిగా విశ్వవిజేతగా అవతరించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


