Jasprit Bumrah: బెంగళూరుపై అరుదైన ఘనత.. ఐపీఎల్లో తొలి బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా
ముంబయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah) తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. బెంగళూరుపై ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరుపై ముంబయి పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఐపీఎల్లో ఫైఫర్ (5 వికెట్లు) తీయడం అతడికిది రెండోసారి. బెంగళూరు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మహిపాల్ లామ్రోర్, సౌరభ్ చౌహాన్, విజయ్కుమార్ వైశాఖ్ వికెట్లను పడగొట్టాడు. ఇలా ఐపీఎల్లో ‘5 వికెట్ల’ ప్రదర్శనను రెండు సార్లు చేసిన జేమ్స్ ఫాల్కనర్, జయ్దేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్ సరసన నిలిచాడు. ఈ క్రమంలో బెంగళూరుపై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా కూడా అవతరించాడు. ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి ప్రదర్శన చేయకపోవడం గమనార్హం. అలాగే ఆర్సీబీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ నిలిచాడు. రవీంద్ర జడేజా, సందీప్ శర్మ చెరో 26 వికెట్లు తీయగా.. ఇప్పుడు బుమ్రా 29 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో అతడు మొత్తం 155 వికెట్లు పడగొట్టాడు. దీంతో టాప్ -10 వికెట్ టేకర్స్ జాబితాలోకి వచ్చాడు. హర్భజన్ సింగ్ను (150)ను అధిగమించాడు. బెంగళూరుతో మ్యాచ్ అనంతరం బుమ్రా తన ప్రదర్శనపై స్పందించాడు.
టీ20ల్లో బౌలింగ్ తేలికేం కాదు..
‘‘మరోసారి నాణ్యమైన ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉంది. ఐదు వికెట్లను తీయాలనే లక్ష్యంతో బరిలోకి దిగలేదు. తొలి 10 ఓవర్లలో పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించింది. దానిని సద్వినియోగం చేసుకోవాలని భావించా. ఈ ఫార్మాట్లో బౌలింగ్ చేయడం చాలా కష్టం. వైవిధ్యం ప్రదర్శిస్తేనే బౌలర్లకు ఫలితం అనుకూలంగా వస్తుంది. విభిన్నంగా బంతులను సంధించేందుకు చాలా శ్రమించా. బౌలింగ్ అనుకున్నట్లుగా వేసినా.. పిచ్ నుంచి సహకారం లేకపోతే బ్యాటర్లు బాదేస్తారు. అలాంటి మ్యాచ్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. సన్నద్ధత అనేది ఎప్పుడూ కీలకమే. నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. యార్కర్ల ద్వారానే వికెట్లు వస్తాయనుకోవటం పొరపాటే. కొన్నిసార్లు అలా వేస్తూనే.. షార్ట్ బంతులనూ వేయాలి. 145 కి.మీ వేగంతో బంతులేసినా.. సందర్భాన్ని బట్టి నెమ్మదిగానూ వేయడమూ ముఖ్యమే’’ అని బుమ్రా తెలిపాడు.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు..
- ప్రత్యర్థులు నిర్దేశించిన 190+ స్కోరును ముంబయి లక్ష్య ఛేదన చేయడం ఇది 9వ సారి. ఈ విషయంలో పంజాబ్ కింగ్స్తో కలిసి ముంబయి అగ్రస్థానంలో కొనసాగుతోంది.
- ఐపీఎల్లో 190+ స్కోరు చేసినా ఓటమిపాలు కావడం బెంగళూరుకిది 11వ సారి కావడం గమనార్హం.
- అత్యధిక బంతులు ఉండగానే 190+ స్కోరు టార్గెట్ను ఛేదించడం ఇది మూడోసారి. అన్నింట్లోనూ ముంబయి జట్టే కావడం విశేషం. రాజస్థాన్పై 2014లో 32 బంతులు, పంజాబ్పై 2017లో 27 బంతులు, బెంగళూరుపై ప్రస్తుతం 27 బంతులు మిగిలి ఉండగానే ముంబయి గెలిచింది.
- వాంఖడేలో ముంబయికి 50వ విజయం. ఐపీఎల్లో ఒకే మైదానంలో ఫిఫ్టీకి చేరిన తొలి జట్టుగా ముంబయి నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్