Virat Kohli: కష్టకాలంలో విరాట్కు అదృష్టం కలిసి రాలేదు.. : గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫామ్ లేమితో గతంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతడికి కొన్ని విషయాల్లో అదృష్టం కూడా కలిసి రాలేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar) అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్ : వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(WTC Final) కోసం టీమ్ఇండియా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారైన టైటిల్ గెలిచి.. భారత్కు ఐసీసీ ట్రోఫీ కరవును తీర్చాలని ఆశిస్తున్నారు. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు మహాసమరం(India vs Australia)లో పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటపైనే అందరి దృష్టి నెలకొంది. మార్చిలో ఆస్ట్రేలియాపై కోహ్లీ తన 29వ సెంచరీ బాది.. టెస్టుల్లో శతకం కోసం 1205 రోజుల నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్పై మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశాడు.
2019 నుంచి ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడ్డ కోహ్లీ(Virat Kohli).. 2022 ఆసియా కప్లో అఫ్గానిస్థాన్పై సెంచరీతో తిరిగి గాడిలో పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. టీ20 వరల్డ్కప్లోనూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గానూ నిలిచాడు. కోహ్లీ ప్రదర్శనను మెచ్చిన గావస్కర్.. కష్టకాలంలో అతడికి అదృష్టం కలిసిరాలేదని పేర్కొన్నాడు.
‘ప్రతి ఆటగాడి విషయంలో బ్యాడ్ ఫామ్ అనేది సాధారణమే. ఆ తర్వాత కోహ్లీ మంచి ఇన్నింగ్స్లు ఆడటం ప్రారంభించాడు. ఇక్కడో విషయం గమనిస్తే.. అతడు ఫామ్ అందుకున్న తొలినాళ్లలో కొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతులు.. స్టంప్ను తాకలేదు. క్యాచ్లు డ్రాపయ్యాయి లేదా ఫీల్డర్కు కాస్త దూరంలో పడ్డాయి. ఇలాంటి చిన్నపాటి లక్.. ప్రతి ఆటగాడికి అవసరమే. అయితే.. కష్టకాలంలో అతడికి లభించని ఈ అదృష్టాన్ని.. ఇప్పుడతడు తిరిగి పొందాడు’ అని గావస్కర్ వివరించాడు.
విరాట్ అద్భుతమైన టెంపర్మెంట్ కలిగి ఉన్నాడని, అతడి పరుగుల దాహం తీరనిదని ప్రశంసించాడు. టెక్నికల్గా కూడా ఎంతో బాగా ఆడతున్నాడని.. అతడు తిరిగి ఫామ్లోకి రావడం తనను ఆశ్చర్యానికి గురిచేయలేదని సన్నీ పేర్కొన్నాడు.
ఇక ఆస్ట్రేలియాతో టెస్టులు అంటే.. విరాట్ అదరగొట్టేస్తాడు. ఇప్పటి వరకూ ఆసీస్పై 24 టెస్టులు ఆడిన కోహ్లీ.. 48.26 సరాసరితో మొత్తం 1979 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలు, ఐదు అర్ద శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 186. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి.. కోహ్లీ మొత్తం 92 మ్యాచ్లు ఆడగా.. 50.97 సగటుతో 4,945 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 24 అర్ద శతకాలు ఉన్నాయి. అందుకే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ పరుగుల వీరుడు కీలకంగా మారుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్
Bengaluru vs Delhi: కీలక మ్యాచ్లో బెంగళూరు చేతిలో దిల్లీ ఓటమి పాలైంది. దీంతో ప్లేఆఫ్స్ ఆశలను దూరం చేసుకుంది. -
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
ధోనీ-రైనా జోడీ మైదానంలో చెన్నై అభిమానులకు కనువిందు చేసింది. -
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
స్ట్రెచ్చర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
-
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్
-
ఏపీ ఎన్నికలు: ‘హలో ఏపీ బైబై వైసీపీ’ సోషల్మీడియాలో ట్రెండ్
-
నష్టాల నుంచి లాభాల్లోకి.. 900 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి