Rohit Sharma: హార్దిక్కు మద్దతుగా రోహిత్.. అభిమానులను వారించిన హిట్మ్యాన్
Rohit Sharma-Hardik Pandya: వాంఖడే స్టేడియంలో హార్దిక్ పాండ్యకు వ్యతిరేకంగా కొందరు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో కెప్టెన్కు అండగా నిలిచిన రోహిత్.. అభిమానులను వారించారు.
ముంబయి: రోహిత్ శర్మ (Rohit Sharma) స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా నియమితుడైన హార్దిక్ పాండ్య (Hardik Pandya)కు ఐపీఎల్ మ్యాచ్ల కోసం వెళ్లిన ప్రతి స్టేడియంలో ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత తప్పట్లేదు. తాజాగా హోం గ్రౌండ్ వాంఖడేలో ఆ హేళన మరింత తీవ్రమైంది. మైదానంలో హార్దిక్ కదిలిన ప్రతిసారీ గ్యాలరీ నుంచి హిట్మ్యాన్ అభిమానులు ‘రోహిత్.. రోహిత్’ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో పాండ్యకు మాజీ కెప్టెన్ అండగా నిలవడం విశేషం.
టాస్కు ముందు మైదానంలో హార్దిక్ వార్మప్ చేస్తుండగా కొందరు అభిమానులు అతడికి వ్యతిరేకంగా కేకలు పెట్టారు. ఆ తర్వాత టాస్కు వస్తున్నప్పుడు కూడా అదే పరిస్థితి కన్పించింది. రోహిత్ అభిమానులను చూసి పాండ్య నవ్వుతూ వెళ్లిపోయాడు. మ్యాచ్ మధ్యలోనూ గ్యాలరీ నుంచి అభిమానులు గట్టి గట్టిగా నినాదాలు చేయగా.. డీప్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్.. అరవడం ఆపాలంటూ అభిమానులకు సైగలు చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ‘ఇదే హిట్మ్యాన్ హుందాతనం’అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
నేను ఇంకా బాగా ఆడాల్సింది: ముంబయి ఓటమిపై హార్దిక్
హార్దిక్ను తప్పించాలి: మనోజ్ తివారీ
ఎన్నో విమర్శల నడుమ ముంబయి పగ్గాలు చేపట్టిన హార్దిక్కు ఇప్పటి వరకు కలిసిరాలేదు. అతడి నాయకత్వంలో విజయాల ఖాతా తెరవని ఈ జట్టు.. వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. దీంతో ‘కెప్టెన్ మార్పు’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పాండ్యను తప్పించి.. ఆ బాధ్యతలను మళ్లీ రోహిత్కు అప్పగించాలని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. ‘‘కెప్టెన్ మార్పు అనేది చాలా పెద్ద నిర్ణయం. ఈ సీజన్లో ముంబయి ఒక్క పాయింట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇది కేవలం దురదృష్టకరం మాత్రమే కాదు. కొత్త నాయకత్వం గొప్పగా లేదు. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ముంబయి యాజమాన్యం వెనుకాడదని అనుకుంటున్నా’’ అని తివారీ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.