Pakistan: ‘ఆ ప్లేయర్స్ క్యాన్సర్ లాంటోళ్లు’.. వారుంటే పాక్ గెలవదు: మాజీ చీఫ్ సెలెక్టర్
భారత్తో జరిగిన మ్యాచ్లో ఓటమి అనంతరం పాకిస్థాన్ మాజీ చీఫ్ సెలెక్టర్ మహ్మద్ వసీం తమ జట్టులోని ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2024లో ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. 120 పరుగుల లక్ష్య ఛేదనలో తొలుత గెలిచేలా కనిపించిన పాక్.. భారత బౌలర్లు పుంజుకోవడంతో వేగంగా పరుగులు చేయలేక వెనకబడిపోయింది. ఈ మ్యాచ్లో ఓటమి అనంతరం పాకిస్థాన్ మాజీ చీఫ్ సెలెక్టర్ మహ్మద్ వసీం తమ జట్టులోని ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ ఆడుతున్న పాక్ బౌలింగ్ ఆల్రౌండర్, స్పిన్నర్ ఇమాద్ వసీం మోకాలి గాయాన్ని దాచిపెడుతున్నాడని మాజీ చీఫ్ సెలెక్టర్ ఆరోపించాడు. పక్కటెముక గాయం కారణంగా అమెరికాతో మ్యాచ్కు దూరంగా ఉన్నట్లు ఇమాద్ వసీం పేర్కొన్నాడు. అయితే ఇది ఫేక్ అని, అతడు కొన్నాళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడని మహ్మద్ వసీం వ్యాఖ్యానించాడు.
‘‘పక్కటెముకకు గాయం కారణంగా అమెరికాతో మ్యాచ్లో ఇమాద్ వసీం ఆడలేదని వార్తలొచ్చాయి. కానీ, అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. గత కొన్నేళ్లుగా ఈ విషయాన్ని దాచిపెడుతున్నాడు. ఆజం ఖాన్ ఫిట్గా లేడు. గత ఐదేళ్లుగా ఇదే సమస్యతో బాధ పడుతున్నాడు. ఈ కారణంగానే అతడిని జట్టు నుంచి తప్పించారు. నేను కూడా నా పదవీకాలంలో ఇమాద్ వసీంను తొలగించాను. దీంతో అతడు ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టాడు. ఆటగాళ్ల పేర్లు ప్రస్తావించను గానీ, కొంతమంది ప్లేయర్స్ జట్టును క్యాన్సర్లా పట్టిపీడిస్తున్నారని పాక్ కోచ్లు నలుగురు నమ్ముతున్నారు. వాళ్లు జట్టులో ఉంటే పాక్ విజయం సాధించదు. ఆ ఆటగాళ్లను తప్పించడానికి నేను ప్రయత్నించా. కానీ, మేనేజ్మెంట్ వారిని తిరిగి జట్టులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది’’ అని పాక్ మాజీ సెలెక్టర్ వ్యాఖ్యానించాడు.
ఈ టీ20 ప్రపంచకప్లో పాక్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. యూఎస్ఏ, భారత్ చేతిలో ఓడింది ఆ జట్టు. గ్రూప్ దశలో ఇంకా ఐర్లాండ్, కెనడాతో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో నెగ్గినా పాక్ సూపర్-8 అర్హత సాధిస్తుందని కచ్చితంగా చెప్పలేం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్