Pakistan cricket: పాక్ బ్యాటర్లు సిక్సర్లు కొట్టలేకపోతున్నారని రంగంలోకి సైన్యం..!
పాకిస్థాన్ క్రికెటర్లు సిక్సర్లు కొట్టలేకపోతున్నారట.. వారికి అందుకే కఠిన శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా సైన్యం రంగంలోకి దిగుతోంది.
ఇంటర్నెట్డెస్క్: పాక్ (Pakistan) క్రికెటర్లు భారీ సిక్సర్లు కొట్టలేకపోతున్నారని పీసీబీ ఛైర్మన్ మొహసీన్ నక్వీకు చిరాకేసింది. అసలు తాను మ్యాచ్ చూస్తుండగా ఒక్కరు కూడా బంతిని స్టాండ్స్లోకి పంపించలేకపోయారని నేరుగా ఎద్దేవా చేశారు. దీంతో వారికి సైన్యంతో శిక్షణ ఇప్పించేందుకు సిద్ధమయ్యారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో తమ క్రికెటర్లు ఓ సైనిక క్యాంప్లో సాధన చేస్తారని తెలిపారు. మంగళవారం ఇస్లామాబాద్లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కొందరు క్రికెటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న పీఎస్ఎల్ టోర్నమెంట్ పూర్తికాగానే దాదాపు 10 రోజులపాటు ఇది జరుగుతుందని చెప్పారు.
‘‘నేను లాహోర్ మ్యాచ్లను వీక్షిస్తుండగా.. ఒక్కరు కూడా బంతిని స్టాండ్స్లోకి తరలించలేకపోయారు. ఎప్పుడైనా ఆ స్థాయి సిక్సర్లు కనిపిస్తే.. కచ్చితంగా విదేశీయులే వాటిని బాదారనుకొంటాను. అందుకే ప్రతి ఆటగాడి ఫిట్నెస్ను మెరుగుపర్చేందుకు బోర్డు ఓ ప్లాన్ సిద్ధం చేయాలని కోరుతున్నాను. మీరు దాని ప్రకారం శ్రమించండి. న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, టీ20 ప్రపంచకప్ సిరీసులు వరుసగా ఉన్నాయి. దీనిని చూసి.. ఎప్పుడు సాధన చేయాలని ఆశ్చర్యపోతుంటాను. ఈ మధ్యలో చిన్న విరామం ఉన్నట్లు గుర్తించాము. మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు మేము కాకుల్ (మిలటరీ అకాడమీ)లో క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిక్షణలో పాక్ సైన్యం భాగస్వామి అవుతుంది. వారు కచ్చితంగా మీకు సాయం చేస్తారని ఆశిస్తున్నాను’’ అని క్రికెటర్లు ఉద్దేశించి నక్వీ వ్యాఖ్యానించారు.
క్రికెటర్లు కచ్చితంగా దేశం కోసం జాతీయ జట్టుకు ఆడేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నక్వీ హితవు పలికారు. ఇటీవల స్టార్ బౌలర్ హారిస్ రవూఫ్ సెంట్రల్ కాంట్రాక్టును బోర్డు తొలగించింది. అతడు జూన్ 30 వరకు విదేశాల్లో టీ20 లీగులు ఆడకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఇషాన్, శ్రేయస్ వివాదం వేళ.. ‘రంజీ’లపై సచిన్ పోస్ట్ వైరల్
పాకిస్థాన్ జట్టులో క్రికెటర్ల కన్నా ఎక్కువగా రెజ్లర్లు కనిపిస్తున్నారని మాజీ పేసర్ ఆఖిబ్ జావెద్ మూడేళ్ల క్రితమే ఎద్దేవా చేశాడు. అప్పట్లో వారి ఆట తీరు దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం