Sachin Tendulkar: ఇషాన్, శ్రేయస్ వివాదం వేళ.. ‘రంజీ’లపై సచిన్ పోస్ట్ వైరల్
Sachin Tendulkar: సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఉండే ఆటగాళ్లు భారత్కు ప్రాతినిధ్యం వహించని సమయంలో దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ గట్టి హెచ్చరిక చేసింది. దీనిపై తాజాగా సచిన్ తెందూల్కర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది.
ముంబయి: జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు దేశవాళీ టోర్నమెంట్లలో ఆడకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీన్ని బీసీసీఐ (BCCI) తీవ్రంగా పరిగణించింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), ఇషాన్ కిషన్ (Ishan Kishan)ను సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించింది. ఈ పరిణామాలపై తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) స్పందించారు. దేశవాళీ టోర్నీలకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ బోర్డు తీసుకున్న చర్యలను అభినందించారు.
రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో ముంబయి జట్టు ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. దీనిపై సచిన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. బీసీసీఐ నిర్ణయాన్ని ప్రస్తావించారు. ‘‘నా కెరీర్లో అవకాశం దొరికినప్పుడల్లా ముంబయి తరఫున ఆడటాన్ని ఎంతో ఇష్టపడేవాణ్ని. మా డ్రెస్సింగ్ రూమ్లో 7-8 మంది జాతీయ జట్టు ఆటగాళ్లు ఉండేవారు. వాళ్లతో కలిసి ఆడటం సరదాగా ఉండేది. జాతీయ ఆటగాళ్లు తమ దేశవాళీ జట్లతో కలిసి ఆడినప్పుడే.. వారి ఆటలో నాణ్యత మరింత పెరుగుతుంది. కొన్నిసార్లు కొత్త ప్రతిభ బయటపడుతుంది. వారి బేసిక్స్ను సరికొత్తగా మెరుగుపర్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది’’ అని సచిన్ రాసుకొచ్చారు.
‘‘టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించే స్టార్ ఆటగాళ్లు దేశవాళీ టోర్నమెంట్లలో ఆడినప్పుడు వాటికి మరింత ఆదరణ దక్కుతుంది. అభిమానుల నుంచి కూడా ఆ టోర్నీలకు మద్దతు అందుతుంది. దేశవాళీ క్రికెట్కు బీసీసీఐ సమ ప్రాధాన్యం కల్పించడం అద్భుతంగా ఉంది’’ అని సచిన్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో దేశవాళీ క్రికెట్లో అత్యున్నత టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో ఆడాలన్నది బీసీసీఐ నిబంధన. కానీ ప్రస్తుత తరం క్రికెటర్లు ఈ నిబంధనను పట్టించుకోవట్లేదు. ఇటీవల ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బోర్డు ఆదేశాలపై నిర్లక్ష్యం వహించారు. దీంతో వారిపై బీసీసీఐ వేటు వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
బంగ్లాతో తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. -
Gujarat Vs Bengaluru: విల్ జాక్స్ సూపర్ సిక్స్.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!
గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్ కొట్టిన సిక్స్లను చూస్తూ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరూ చూడండి.
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.