Yo-Yo Test: ఏమిటీ యోయో?.. భారత క్రికెట్లో మళ్లీ ఫిట్నెస్ పరీక్షపై చర్చ
ఆటగాళ్లు పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తేనే మైదానంలో చురుగ్గా కదలగలరు. మరి వారు ఎంత ఫిట్గా ఉన్నారని తెలుసుకోవాలంటే పరీక్ష పెట్టాలి కదా.. అలాంటిదే యో-యో (Yo Yo Test) టెస్టు. ఇప్పుడు మళ్లీ ఆటగాళ్లకు బీసీసీఐ నిర్వహిస్తోంది.
యోయో.. అప్పట్లో భారత క్రికెట్లో ఈ మాట బాగా పాపులర్. కానీ మధ్యలో దాని ఊసే అంతా మరిచిపోయారు. ఇప్పుడు మళ్లీ యోయో ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఆసియా కప్ సమీపిస్తున్న నేపథ్యంలో టీమ్ఇండియా ఆటగాళ్లకు ఇటీవలే యోయో పరీక్షలు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. ఈ ఫిట్నెస్ పరీక్షలో ఆటగాళ్లు సాధించిన స్కోర్ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏమిటీ యోయో?
అంతర్జాతీయ క్రికెట్లో ఉండే పోటీ ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో తలపడాలంటే కేవలం నైపుణ్యం, ఫామ్ మాత్రమే సరిపోదు. అత్యున్నత స్థాయి ఫిట్నెస్ ఉండాల్సిందే అన్నది భారత క్రికెట్ జట్టును నడిపించే మేనేజ్మెంట్ ఉద్దేశం. అందుకే అయిదేళ్ల కిందట యోయో ఫిట్నెస్ పరీక్షను ప్రవేశ పెట్టి.. ప్రతి ఆటగాడూ అందులో పాసవడం తప్పనిసరి చేశారు. దీనికి శ్రీకారం చుట్టింది ఒకప్పటి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ శంకర్ బసు. భారత క్రికెట్లో అత్యున్నత ఫిట్నెస్ ప్రమాణాలను నెలకొల్పిన విరాట్ కోహ్లి టీమ్ఇండియా కెప్టెన్గా ఉండటంతో యోయోకు సులువుగానే ఆమోద ముద్ర పడింది.
అప్పటి కోచ్ రవిశాస్త్రి కూడా దీనికి మద్దతుగా నిలిచాడు. 2018 నుంచి మూడేళ్ల పాటు యోయోలో పాస్ కావడం భారత ఆటగాళ్లకు తప్పనసరిగా ఉండేది. అత్యుత్తమ ఫిట్నెస్ ఉంటే తప్ప యోయోను అధిగమించడం సాధ్యం కాదు. యువరాజ్ సింగ్, సురేశ్ రైనా లాంటి సీనియర్లే కాదు.. వాషింగ్టన్ సుందర్, పృథ్వీ షా లాంటి జూనియర్లు సైతం ఈ పరీక్షను అధిగమించలేక ఇబ్బంది పడ్డారు. కోహ్లి కెప్టెన్గా ఉన్నంత కాలం ఈ పరీక్షను కఠినంగా అమలు చేశారు.
Virat Kohli Fitness: ఇదే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ మంత్రం!
అయితే అతను ఒక్కో ఫార్మాట్లో కెప్టెన్సీకి దూరం కావడం, అదే సమయంలో కరోనా ప్రభావంతో ఆటగాళ్ల ఫిట్నెస్ ప్రమాణాలు తగ్గడంతో యోయో మీద పూర్తిగా దృష్టిపెట్టే పరిస్థితి లేకపోయింది. కెప్టెన్తో పాటు జట్టు కోచింగ్ సిబ్బంది కూడా మారడంతో క్రమంగా యోయోను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మళ్లీ యోయోకు ప్రాధాన్యం ఏర్పడింది. వన్డే ప్రపంచకప్ సమీపిస్తుండటంతో ఆసియా కప్ ముంగిట జట్టు సభ్యులకు యోయోను తప్పనిసరి చేశారు. గతంలో అర్హత మార్కు 16.1గా ఉండేది. ఇప్పుడది 16.5కు పెరిగింది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో శుభ్మన్ గిల్ 18.5 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచినట్లు వార్తలు వచ్చాయి. తాను 17.2 స్కోరు సాధించినట్లు స్వయంగా కోహ్లినే వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా పరీక్షలో పాల్గొన్న మిగతా ఆటగాళ్లంతా అర్హత మార్కును దాటారు.
ఎలా జరుగుతుంది?
యోయోకు ఆద్యుడు డెన్మార్క్కు చెందిన సాకర్ సైకాలజిస్ట్ జెన్స్ బాంగ్స్బో. ఈ ఫిట్నెస్ పర్క్షీను రూపొందించింది అతనే. సాకర్లో పాపులర్ అయ్యాక క్రికెట్లోకి కూడా దీన్ని తీసుకొచ్చారు. పరుగెత్తే వేగాన్ని పెంచుతూ ఆటగాళ్ల సహన శక్తిని అంచనా వేయడమే దీని ప్రధాన ఉద్దేశం. పరీక్షలో భాగంగా బీప్ (శబ్దం), బీప్కు మధ్య కొద్దిపాటి విరామంలో సగటున గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కిలోమీటరు నుంచి మూడు కిలోమీటర్ల వరకు పరుగెత్తాల్సి ఉంటుంది. యోయో పరీక్షలో రెండు స్థాయిలుంటాయి. మొదటిది తక్కువ శ్రమ పడే ఆటగాళ్ల కోసం.. రెండోది నిపుణుల కోసం. పరీక్షలో భాగంగా 20 మీటర్ల దూరంలో ఇటు అటు కోణాలను ఉంచుతారు. వాటి మధ్య పరుగెత్తాలి. ఒక్కో పరుగుకు మూడు బీప్లు ఉంటాయి. మొదటి బీప్ వచ్చినపుడు ఆటగాడు పరుగు ఆరంభించాలి.
రెండోసారి శబ్దం వచ్చేసరికి ఆటగాడు అవతలి వైపున్న కోచ్ను చేరుకోవాలి. మూడో బీప్ సమయానికి ఆరంభ స్థానానికి చేరాలి. రెండో బీప్ వచ్చేసరికి అవతలి వైపు వెళ్లలేకపోతే మూడో బీప్ సమయానికి లక్ష్యానికి చేరాలి. లేదంటే తొలి హెచ్చరిక జారీ చేస్తారు. అలా మూడు హెచ్చరికలు అందుకుంటే ఆటగాడు పరీక్షలో విఫలమైనట్లే. ప్రతి నిమిషానికీ బీప్ వచ్చే సమయాన్ని తగ్గిస్తూ వెళ్తారు. ఒక షటిల్ 40 మీటర్లు కాగా.. ఆటగాళ్లు పూర్తి చేసిన షటిళ్ల ఆధారంగా స్కోరును లెక్కిస్తారు. ఒక్కో షటిల్ మధ్య 5-10 సెకన్ల విరామం లభిస్తుంది. బీప్ను ఎవరూ నియంత్రించలేరు. పరీక్ష కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్