Womens World Cup: ఈ విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తి: ప్రధాని మోదీ

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రపంచకప్ (Womens World Cup)లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ప్రపంచకప్ను ముద్దాడారు. ముంబయి వేదికగా ఉద్విగ్నభరితంగా సాగిన ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. షెఫాలీ వర్మ (87 పరుగులు, 2 వికెట్లు), దీప్తి శర్మ (58 పరుగులు, 5 వికెట్లు) బ్యాటింగ్, బౌలింగ్లోనూ అదరగొట్టి భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించారు. టీమ్ఇండియా ప్రపంచకప్ను గెలవడం పట్ల ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎంలు చంద్రబాబు, రేవంత్ సహా పలువురు నేతలు ప్రశంసలు కురిపించారు.
దేశమంతా గర్వపడేలా చేశారు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
‘‘ఐసీసీ వన్డే ప్రపంచ కప్ను నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. వారి అద్భుతమైన నైపుణ్యం, ప్రదర్శనకు ప్రతిఫలం దక్కింది. భవిష్యత్తులో మహిళల క్రికెట్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. దేశమంతా గర్వపడేలా చేసిన అమ్మాయిలకు నా ప్రశంసలు’’
ఈ విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తి: ప్రధాని మోదీ
మహిళ ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఫైనల్లో గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసంతో ఆటగాళ్లు ప్రదర్శన చేశారు. టోర్నీ ఆసాంతం ఆటగాళ్లు అసాధారణ సమష్టి కృషి, పట్టుదలను ప్రదర్శించారు. భారత క్రీడాకారులకు అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
‘ఉమెన్ ఇన్ బ్లూ’ చరిత్ర సృష్టించింది: రాహుల్ గాంధీ
ఎంతో గర్వకారణమైన క్షణం ఇది. ‘ఉమెన్ ఇన్ బ్లూ’ చరిత్ర సృష్టించింది. అద్భుతమైన విజయంతో కోట్లాది హృదయాలను తాకారు. మీ తెగువ, పోరాటం భారత్కు కీర్తిని తెచ్చిపెట్టాయి. కోట్లాది అమ్మాయిల్లో ఈ విజయం స్ఫూర్తినిస్తుంది. వారు ధైర్యంగా కలలు కనేలా చేశారు. మీరు కేవలం ట్రోఫీని మాత్రమే పొందలేదు జాతీయ స్ఫూర్తిని రగిల్చారు.
క్రీడాకారులకు అభినందనలు: ఏపీ సీఎం చంద్రబాబు
మహిళ ప్రపంచకప్ సాధించిన క్రీడాకారులకు అభినందనలు. మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మన బిడ్డలు మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశారు. ఈ విజయం అద్భుతమైన ప్రదర్శన, అవిశ్రాంత దృఢ సంకల్పానికి స్ఫూర్తి. ఈ గెలుపు ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుంది.
దశాబ్దాల కలను భారత మహిళల జట్టు నెరవేర్చుకుంది: సీఎం రేవంత్రెడ్డి
భారత మహిళల జట్టుకు హృదయపూర్వక అభినందనలు. దక్షిణాఫ్రికాతో ఉద్విగ్నంగా సాగిన ఫైనల్లో భారత అమ్మాయిలు ఎంతో బలం, ధైర్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి టైటిల్ నెగ్గారు. భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అద్భుత నాయకత్వంతో జట్టును ముందుకు నడిపించింది. దశాబ్దాల కలను భారత మహిళల జట్టు నెరవేర్చుకుంది. ఈ చిరకాల విజయం పట్ల భారత్ గర్విస్తోంది. ఫైనల్లో భారత ఆటగాళ్ల పోరాటపటిమ ఔత్సాహిక క్రీడాకారులకు ఒక మార్గనిర్దేశం కానుంది. ఇదే ఉత్సాహం, ఐక్యత, ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తులో భారత మహిళల జట్టు మరింత ఉన్నతస్థానాలను అధిరోహిస్తుందని ఆశిస్తున్నా.
మన క్రీడాకారులకు సెల్యూట్: మంత్రి నారా లోకేశ్
ప్రపంచకప్ సాధించిన భారత క్రీడాకారులకు అభినందనలు.ఈ గెలుపు రానున్న తరాలకు స్ఫూర్తి. ఏపీకి చెందిన శ్రీచరణి రానున్న రోజుల్లో గొప్ప శిఖరాలకు చేరుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
మహిళల వన్డే వరల్డ్ కప్ను తొలిసారిగా భారత జట్టు (Team India) కైవసం చేసుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. అయితే టీమ్ఇండియా విజయోత్సవ ర్యాలీ ఇప్పుడే జరిగే అవకాశాలు కనిపించడం లేదు. - 
                                    
                                        

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమ్ఇండియా (Team India) 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారతజట్టు విశ్వవిజేతగా నిలిచింది. - 
                                    
                                        

కథానాయకి
మేటి క్రికెటర్లందరూ గొప్ప కెప్టెన్లు అవుతారనే గ్యారెంటీ లేదు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ కొందరిని చూస్తే సహజ నాయకుల్లా కనిపిస్తారు. - 
                                    
                                        

కసి రేగెను.. కథ మారెను
నెల కిందట మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతున్నపుడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత మహిళల జట్టు విజేతగా నిలవగలదని అనుకున్నామా? - 
                                    
                                        

అంబరాన్ని అంటిన సంబరాలు
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ అందుకున్న భారత్.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. - 
                                    
                                        

కోట్ల రూపాయలు.. వజ్రాల హారాలు
చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై నజరానాల వర్షం కురుస్తోంది. హర్మన్ప్రీత్ బృందానికి బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. - 
                                    
                                        

ఈ 7 గంటలు మీవే కావాలి..
చక్దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. - 
                                    
                                        

పాపం.. ప్రతీక
ప్రతీక రావల్ ఈ ప్రపంచకప్లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(5)
భారత స్టార్ దివ్య దేశ్ముఖ్.. చెస్ ప్రపంచకప్లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచకప్ విజేత.. తొలి రౌండ్లో 0-2తో అర్డిటిస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూసింది. - 
                                    
                                        

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
ప్రపంచ మహిళల వన్డే వరల్డ్ కప్ను టీమ్ఇండియా (Team India) కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్లో మహిళల క్రికెట్ ప్రస్థానంపై చర్చ నడుస్తోంది. - 
                                    
                                        

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
నవీముంబయి స్టేడియంలో వెలుగులు విరజిమ్మే దీపకాంతుల మధ్య.. భారత మహిళల జట్టు (Team India) కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆఖరు క్యాచ్ అందుకుంది. దీంతో టీమ్ఇండియా చరిత్రలో తొలిసారిగా విశ్వవిజేతగా అవతరించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
 - 
                        
                            

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
 - 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 - 
                        
                            

హైదరాబాద్లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 


