Hardik Pandya: దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: జట్టులో స్టార్ ఆటగాళ్లున్నా ఐపీఎల్ 17 సీజన్లో ముంబయి ఇండియన్స్ స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. సోమవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ముంబయి ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ల్లో మూడు విజయాలే సాధించింది. ఆ జట్టు ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే మిగిలిన మ్యాచ్ల్లో నెగ్గాల్సిందే. రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల వైఫల్యాలే జట్టు ఓటమికి కారణమని అతడు పేర్కొన్నాడు.
‘‘మేం చేజేతులా ప్రారంభంలోనే ఇబ్బందుల్లో పడ్డాం. తిలక్ వర్మ, నేహాల్ వధేరా బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఆరంభంలో వికెట్లు కోల్పోవడంతో కనీసం 180 స్కోరైనా చేస్తామని అనుకోలేదు. చివరి ఓవర్లలో ధాటిగా ఆడలేకపోయాం. ఫలితంగా 10-15 పరుగులు తక్కువగా చేశాం. పవర్ ప్లే ఆరంభంలోనే మేం రాజస్థాన్పై ఒత్తిడి తెచ్చి వికెట్లు పడగొట్టాల్సింది. కానీ, అలా జరగలేదు. ఆ జట్టు ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడారు. ఫీల్డింగ్లోనూ పొరపాట్లు చేశాం. మొత్తం మీద అత్యుత్తమంగా ఆడలేకపోయాం. రాజస్థాన్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఆటగాళ్ల (ముంబయి) వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదు. అందరూ ప్రొఫెషనల్ క్రికెటర్లే. వారు నిర్వర్తించాల్సిన పాత్రలేంటో తెలుసు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆటలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని వచ్చే మ్యాచ్ల్లో వాటిని పునరావృతం చేయకూడదు. జట్టు, వ్యక్తిగతంగా లోపాలను అంగీకరించాలి. వాటిని సరిచేసుకుని ముందుకు సాగాలి. నేను ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడానికే ఇష్టపడతాను. ఎల్లప్పుడూ మంచి క్రికెట్ ఆడటం, మా ప్రణాళికలకు కట్టుబడి ఉండటంపై దృష్టి సారిస్తాను’’ అని హార్దిక్ పాండ్య వివరించాడు.
మ్యాచ్ విశేషాలు
- ఈ మ్యాచ్లో మహ్మద్ నబీని ఔట్ చేసి యుజ్వేంద్ర ఐపీఎల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు చాహలే.
- 23 ఏళ్ల కంటే ముందే ఐపీఎల్లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆటగాడు యశస్వి జైస్వాల్.
- ఒక సీజన్లో మొదటి ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు విజయాలు సాధించిన ఐదో జట్టు రాజస్థాన్. ముంబయి (2010), పంజాబ్ (2014), చెన్నై (2019), గుజరాత్ (2022) ముందున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు