Mumbai Indians: వరుసగా 12వ సారి.. ముంబయి తొలి మ్యాచ్ల చరిత్ర ఎలా ఉందంటే..?
ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ ఆడిన తొలి మ్యాచ్లో గుజరాత్పై ఓటమిపాలైంది. ఇలా ఓటమితో సీజన్ను ప్రారంభించడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు.
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే ఈ ఐపీఎల్ (IPL) సీజన్ను ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) మరోసారి ఓటమితో ప్రారంభించింది. తొలి మ్యాచ్లో ఓటమిపాలవడం ఆ జట్టుకు కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా ఆ జట్టు 2012వ సీజన్లో మొదటి మ్యాచ్లో విజయం సాధించింది. చెన్నైపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత 12 సీజన్లలో ఒక్కసారి కూడా గెలవలేదంటే.. ఆ జట్టు తొలి మ్యాచ్ చరిత్ర ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఐపీఎల్ సీజన్లో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ను ముంబయి ఇండియన్స్ చేజార్చుకుంది. ఆదివారం చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గుజరాత్పై ఆ జట్టు 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ముంబయి ఆడిన తొలి మ్యాచ్ల ఫలితాలను పరిశీలిస్తే..
IPL 2024: హోస్ట్ టీమే విన్నర్.. ‘ఫస్ట్’ బెస్ట్ వీరే!
గెలిచింది నాలుగుసార్లే..
ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఆడిన తొలి మ్యాచ్ల్లో ముంబయి ఇండియన్స్ గెలిచింది కేవలం నాలుగు సార్లే. 2008లో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్లో ముంబయి తన తొలి మ్యాచ్లో బెంగళూరుపై ఓటమి పాలైంది. ఆ తర్వాత 2009 నుంచి 2012 వరకు వరుసగా నాలుగు సీజన్లలో తొలి మ్యాచ్ల్లో ముంబయి విజయాలను నమోదు చేసింది. ఆ తర్వాత గెలిచింది లేదు
తొలి మ్యాచ్ ఓడినా.. టైటిల్ గెలిచింది..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబయి ఒకటి. ఐదుసార్లు టైటిల్ గెలిచి అత్యధికంగా ట్రోఫీలు నెగ్గిన జట్టుగా రికార్డు సృష్టించింది. గత సీజన్లో ఈ రికార్డును ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు సమం చేసింది. ఇక ముంబయి టైటిల్ గెలిచిన సీజన్లను గమనిస్తే.. తొలి మ్యాచ్ల్లో ఓడిన సీజన్లలోనే విజేతగా నిలవడం విశేషం. 2013, 2015, 2017, 2019, 2020ల్లో ముంబయి ట్రోఫీలను గెలుచుకుంది. ఈ సీజన్ల తొలి మ్యాచ్ల్లో ముంబయి ప్రత్యర్థుల చేతుల్లో దాదాపు ఘోరంగా ఓటమిపాలవడం గమనార్హం.
గొప్పగా లేని ముంబయి ఆట..
తొలి మ్యాచ్లో గెలుపు అనేది ఏ జట్టుకైనా ఉత్సాహాన్నిస్తుందని అంటుంటారు. కానీ.. ముంబయి విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంది. అయితే.. ముంబయి ట్రాక్ రికార్డు గత కొన్నేళ్లుగా అంత గొప్పగా ఏమీ లేదు. చివరిసారిగా విజేతగా నిలిచిన 2020 అనంతరం ఆ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. 2021వ సీజన్లో ఆ జట్టు ప్లేఆఫ్సే చేరలేదు. 2022లోనైతే పాయింట్ల పట్టికలో అట్టడగు స్థానంలో నిలిస్తే.. గత సీజన్లో ప్లేఆఫ్స్ వరకూ వచ్చి వెనుదిరిగింది.
ఇక ముంబయికి ఐదుసార్లు టైటిల్ అందించింది రోహిత్ శర్మనే. అతడిని కాదని ఈసారి కొత్త సారథి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. వీరి మధ్య సమన్వయం అంతగా లేదని మొదటి మ్యాచ్ను చూస్తేనే అర్థమవుతోంది. మరి హార్దిక్ మిగతా మ్యాచ్ల్లో జట్టును ఏవిధంగా నడిపిస్తాడో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం