IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్‌ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..

కోల్‌కతా, రాజస్థాన్‌ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్‌ స్థానంలో అల్లాహ్‌ ఘజన్‌ఫర్‌, ప్రసీధ్‌ కృష్ణ స్థానంలో కేశవ్‌ మహరాజ్‌ జట్టులోకి వచ్చారు.

Published : 29 Mar 2024 00:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌-17 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. రికార్డులను తిరగరాసేందుకు ఇది వేదికవుతోంది. మరోవైపు గాయాల కారణంగా ఆటగాళ్లు దూరమవుతుండటంతో జట్లలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. తాజాగా  కోల్‌కతా, రాజస్థాన్‌ టీమ్‌లలో కొత్త సభ్యులు వచ్చి చేరారు. కోల్‌కతా తరఫున ఆడుతున్న అఫ్గాన్‌ ఆటగాడు ముజీబ్‌ అర్‌ రెహ్మాన్‌కు గాయాలవ్వడంతో అతడి స్థానంలో అల్లాహ్‌ ఘజన్‌ఫర్‌ను జట్టులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌కు ఆడుతున్న ప్రసీధ్‌ కృష్ణ స్థానాన్ని కేశవ్‌ మహరాజ్‌ భర్తీ చేశాడు.

అల్లాహ్‌ ఘజన్‌ఫర్‌ ఇప్పటి వరకు 2 వన్డేలు, మూడు టీ20లు, 6 లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 9 వికెట్లు తీశాడు. రూ.20 లక్షలకు అతడిని కోల్‌కతా దక్కించుకుంది. మరోవైపు కర్ణాటకకు చెందిన యువ ఫాస్ట్‌ బౌలర్‌ ప్రసీధ్‌ కృష్ణకు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో  కోలుకుంటున్నాడు. అతడి స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్‌ మహరాజ్‌ను యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. కేశవ్‌ ఇప్పటి వరకు 27 టీ20లు, 44 వన్డేలు, 50 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 237 వికెట్లు సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్‌ యాజమాన్యం అతడిని రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని