Yo-Yo Test: ఏమిటీ యోయో?.. భారత క్రికెట్లో మళ్లీ ఫిట్నెస్ పరీక్షపై చర్చ
ఆటగాళ్లు పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తేనే మైదానంలో చురుగ్గా కదలగలరు. మరి వారు ఎంత ఫిట్గా ఉన్నారని తెలుసుకోవాలంటే పరీక్ష పెట్టాలి కదా.. అలాంటిదే యో-యో (Yo Yo Test) టెస్టు. ఇప్పుడు మళ్లీ ఆటగాళ్లకు బీసీసీఐ నిర్వహిస్తోంది.
యోయో.. అప్పట్లో భారత క్రికెట్లో ఈ మాట బాగా పాపులర్. కానీ మధ్యలో దాని ఊసే అంతా మరిచిపోయారు. ఇప్పుడు మళ్లీ యోయో ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఆసియా కప్ సమీపిస్తున్న నేపథ్యంలో టీమ్ఇండియా ఆటగాళ్లకు ఇటీవలే యోయో పరీక్షలు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. ఈ ఫిట్నెస్ పరీక్షలో ఆటగాళ్లు సాధించిన స్కోర్ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏమిటీ యోయో?
అంతర్జాతీయ క్రికెట్లో ఉండే పోటీ ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో తలపడాలంటే కేవలం నైపుణ్యం, ఫామ్ మాత్రమే సరిపోదు. అత్యున్నత స్థాయి ఫిట్నెస్ ఉండాల్సిందే అన్నది భారత క్రికెట్ జట్టును నడిపించే మేనేజ్మెంట్ ఉద్దేశం. అందుకే అయిదేళ్ల కిందట యోయో ఫిట్నెస్ పరీక్షను ప్రవేశ పెట్టి.. ప్రతి ఆటగాడూ అందులో పాసవడం తప్పనిసరి చేశారు. దీనికి శ్రీకారం చుట్టింది ఒకప్పటి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ శంకర్ బసు. భారత క్రికెట్లో అత్యున్నత ఫిట్నెస్ ప్రమాణాలను నెలకొల్పిన విరాట్ కోహ్లి టీమ్ఇండియా కెప్టెన్గా ఉండటంతో యోయోకు సులువుగానే ఆమోద ముద్ర పడింది.
అప్పటి కోచ్ రవిశాస్త్రి కూడా దీనికి మద్దతుగా నిలిచాడు. 2018 నుంచి మూడేళ్ల పాటు యోయోలో పాస్ కావడం భారత ఆటగాళ్లకు తప్పనసరిగా ఉండేది. అత్యుత్తమ ఫిట్నెస్ ఉంటే తప్ప యోయోను అధిగమించడం సాధ్యం కాదు. యువరాజ్ సింగ్, సురేశ్ రైనా లాంటి సీనియర్లే కాదు.. వాషింగ్టన్ సుందర్, పృథ్వీ షా లాంటి జూనియర్లు సైతం ఈ పరీక్షను అధిగమించలేక ఇబ్బంది పడ్డారు. కోహ్లి కెప్టెన్గా ఉన్నంత కాలం ఈ పరీక్షను కఠినంగా అమలు చేశారు.
Virat Kohli Fitness: ఇదే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ మంత్రం!
అయితే అతను ఒక్కో ఫార్మాట్లో కెప్టెన్సీకి దూరం కావడం, అదే సమయంలో కరోనా ప్రభావంతో ఆటగాళ్ల ఫిట్నెస్ ప్రమాణాలు తగ్గడంతో యోయో మీద పూర్తిగా దృష్టిపెట్టే పరిస్థితి లేకపోయింది. కెప్టెన్తో పాటు జట్టు కోచింగ్ సిబ్బంది కూడా మారడంతో క్రమంగా యోయోను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మళ్లీ యోయోకు ప్రాధాన్యం ఏర్పడింది. వన్డే ప్రపంచకప్ సమీపిస్తుండటంతో ఆసియా కప్ ముంగిట జట్టు సభ్యులకు యోయోను తప్పనిసరి చేశారు. గతంలో అర్హత మార్కు 16.1గా ఉండేది. ఇప్పుడది 16.5కు పెరిగింది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో శుభ్మన్ గిల్ 18.5 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచినట్లు వార్తలు వచ్చాయి. తాను 17.2 స్కోరు సాధించినట్లు స్వయంగా కోహ్లినే వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా పరీక్షలో పాల్గొన్న మిగతా ఆటగాళ్లంతా అర్హత మార్కును దాటారు.
ఎలా జరుగుతుంది?
యోయోకు ఆద్యుడు డెన్మార్క్కు చెందిన సాకర్ సైకాలజిస్ట్ జెన్స్ బాంగ్స్బో. ఈ ఫిట్నెస్ పర్క్షీను రూపొందించింది అతనే. సాకర్లో పాపులర్ అయ్యాక క్రికెట్లోకి కూడా దీన్ని తీసుకొచ్చారు. పరుగెత్తే వేగాన్ని పెంచుతూ ఆటగాళ్ల సహన శక్తిని అంచనా వేయడమే దీని ప్రధాన ఉద్దేశం. పరీక్షలో భాగంగా బీప్ (శబ్దం), బీప్కు మధ్య కొద్దిపాటి విరామంలో సగటున గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కిలోమీటరు నుంచి మూడు కిలోమీటర్ల వరకు పరుగెత్తాల్సి ఉంటుంది. యోయో పరీక్షలో రెండు స్థాయిలుంటాయి. మొదటిది తక్కువ శ్రమ పడే ఆటగాళ్ల కోసం.. రెండోది నిపుణుల కోసం. పరీక్షలో భాగంగా 20 మీటర్ల దూరంలో ఇటు అటు కోణాలను ఉంచుతారు. వాటి మధ్య పరుగెత్తాలి. ఒక్కో పరుగుకు మూడు బీప్లు ఉంటాయి. మొదటి బీప్ వచ్చినపుడు ఆటగాడు పరుగు ఆరంభించాలి.
రెండోసారి శబ్దం వచ్చేసరికి ఆటగాడు అవతలి వైపున్న కోచ్ను చేరుకోవాలి. మూడో బీప్ సమయానికి ఆరంభ స్థానానికి చేరాలి. రెండో బీప్ వచ్చేసరికి అవతలి వైపు వెళ్లలేకపోతే మూడో బీప్ సమయానికి లక్ష్యానికి చేరాలి. లేదంటే తొలి హెచ్చరిక జారీ చేస్తారు. అలా మూడు హెచ్చరికలు అందుకుంటే ఆటగాడు పరీక్షలో విఫలమైనట్లే. ప్రతి నిమిషానికీ బీప్ వచ్చే సమయాన్ని తగ్గిస్తూ వెళ్తారు. ఒక షటిల్ 40 మీటర్లు కాగా.. ఆటగాళ్లు పూర్తి చేసిన షటిళ్ల ఆధారంగా స్కోరును లెక్కిస్తారు. ఒక్కో షటిల్ మధ్య 5-10 సెకన్ల విరామం లభిస్తుంది. బీప్ను ఎవరూ నియంత్రించలేరు. పరీక్ష కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన