Punjab Vs Rajasthan: రాజస్థాన్.. గత సీజన్ పరిస్థితిని తెచ్చుకోవద్దు: టామ్ మూడీ కీలక సూచన
ఐపీఎల్ 17వ సీజన్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇవాళ పంజాబ్తో తలపడేందుకు సిద్ధమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో ముల్లాన్పుర్ మైదానం వేదికగా పంజాబ్తో తలపడేందుకు రాజస్థాన్ సిద్ధమైంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచిన ఆ జట్టు గుజరాత్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్న ఆ జట్టు మిగతా మ్యాచుల్లో విజయం సాధించాలని.. లేకపోతే 2023 సీజన్ ఫలితాలే పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆసీస్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ వ్యాఖ్యానించాడు. అలాంటి ప్రమాదం రాకుండా మెరుగ్గా రాణించాలని సూచించాడు.
‘‘పంజాబ్ జట్టులో శశాంక్ గురించే నా ఆలోచనంతా. గత కొన్నేళ్లుగా అతడి ఆటను చూస్తున్నా. ఈసారి మాత్రం ఆకాశమే హద్దుగా విజృంభిస్తున్నాడు. గతంలో హైదరాబాద్ జట్టుకూ ఆడాడు. అక్కడ గొప్ప ప్రదర్శన చేయలేదు. ఇప్పుడు మాత్రం అదరగొట్టేస్తున్నాడు. రాజస్థాన్తో జరిగే మ్యాచ్లో శశాంక్ ఆటను చూడాలని ఉంది. సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ ఇప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఒక ఓటమిని చవిచూసింది. ఇలాంటప్పుడు ఓ విషయాన్ని గుర్తుకుతెస్తున్నా. గతేడాది కూడా రాజస్థాన్ వరుసగా విజయాలు సాధించి మంచి ఊపు మీదుంది. ఆ తర్వాత ఓటములతో చివరికి ప్లే ఆఫ్స్కు చేరలేకపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జోరును కొనసాగించాలి. పంజాబ్ ఓటమి బాధలో ఉంది. తప్పకుండా పుంజుకొని పంచ్ ఇవ్వడానికి ఎదురుచూస్తోంది. అర్ష్దీప్ కొత్త బంతితో స్వింగ్ అద్భుతంగా రాబడుతున్నాడు. అతడితో రాజస్థాన్కు ఇబ్బందులు తప్పవు’’ అని టామ్ మూడీ వ్యాఖ్యానించాడు.
ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశమంటే...?: గిల్క్రిస్ట్
రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్, దిల్లీ సారథి రిషభ్ పంత్, ముంబయి ఓపెనర్ ఇషాన్ కిషన్ టీ20 ప్రపంచకప్ వికెట్ కీపర్ల రేసులో ముందున్నారు. కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ.. అతడు పూర్తిస్థాయి స్పెషలిస్ట్ వికెట్ కీపర్ను పరిగణించే అవకాశాలు తక్కువ. దీంతో పై ముగ్గురిలో ఎవరిని తీసుకొనేందుకు సెలక్టర్లు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానంగా ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ స్పందించాడు. ‘‘రిషభ్ పంత్ అందరికంటే ముందున్నాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్తోనే పరుగులు చేస్తున్నారు. కేవలం ఒక్కరిని మాత్రమే తీసుకోవాలంటే పంత్ వైపే నేను మొగ్గు చూపుతా. జితేశ్ శర్మ కూడా ఉన్నప్పటికీ సీనియర్లనే ఎంచుకోవడం ఉత్తమం. పంత్ తర్వాత సంజూ జట్టులో ఉండటం బెటర్’’ అని గిల్క్రిస్ట్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..