Rajasthan vs Delhi: దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా దిల్లీతో జరిగిన పోరులో రాజస్థాన్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
జైపుర్: ఐపీఎల్ (IPL) 17వ సీజన్లో రాజస్థాన్ (Rajasthan) వరుసగా రెండో విజయం సాధించింది. దిల్లీ (Delhi)తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 12 పరుగుల తేడాతో గెలుపొందింది. 186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (49), స్టబ్స్ (44*) చెలరేగి ఆడినప్పటికీ మిగతా వారు విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో బర్గర్, చాహల్ తలో రెండు వికెట్లు తీశారు.
తొలుత వార్నర్.. తర్వాత స్టబ్స్..
186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన దిల్లీ ఓపెనర్లు వార్నర్, మార్ష్ (23: 12 బంతుల్లో) తొలి ఓవర్లో రెండు పరుగులు మాత్రమే తీశారు. అయితే రెండో ఓవర్లలో మూడు ఫోర్లు బాది బర్గర్కు మార్ష్ చుక్కలు చూపాడు. మూడో ఓవర్లోనూ ఇద్దరు బ్యాట్స్మెన్లు మూడు ఫోర్లు కొట్టడంతో ఒక్కసారిగా దిల్లీ శిబిరంలో ఊపు వచ్చింది. అయితే నాలుగో ఓవర్లో బర్గర్ రెండు వికెట్లు తీసి దిల్లీకి షాక్ ఇచ్చాడు. దూకుడుగా ఆడుతున్న మార్ష్ను, రిక్కీ భుయ్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన పంత్ (28: 26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్)తో జత కట్టిన వార్నర్ ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించాడు. ఐదో ఓవర్లో రెండు సిక్స్లు, ఆరో ఓవర్లో ఫోర్, సిక్స్ బాదడంతో పవర్ ప్లే ముగిసే సరికి 59 పరుగులతో నిలిచింది. పంత్ సైతం దూకుడుగా ఆడడంతో 10 ఓవర్లు ముగిసే సరికి దిల్లీ 2 వికెట్ల నష్టానికి 89 పరుగులతో నిలిచింది.
అయితే 97 పరుగుల వద్ద వార్నర్, 105 పరుగుల వద్ద పంత్ ఔట్ అయ్యారు. వీరు ఔటైన అనంతరం స్కోర్ ఒక్కసారిగా నెమ్మదించింది. 15.3 ఓవర్ల వద్ద అభిషేక్ (9) వెనుదిరిగాడు. దీంతో 16 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులతో నిలిచింది. ఆ సమయంలో దిల్లీ విజయానికి 24 బంతుల్లో 60 పరుగులు కావాలి. క్రీజులో స్టబ్స్, అక్షర్ పటేల్ (15*: 13 బంతుల్లో) ఉన్నారు. దిల్లీ భారీ తేడాతో ఓడిపోతుందని అంతా భావించారు. అయితే అశ్విన్ వేసిన 17వ ఓవర్లో స్టబ్స్ ఒక్క సారిగా చెలరేగిపోయాడు. రెండు సిక్స్లు బాదడంతో ఈ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్లో 9 పరుగులు, 19 ఓవర్లో 15 పరుగులు రాబట్టారు. దీంతో చివరి ఓవర్లో విజయ లక్ష్యం 17 పరుగులుగా మారింది. అయితే అవేశ్ ఖాన్ చివరి ఓవర్లో మాయ చేశాడు. అద్భుతంగా బౌలింగ్ వేసి కేవలం 4 పరుగులు మాత్రమే రాజస్థాన్ను విజయతీరాలకు చేర్చాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (84: 45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లు) విశ్వరూపం ప్రదర్శించాడు. అశ్విన్ (29), ధ్రువ్ జురెల్ (20) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, అన్రిచ్ నోర్జే, అక్షర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!