Mohammad Siraj : సిరాజ్ మియా.. నీ మాయ అదిరిందయ్యా..!
తన మ్యాజికల్ స్పెల్తో శ్రీలంకను పేకమేడలా కుప్పకూల్చిన మహమ్మద్ సిరాజ్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం..
ఇంటర్నెట్ డెస్క్ : మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj).. ఈ పేరే ఇప్పుడు ఓ సంచలనం. ఆసియా కప్(Asia Cup 2023 Final) ఫైనల్ మ్యాచ్ చూసిన వారెవరైనా.. ఇది ‘భారత్ vs శ్రీలంక’(IND vs Srilanka) మ్యాచ్ అనరు.. ‘సిరాజ్ vs శ్రీలంక’ అంటారు. అంతలా తన మ్యాజికల్ స్పెల్తో మాయ చేశాడు. బుల్లెట్లాంటి బంతులతో ప్రత్యర్థి వికెట్లను సైకిల్ స్టాండ్లా కూల్చాడు. ఈ హైదరాబాదీ ఎక్స్ప్రెస్ దెబ్బకు 50 ఓవర్ల మ్యాచ్ కాస్త.. 20 ఓవర్లకు కుదించుకుపోయింది. సిరాజ్ సంచలన బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..
సిరాజ్తో ఏడు ఓవర్లే వేయించడానికి కారణమదే
ఆసియా కప్ ఫైనల్లో అతడు విసిరే బంతులను కాచుకోలేక.. వికెట్లు సమర్పించుకోవడమే బెటరనుకున్నారేమో.. వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు లంక బ్యాట్స్మెన్. ఈ క్రమంలో ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. తోటి ఆటగాళ్లు ప్రేమగా ‘మియా భాయ్’గా పిలుచుకునే సిరాజ్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..
- సిరాజ్ తండ్రి ఓ ఆటో డ్రైవర్ అన్న విషయం తెలిసిందే. అయితే సిరాజ్ కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా.. అతడి క్రికెట్ కెరీర్ కోసం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు.
- సిరాజ్ ఆరంభంలో టెన్నిస్బాల్ క్రికెట్ ఆడేవాడు. అతడికి కోచ్ కూడా లేడు. తనకు తానే ఆటలో మెళకువలు నేర్చుకున్నాడు. టెన్నిస్ బాల్తోనే తన బౌలింగ్ను మెరుగుపర్చుకున్నాడు.
- ఈ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ గొప్ప బౌలర్ అన్న విషయం తెలిసిందే. అయితే తన కెరీర్ను బౌలర్గా కాకుండా.. బ్యాట్స్మన్గా ప్రారంభించడం విశేషం. చార్మినార్ క్రికెట్ క్లబ్ తరఫున బ్యాటర్గా బరిలోకి దిగేవాడు. ఆ తర్వాత బౌలర్గా మారాడు.
- ఇక క్రికెటర్గా సిరాజ్ తొలి సంపాదన ఎంతో తెలుసా..? రూ.500. తన మావయ్య కెప్టెన్సీలో ఓ క్లబ్ మ్యాచ్ ఆడాడు. 25 ఓవర్ల ఆటలో.. మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడి ప్రదర్శన మెచ్చిన మావయ్య అతడికి రూ.500 బహూకరించాడు.
- 2015-16 రంజీ ట్రోఫీలో.. హైదరాబాద్ జట్టు తరఫున 41 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
- సిరాజ్ను ఐపీఎల్ వేలంలో మొదట సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.2.6 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఎక్కువ మొత్తం దక్కించుకున్న అన్క్యాప్డ్ ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ డబ్బుతో అతడు తన తల్లిదండ్రుల కోసం ఇల్లు కొన్నాడు.
- తండ్రి మరణాన్ని విని తన్నుకొస్తున్న దుఃఖాన్ని తట్టుకుని మరీ 2020 డిసెంబర్లో బోర్డర్ గావస్కర్ సిరీస్లో జట్టు బౌలింగ్ దాడిని కొనసాగించాడు సిరాజ్. ఈ సిరీస్తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు.. ఫైనల్ మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
- సిడ్నీ టెస్టులో స్థానిక ప్రేక్షకుల నుంచి సిరాజ్ జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొన్నాడు. అయినా ఏకాగ్రత చెదరకుండా మంచి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్