Ishan Kishan: ఇంగ్లాండ్తో సిరీస్కూ ఇషాన్ను బీసీసీఐ సంప్రదించిందా..?
టీమ్ఇండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. ఇటు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. అటు జాతీయ జట్టులోకి రావడం కష్టంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లను కోల్పోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా ఇషాన్ కిషన్ వ్యవహారశైలిపై బీసీసీఐ ఆగ్రహంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్తో సిరీస్కూ పరిగణనలోకి తీసుకోవడానికి ప్రయత్నించినా అందుబాటులో లేకపోవడంతోనే సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణంగా క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. గత దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి బయటకొచ్చేసిన ఇషాన్.. దుబాయ్లో పార్టీకు వెళ్లడం సెలక్టర్లకు నచ్చలేదు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కైనా అందుబాటులో ఉంటాడని భావిస్తే.. దానికీ దూరంగా ఉన్నాడు. మరోవైపు వచ్చే ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించినా పెడచెవిన పెట్టి మరీ లీగ్ కోసం ప్రాక్టీస్ చేసుకోవడం బీసీసీఐకి మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.
ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించే సమయంలోనూ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఎవరైనా సరే జాతీయ జట్టుకు దూరంగా ఉండి.. మళ్లీ రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలి’’ అని సూచించాడు. కానీ, అ మాటలను ఇషాన్ పట్టించుకోలేదు. అయితే, ఇంగ్లాండ్తో చివరి మూడు టెస్టుల కోసం ఇషాన్ సెలక్టర్లు సంప్రదించినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. కానీ, అతడి నుంచి మాత్రం సరైన స్పందన రాలేదని తెలిసింది. ఇంకా సిద్ధంగా లేనట్లు ఇషాన్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో ధ్రువ్ జురెల్కు మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. అతడు తన రెండో టెస్టులోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు.
రంజీ సెమీస్లో శ్రేయస్ అయ్యర్
సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన శ్రేయస్ అయ్యర్.. మళ్లీ రంజీబాట పట్టాడు. తమిళనాడుతో జరుగుతున్న సెమీస్లో అయ్యర్ ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శ్రేయస్ రాకపై ముంబయి కెప్టెన్ అజింక్య రహానె మాట్లాడుతూ.. ‘‘ఎంతో అనుభవం కలిగిన ప్లేయర్. ముంబయి జట్టులో అతడి భాగస్వామ్యం కీలకం. అతడికేమీ ప్రత్యేకంగా ప్రోత్సాహం అందివ్వాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్లో రాణించి జట్టుకు తోడుగా నిలుస్తాడు’’ అని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat Vs Bengaluru: విల్ జాక్స్ సూపర్ సిక్స్.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!
గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్ కొట్టిన సిక్స్లను చూస్తూ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరూ చూడండి.
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!