IPL 2024: అతి సంబరాలు వద్దు.. నోరు మూసుకొని ఉండాలి: ఆర్సీబీకి క్రిష్ కీలక సూచన
విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ బెంగళూరు నాకౌట్ దశకు చేరుకుంది. అక్కడ మాత్రం రాజస్థాన్ చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుకు భంగపాటు తప్పలేదు. రాజస్థాన్ అద్భుత విజయంతో రెండో క్వాలిఫయర్కు దూసుకెళ్లింది. ‘ఈ సాలా కప్ నమదే’ అంటూ వచ్చిన ఆర్సీబీకి మళ్లీ చుక్కెదురైంది. వరుసగా ఆరు విజయాలు సాధించి అనూహ్యరీతిలో ప్లేఆఫ్స్కు చేరిన బెంగళూరు ఎలిమినేటర్లో ఓడిపోయింది. నాకౌట్కు చేరుకొనేందుకు తన చివరి లీగ్ మ్యాచ్లో చెన్నైపై గెలిచిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సంబరాలు చేసుకుంటూ సీఎస్కే ఆటగాళ్లకు కరచాలనం చేసేందుకు ఆర్సీబీ ప్లేయర్లు సమయం తీసుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రేగాయి. ఇప్పుడు ఓడిపోవడంతో ఆ జట్టు నెట్టింట విపరీతంగా ట్రోలింగ్కు గురైంది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక సూచన చేశాడు. ఒక మ్యాచ్ గెలవగానే అతిగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు.
‘‘జీవితంలో మీరు ఏదైనా సాధిస్తే.. నోరును అదుపులో పెట్టుకొని ముందుకు సాగిపోవాలి. మీరు ఎప్పుడైతే అనవసరంగా గోల చేస్తారో ఇక అక్కడ నుంచి పైకి వెళ్లలేరు. సీఎస్కేపై విజయం సాధించిన తర్వాత ఆర్సీబీ అభిమానులు తమ జట్టు గొప్పదనాన్ని తెలిపేందుకు చాలా వీడియోలు పోస్టు చేశారు. ఇప్పుడు అవే వారికి తిరిగి వచ్చాయి. క్రికెట్లో అతిగా సంబరాలు చేసుకోవడం ఎప్పటికీ మంచిదికాదు. మీరు బాగా ఆడితే కంగ్రాట్స్ చెబుతారు. చెత్తగా ఆడితే మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సిందే. ఆ సమయంలో నోరు మూసుకొని దూకుడు తగ్గించుకోవాలి. అద్భుతంగా కమ్బ్యాక్ చేసి నాకౌట్కు చేరుకున్నందుకు వారిని వారు అభినందించుకోవడం మంచిదే. కానీ, సీఎస్కే, ముంబయి వంటి జట్లు ఇలా చాలాసార్లు చేసి చూపించాయి. వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్లో మాత్రం ఓటమిని చవిచూసింది’’ అని వ్యాఖ్యానించాడు.
కోహ్లీ ఆర్సీబీని వదిలి దిల్లీకి వెళ్లాలి: పీటర్సెన్
‘‘ఐపీఎల్ టైటిల్ను అందుకొనే అర్హత విరాట్ కోహ్లీకి ఉంది. బెంగళూరును గెలిపించేందుకు చాలా కష్టపడ్డాడు. ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ అతడిదే. జట్టులో మిగతావారి నుంచి కూడా మద్దతు వచ్చి ఉంటే తప్పకుండా ఆర్సీబీ టైటిల్ నెగ్గేదే. ఈ జట్టుకు విరాట్ బ్రాండ్ను తీసుకొచ్చాడు. కమర్షియల్గానూ ఆర్సీబీకి విలువ వచ్చింది. కప్ను అందుకోవాలని ఉంటే మాత్రం అతడు వేరే ఫ్రాంచైజీకి మారిపోవాలి. దిల్లీ క్యాపిటల్స్ అయితే బాగుంటుంది. దిల్లీలో కోహ్లీకి ఇల్లు కూడా ఉన్నట్లు తెలుసు. తన కుటుంబంతో గడిపేందుకు మరింత సమయం లభిస్తుంది’’ అని కెవిన్ పీటర్సెన్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
అమెరికా తరఫున ఆడుతున్న భారత సంతతి ఆటగాడు నేత్రావల్కర్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. -
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
భారత జట్టు కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ నెలఖారులో దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. -
క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నమీబియా స్టార్ ఆల్రౌండర్
నమీబియా స్టార్ ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
టీమ్ ఇండియా ట్రావెలింగ్ రిజర్వులో ఉన్న గిల్ను ప్రపంచకప్ టోర్నీ నుంచి వెనక్కి పంపడంపై బ్యాటింగ్ కోచ్ వివరణ ఇచ్చారు. -
స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలుపు.. సూపర్-8కు ఇంగ్లాండ్
Australia vs Scotland: ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో సూపర్8లో ఇంగ్లాండ్కు బెర్త్ ఖరారైంది. -
చివరిది వరుణుడికి
అనుకున్నదే జరిగింది. గ్రూప్- ఎ లో భారత్ చివరి మ్యాచ్ను వరుణుడు ఆడనివ్వలేదు. కీలకమైన సూపర్- 8 పోరుకు ముందు అన్ని విభాగాల్లోనూ మరోసారి సత్తాచాటాలని చూసిన టీమ్ఇండియా ఆశ తీరలేదు. -
చిన్నోళ్లు దమ్మున్నోళ్లు
ఎవరైనా ఊహించారా.. టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ను వెనక్కినెట్టి అమెరికా సూపర్- 8కు చేరుతుందని! ఎవరైనా అనుకున్నారా.. ప్రపంచకప్ల్లో అత్యంత నిలకడగా ఆడే న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుందని! కానీ ఇవి జరిగాయి. -
నేపాల్ ఒక్క పరుగు తేడాతో..
టీ20 ప్రపంచకప్లో మరో సంచలనం కొద్దిలో తప్పింది. కూనల చేతిలో షాక్ తిన్న జట్ల జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరేదే. నేపాల్పై ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో అతికష్టంగా గట్టెక్కింది. -
కివీస్ తొలి గెలుపు
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ సూపర్-8కు దూరమైన న్యూజిలాండ్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది. -
జర్మనీ ఘన బోణీ
యూరో కప్ను ఆతిథ్య జర్మనీ విజయంతో మొదలెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్- ఎ మ్యాచ్లో ఆ జట్టు 5-1 తేడాతో స్కాట్లాండ్ను చిత్తుచేసింది. -
ఏ జట్టునైనా ఓడించగలం
పూర్తి స్థాయిలో ఆడితే ఏ జట్టునైనా ఓడించగలమని అమెరికా వైస్ కెప్టెన్ అరోన్ జోన్స్ అన్నాడు. ‘‘సూపర్-8 సవాల్కు సిద్ధంగా ఉన్నాం. రెండో రౌండ్ చేరడం మాకో పెద్ద ఘనత. -
గంభీర్ సమర్థుడే కానీ..
టీమ్ఇండియా కోచ్ పదవి రేసులో గౌతమ్ గంభీర్ ముందున్నాడు. మెంటార్గా ఇటీవల కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
సంక్షిప్త వార్తలు(5)
జాతీయ జట్టు తరపున ఇదే తనకు చివరి టీ20 ప్రపంచకప్ అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ప్రకటించాడు. కానీ కివీస్ జట్టుతో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే విషయంపై మాత్రం అతను స్పష్టత ఇవ్వలేదు. -
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. దీంతో పాక్ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేటీఎం - జొమాటో రూ.1,500 కోట్ల డీల్?
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
కొత్తదనం, ప్రయోగాలకు రామోజీరావు చిరునామా.. బెంగళూరులో జర్నలిస్టుల ఘన నివాళి
-
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.31 కోట్లు.. బాధితులకు అందజేసిన అధికారులు
-
శ్రీలీల ‘డ్రిప్పిన్’ కల్చర్.. రోజీ చీరలో మంజిమా..
-
కౌంటింగ్ వేళ ఈవీఎం అన్లాక్ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్