MS Dhoni in Asia Cup: ఆసియా కప్ అంటే ధోనీ గుర్తుకొస్తాడు.. ఎందుకంటే..?
అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఐసీసీ టోర్నీల్లోనే కాకుండా.. ఆసియా కప్లోనూ తనదైన ముద్ర వేశాడు. జట్టుకు అత్యధిక విజయాలందించిన సారథిగా నిలిచిపోయాడు.
ప్రత్యర్థుల ఊహాలకు అందనిరీతిలో వ్యూహాలు పన్నడంలో దిట్ట. ‘కెప్టెన్ కూల్’ అంటూ సహచరులు ఆప్యాయంగా పిలుచుకునే సారథి. భారత్కు వన్డే, టీ20, ఛాంపియన్స్ ట్రోఫీలను అందించిన ఏకైక నాయకుడు. ఇక IPLలోనూ అతడి నాయకత్వంలోనే సీఎస్కే ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన సంగతిని విస్మరించలేం. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా.. అతడే ఎంఎస్ ధోనీ. భారత క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. అతడి పేరు వింటే ఠక్కున ఐసీసీ ట్రోఫీలు గుర్తుకొస్తాయి. అయితే, ఆసియా కప్ (Asia Cup)లోనూ తన నాయకత్వ పటిమతో భారత్ను ఉన్నత స్థాయికి చేర్చాడు. మరి ధోనీ సాధించిన రికార్డులు, ఘనతలు ఏంటో తెలుసుకుందాం..
ఏమిటీ యోయో?.. భారత క్రికెట్లో మళ్లీ ఫిట్నెస్ పరీక్షపై చర్చ
తొలుత 2004లో అంతర్జాతీయ కెరీర్లోకి అడుగు పెట్టిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) మూడేళ్లకు సారథి కావడం విశేషం. తొలిసారి కెప్టెన్గా 2007 టీ20 ప్రపంచకప్ (T20 World Cup) నుంచి బాధ్యతలు చేపట్టాడని అని తెలుసు కదా.. సరైన వికెట్ కీపర్ లేని లోటును తీర్చాడు. అదే సమయంలో పొట్టి వరల్డ్ కప్ను (2007లో) అందించడంతో 2008లో జరిగిన ఆసియా కప్లోనూ భారత్కు సారథిగా ధోనీ వ్యవహరించే అవకాశం వచ్చింది. ధోనీకి డిప్యూటీగా యువరాజ్ సింగ్ వ్యవహరించాడు. ధోనీ కెప్టెన్సీలో తొలిసారి ఆసియా కప్ బరిలోకి దిగిన టీమ్ఇండియా రన్నరప్గా నిలిచింది. వన్డే ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఈ టోర్నీలో ధోనీ మిడిలార్డర్లో బ్యాటింగ్ వచ్చి మరీ ఆరు మ్యాచుల్లో 109 సగటుతో 327 పరుగులు చేశాడు.
ఛాంపియన్గా భారత్
టీమ్ఇండియా రన్నరప్గా నిలిచిన 2008 ఆసియా కప్ తర్వాత మళ్లీ రెండేళ్లకు మినీ టోర్నీ వచ్చేసింది. ఈసారి కూడా ధోనీనే సారథి. అతడి నాయకత్వంలో భారత్ ఫైనల్ సహా నాలుగు మ్యాచ్లు ఆడింది. ప్రతి మ్యాచ్లనూ ధోనీ విలువైన పరుగులు సాధించాడు. ఆసియా కప్ 2010 ఫైనల్లో శ్రీలంకను ఓడించి తొలిసారి ధోనీ నాయకత్వంలో ఛాంపియన్గా నిలిచింది. ధోనీ సారథ్యంలోని భారత్ 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంతోనే బరిలోకి దిగి మరీ విజేతగా నిలవడం విశేషం. ధోనీ అన్ని మ్యాచులు కలిపి 173 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో వచ్చి కీలక ఇన్నింగ్స్లు ఆడాడు.
కలిసిరాని అదృష్టం..
ఆసియా కప్ 2012లో భారత్కు షాక్ తగిలింది. శ్రీలంక, పాకిస్థాన్పై అద్భుత విజయాలను నమోదు చేసిన టీమ్ఇండియాకు బంగ్లాదేశ్ చేతిలో పరాభవం తప్పలేదు. దీంతో ఫైనల్కు చేరుకోవడంలో విఫలమైంది. బంగ్లాతో సరిసమానంగా పాయింట్లను పంచుకున్నప్పటికీ.. లీగ్ స్టేజ్లో ఆ జటుపై ఓడిపోవడంతో దురదృష్టవశాత్తూ భారత్ ఇంటిముఖం పట్టింది. ఫైనల్కు చేరిన బంగ్లాదేశ్కు పాకిస్థాన్ చేతిలో మాత్రం ఓటమి తప్పలేదు. అయితే, చివరి వరకు పోరాడిన బంగ్లా కేవలం రెండు పరుగుల తేడాతో ఓడింది. ఈ ఆసియా కప్లో భారత్ మూడు మ్యాచుల్లో ఆడింది. ధోనీ ప్రదర్శన కూడా ఏమంత గొప్పగా లేదు. అయితే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 183 పరుగుల సంచలన ఇన్నింగ్స్తో పాక్పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఒకే ఒక్క మ్యాచ్కు సారథిగా..
వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ 2018 ఎడిషన్లో భారత్ రోహిత్ శర్మ నాయకత్వంలో బరిలోకి దిగింది. విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో ధోనీకి బదులు రోహిత్కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. అయితే, ఆ టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్కు సారథిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ధోనీకి వచ్చింది. రోహిత్ గాయపడటం వల్ల అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్కు ధోనీ కెప్టెన్గా ఉన్నాడు. అయితే, ఆ మ్యాచ్ టై కావడం విశేషం. తన కెప్టెన్సీ కెరీర్లో ఆసియా కప్ టోర్నీకి సంబంధించి మొత్తం 14 మ్యాచుల్లో నాయకత్వం వహించాడు. ఇందులో తొమ్మిది విజయాలు, 4 ఓటములు, ఒక్కటి టైగా ముగిశాయి. ఆసియా కెప్టెన్లలో అత్యధిక విజయాలను నమోదు చేసిన సారథిగా ఎంఎస్ ధోనీ పేరు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.
మరో ఘనత..
ఇప్పటి వరకు ఆసియా కప్ చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే టీ20 ఫార్మాట్లో టోర్నీలు జరిగాయి. గతేడాది శ్రీలంక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ధోనీ నాయకత్వంలోని భారత్ 2016లోనే ఛాంపియన్గా అవతరించింది. మొత్తం ఐదు మ్యాచుల్లోనూ గెలిచి టైటిల్ను ఎగరేసుకుపోవడం విశేషం. అప్పటికే ఐసీసీ ట్రోఫీలు అయిన టీ20, వన్డే వరల్డ్ కప్లతోపాటు ఛాంపియన్స్ ట్రోపీని గెలిచిన ధోనీ.. వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆసియా కప్లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు. ఇలాంటి ఘనతను మరెవరూ భవిష్యత్తులోనూ సాధించే అవకాశాలు చాలా తక్కువే.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన