Jasprit Bumrah: బెంగళూరుపై అరుదైన ఘనత.. ఐపీఎల్లో తొలి బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా
ముంబయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah) తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. బెంగళూరుపై ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరుపై ముంబయి పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఐపీఎల్లో ఫైఫర్ (5 వికెట్లు) తీయడం అతడికిది రెండోసారి. బెంగళూరు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మహిపాల్ లామ్రోర్, సౌరభ్ చౌహాన్, విజయ్కుమార్ వైశాఖ్ వికెట్లను పడగొట్టాడు. ఇలా ఐపీఎల్లో ‘5 వికెట్ల’ ప్రదర్శనను రెండు సార్లు చేసిన జేమ్స్ ఫాల్కనర్, జయ్దేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్ సరసన నిలిచాడు. ఈ క్రమంలో బెంగళూరుపై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా కూడా అవతరించాడు. ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి ప్రదర్శన చేయకపోవడం గమనార్హం. అలాగే ఆర్సీబీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ నిలిచాడు. రవీంద్ర జడేజా, సందీప్ శర్మ చెరో 26 వికెట్లు తీయగా.. ఇప్పుడు బుమ్రా 29 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో అతడు మొత్తం 155 వికెట్లు పడగొట్టాడు. దీంతో టాప్ -10 వికెట్ టేకర్స్ జాబితాలోకి వచ్చాడు. హర్భజన్ సింగ్ను (150)ను అధిగమించాడు. బెంగళూరుతో మ్యాచ్ అనంతరం బుమ్రా తన ప్రదర్శనపై స్పందించాడు.
టీ20ల్లో బౌలింగ్ తేలికేం కాదు..
‘‘మరోసారి నాణ్యమైన ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉంది. ఐదు వికెట్లను తీయాలనే లక్ష్యంతో బరిలోకి దిగలేదు. తొలి 10 ఓవర్లలో పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించింది. దానిని సద్వినియోగం చేసుకోవాలని భావించా. ఈ ఫార్మాట్లో బౌలింగ్ చేయడం చాలా కష్టం. వైవిధ్యం ప్రదర్శిస్తేనే బౌలర్లకు ఫలితం అనుకూలంగా వస్తుంది. విభిన్నంగా బంతులను సంధించేందుకు చాలా శ్రమించా. బౌలింగ్ అనుకున్నట్లుగా వేసినా.. పిచ్ నుంచి సహకారం లేకపోతే బ్యాటర్లు బాదేస్తారు. అలాంటి మ్యాచ్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. సన్నద్ధత అనేది ఎప్పుడూ కీలకమే. నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. యార్కర్ల ద్వారానే వికెట్లు వస్తాయనుకోవటం పొరపాటే. కొన్నిసార్లు అలా వేస్తూనే.. షార్ట్ బంతులనూ వేయాలి. 145 కి.మీ వేగంతో బంతులేసినా.. సందర్భాన్ని బట్టి నెమ్మదిగానూ వేయడమూ ముఖ్యమే’’ అని బుమ్రా తెలిపాడు.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు..
- ప్రత్యర్థులు నిర్దేశించిన 190+ స్కోరును ముంబయి లక్ష్య ఛేదన చేయడం ఇది 9వ సారి. ఈ విషయంలో పంజాబ్ కింగ్స్తో కలిసి ముంబయి అగ్రస్థానంలో కొనసాగుతోంది.
- ఐపీఎల్లో 190+ స్కోరు చేసినా ఓటమిపాలు కావడం బెంగళూరుకిది 11వ సారి కావడం గమనార్హం.
- అత్యధిక బంతులు ఉండగానే 190+ స్కోరు టార్గెట్ను ఛేదించడం ఇది మూడోసారి. అన్నింట్లోనూ ముంబయి జట్టే కావడం విశేషం. రాజస్థాన్పై 2014లో 32 బంతులు, పంజాబ్పై 2017లో 27 బంతులు, బెంగళూరుపై ప్రస్తుతం 27 బంతులు మిగిలి ఉండగానే ముంబయి గెలిచింది.
- వాంఖడేలో ముంబయికి 50వ విజయం. ఐపీఎల్లో ఒకే మైదానంలో ఫిఫ్టీకి చేరిన తొలి జట్టుగా ముంబయి నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్