T20 World Cup: ఆ బౌండరీ ఇచ్చి ఉంటే.. దక్షిణాఫ్రికా-బంగ్లా మ్యాచ్లో DRS వివాదం
T20 World Cup: దక్షిణాఫ్రికా-బంగ్లా మ్యాచ్లో డీఆర్ఎస్ నిర్ణయం వివాదాస్పదమైంది. అంపైర్ పొరబాటు కారణంగా ఈ మ్యాచ్ బంగ్లా నాలుగు పరుగులు కోల్పోయిందని, అదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024)లో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో స్వల్ప స్కోరును కాపాడుకున్న సఫారీ జట్టు.. బంగ్లాదేశ్పై కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఇందులో (BAN vs SA) ఓ డీఆర్ఎస్ నిర్ణయం ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. దాని కారణంగా బంగ్లా ఓ బౌండరీని కోల్పోగా.. సరిగ్గా ఆ నాలుగు పరుగుల తేడాతోనే దక్షిణాఫ్రికాకు విజయం దక్కడం గమనార్హం. అసలేం జరిగిందంటే..
సోమవారం నాటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా (South Africa) 113 పరుగులే చేయగలిగింది. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఒక దశలో బలంగానే కన్పించింది. చివరి నాలుగు ఓవర్లలో ఆ జట్టుకు 27 పరుగులు అవసరమయ్యాయి. 17వ ఓవర్లో సఫారీ బౌలర్ బార్ట్మన్ వేసిన రెండో బంతి బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా ప్యాడ్లను తాకి స్టంప్స్ వెనుక నుంచి బౌండరీ వెళ్లింది.
సఫారీ జట్టుకు ఎల్బీకి అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్గా ప్రకటించాడు. దీంతో బంగ్లా డీఆర్ఎస్ (DRS)కు వెళ్లడంతో నాటౌట్ అని తేలింది. అయితే, అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నప్పటికీ అప్పటికే ఆ బంతిని డెడ్బాల్ (Dead Ball)గా పరిగణించడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ (Bangladesh) స్కోరుకు ఆ బౌండరీని కలపలేదు. సరిగ్గా ఇదే నాలుగు పరుగుల తేడాతో ఆ జట్టు ఓడిపోవడంతో ఇప్పుడు ఈ డీఆర్ఎస్ నిర్ణయం నెట్టింట చర్చనీయాంశమైంది.
దక్షిణాఫ్రికా బతికిపోయింది.. 4 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం
ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి..
ఐసీసీ (ICC Rules) రూల్బుక్లోని 3.7.1 ప్రకారం.. డీఆర్ఎస్ తర్వాత ఆన్ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన ఔట్.. నాటౌట్గా మారినప్పటికీ మొదట తీసుకున్న డెడ్బాల్ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నాటౌట్ అని తేలితే బ్యాటింగ్ చేసే జట్టుకు వికెట్ మిగులుతుంది కానీ.. ఆ డెలివరీతో వచ్చే పరుగులేమీ వారికి రావు. ఒకవేళ ఆన్ఫీల్డ్ అంపైర్ నాటౌట్ నిర్ణయం తీసుకుంటే ఆ పరుగులు లాభిస్తాయి.
ఇక, 3.7.2 ప్రకారం.. ఒరిజినల్ నిర్ణయం నాటౌట్గా ఉండి.. డీఆర్ఎస్లో ఔట్ అని వస్తే.. అప్పుడు బంతిని డెడ్బాల్గా ప్రకటిస్తారు. ఒకవేళ అప్పటికే బ్యాటర్ పరుగులు చేసినా వాటిని పరిగణనలోకి తీసుకోరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50 చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?