IPL 2024: ఓవర్లో రెండు బౌన్సర్లు.. కొత్త నిబంధనలతో సరికొత్తగా ఐపీఎల్
ఐపీఎల్ 17వ సీజన్ను (IPL 2024) మరింత రసవత్తరంగా మార్చేందుకు నిర్వాహకులు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. మార్చి 22 నుంచి సీఎస్కే, ఆర్సీబీ జట్ల మధ్య తొలి మ్యాచ్తో ఈ ఎడిషన్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ (IPL).. అంటే చాలు అభిమానుల్లో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తుంది. గత 16 ఏళ్లుగా గొప్ప వినోదాన్ని అందిస్తున్న ఈ టీ20 లీగ్.. 2024లో సరికొత్తగా ముస్తాబైంది. కొత్తగా వచ్చిన కొన్ని నిబంధనలతో ఈ టోర్నీ అభిమానులకు కొత్త అనుభూతిని కూడా ఇవ్వబోతోంది. గతేడాది ప్రయోగాత్మకంగా పరిశీలించిన రూల్స్ కూడా ఈసారీ కొనసాగనున్నాయి.
ఇక నుంచి రెండు సంధించే అవకాశం..
సాధారణంగా టీ20 క్రికెట్లో బౌలర్ ఒక ఓవర్లో ఒకే బౌన్సర్ వేసే అవకాశం ఉంటుంది. కానీ తాజాగా ఐపీఎల్లో ఓవర్కు రెండు బౌన్సర్లు వేయడానికి అనుమతి ఉంది. దీంతో ఉత్కంఠభరిత మ్యాచ్ల్లో ఈ రెండు బౌన్సర్ల నిబంధన బాగా ఉపయోగపడనుంది. 2023-2024 సయ్యద్ ముస్తాక్అలీ టోర్నీలో ఈ విధానాన్ని విజయవంతంగా పరీక్షించారు. దీంతో ఐపీఎల్లోనూ ఈసారి ఈ నిబంధనలు ఉపయోగించబోతున్నారు. మరి ఈ కొత్త రూల్ను బౌలర్లు తమకు ఎంత అనుకూలంగా మార్చుకుంటారో చూడాలి. అంతేకాక స్టంపింగ్ చేసిన సమయంలో క్యాచ్ను కూడా పరిశీలించే నిబంధనను కూడా 2024 ఐపీఎల్లో బీసీసీఐ కొనసాగించనుంది. ఆఖరి ఓవర్లలో ఫలితాలు తేలే మ్యాచ్ల్లో ఈ రూల్ బౌలర్లకు వరంగా మారుతుందని అనుకుంటున్నారు. దీనివల్ల బ్యాటర్లకు, బౌలర్లకు మధ్య సమానమైన పోటీ ఉండే అవకాశాలున్నాయి.
స్మార్ట్ రీప్లే సిస్టమ్
అంపైర్ నిర్ణయాలపై మరింత స్పష్టత కోసం ఈసారి ఐపీఎల్లో స్మార్ట్ రీప్లే సిస్టమ్ను బీసీసీఐ అమలుచేయబోతోంది. దీనిప్రకారం టీవీ అంపైర్, హాక్ ఐ ఆపరేటర్ల నుంచి వచ్చే ఫీడ్ను నేరుగా అందుకుంటాడు. దీనివల్ల గతంలో ఎక్కువ దృశ్యాలను చూసే అవకాశం ఉంటుంది. భిన్న కోణాల్లో విజువల్స్ను వీక్షించే ఛాన్స్ వస్తుంది. గతంలో టీవీ బ్రాడ్కాస్టర్ల నుంచి టీవీ అంపైర్కు విజువల్స్ వచ్చేవి. దీనివల్ల అంపైర్ పరిమితంగానే విజువల్స్ చూసేవాడు. కానీ స్మార్ట్ రీప్లే సిస్టమ్ ద్వారా మైదానంలో నలుమూలలా ఏర్పాటుచేసిన ఎనిమిది హైస్పీడ్ కెమెరాల నుంచి వచ్చే ఫీడ్ నేరుగా టీవీ అంపైర్కు చేరుతుంది. దీంతో నిర్ణయాల్లో పారదర్శకత పెరగనుంది. అంతేకాక టీవీ అంపైర్, హాక్ ఐ ఆపరేటర్ల మధ్య సంభాషణలను కూడా వీక్షకులు లైవ్లో వినొచ్చు. అంపైర్ ఎలా నిర్ణయం తీసుకున్నాడో కూడా అభిమానులకు తెలుస్తుంది.
ఆ నిబంధన అలాగే..
వైడ్లు, నోబాల్స్కు సమీక్ష కోరే నిబంధనను గతేడాది ఐపీఎల్లో ప్రవేశపెట్టారు. ఈ రూల్తో కీలక సమయాల్లో జట్లు లబ్ది పొందాయి. అందుకే ఈసారి కూడా ఈ నిబంధన కొనసాగించనున్నారు. దీనికితోడు ప్రతీ జట్టుకు అదనంగా రెండు సమీక్షలు అందుబాటులో ఉంటాయి. నిర్ణయాల్లో మరింత పారదర్శకత కోసం ఈ నిబంధనలు ఉపయోగపడతాయని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఇటీవల ప్రవేశపెట్టిన స్టాప్ క్లాక్ నిబంధనను మాత్రం ఐపీఎల్-17లో అమలుచేయట్లేదు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఫీల్డింగ్ జట్టు ఒక ఓవర్ అయిన 60 సెకన్లలోపే ఓవర్ను మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఈ రూల్తో సమయం ఆదా అవుతుందని ఐసీసీ ఉద్దేశం. అయితే ఈ నిబంధన పూర్తిస్థాయిలో ఇంకా అమలుచేయలేదు. ఈనేపథ్యంలో ఐఎల్లో ఈ రూల్ను ప్రవేశపెట్టలేదు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్