IPL: ఐపీఎల్ ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు..! ఉల్లంఘిస్తే జరిమానా
ఐపీఎల్ మ్యాచ్ జరిగే రోజు వ్యాఖ్యాతలు, ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్ జట్లకు సంబంధించిన సోషల్ మీడియా, కంటెంట్ టీమ్లు స్టేడియం నుంచి ఎలాంటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దని బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ మ్యాచ్ జరిగే రోజు ఆ మ్యాచ్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను స్టేడియం నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై బీసీసీఐ (BCCI) సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరిగే రోజు వ్యాఖ్యాతలు, ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్ జట్లకు సంబంధించిన సోషల్ మీడియా, కంటెంట్ టీమ్లు స్టేడియం నుంచి ఎలాంటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల ఓ మ్యాచ్లో వ్యాఖ్యానిస్తున్నప్పుడు మాజీ భారత బ్యాటర్ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ ప్రసార హక్కులు పొందినవారు బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
‘‘ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బ్రాడ్కాస్టర్లు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించారు. కాబట్టి, వ్యాఖ్యాతలు మ్యాచ్ రోజున వీడియోలు లేదా ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. కొంతమంది వ్యాఖ్యాతలు ‘ఇన్స్టాగ్రామ్ లైవ్’, మైదానం నుంచి ఫొటో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఒక వీడియోకు ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఐపీఎల్ జట్లు కూడా లైవ్ మ్యాచ్ల వీడియోలను పోస్ట్ చేయొద్దు. పరిమిత సంఖ్యలో ఫొటోలను, మ్యాచ్కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ను సోషల్ మీడియాలో పంచుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లఘించినట్లు తేలితే ఫ్రాంచైజీ జరిమానా విధిస్తాం’’ అని ఓ బీసీసీఐ అధికారి జాతీయ మీడియాతో అన్నారు.
ఆటగాళ్లు కూడా ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడానికి వీల్లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కొందరు ఆటగాళ్లు ఇటీవల మ్యాచ్ రోజులలో ఫొటోలను పంచుకున్నారని, వాటిని తొలగించాలని సూచించినట్లు బోర్డు అధికారులు చెప్పారు. ఆటగాళ్లు చేసే సోషల్ మీడియా పోస్టులపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. తాము పాల్గొన్న లైవ్ గేమ్ వీడియో క్లిప్ను షేర్ చేసినందుకు ఓ ఐపీఎల్ టీమ్కు రూ.9 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు