Rajasthan vs Lucknow: పూరన్, కేఎల్ రాహుల్ పోరాటం వృథా.. రాజస్థాన్దే విజయం
ఐపీఎల్ 17లో భాగంగా లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది
జైపుర్: ఐపీఎల్-17లో భాగంగా లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో లఖ్నవూ 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. అర్ధశతకం చేసిన సంజూ శాంసన్ (82*) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. లక్ష్య ఛేదనకు దిగిన లఖ్నవూ ప్రారంభం నుంచే తీవ్ర ఒత్తిడిలో కొనసాగింది. తొలి ఓవర్ చివరి బంతికే ఓపెనర్ డికాక్ (4) బర్గర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్డౌన్ వచ్చిన పడిక్కల్ (0) పరుగులేమీ చేయకుండానే బౌల్ట్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే ఆయుష్ బదోనీ (1) బర్గర్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి జట్టు స్కోరు 11 పరుగులు మాత్రమే. తీవ్ర కష్టాల్లోకి వెళ్లిన జట్టును ఆదుకునేందుకు దీపక్ హుడా (26)తో కలిసి కెప్టెన్ కేఎల్ రాహుల్ (58; 44 బంతుల్లో 4×4,2×6) తీవ్రంగా శ్రమించాడు.
క్రీజులో నిలదొక్కుకుంటున్న ఈ జోడీని చాహల్ విడగొట్టాడు. ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి హుడా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పూరన్ (64*; 41 బంతుల్లో 4×4, 4×6), రాహుల్తో కలిసి తీవ్రంగా పోరాడాడు. అయితే, జట్టు స్కోరు 145 పరుగుల వద్ద రాహుల్ భారీ షాట్కు ప్రయత్నించి మళ్లీ ధ్రువ్ చేతికే చిక్కిపోయాడు. చివర్లో వచ్చిన స్టాయినిస్ (3), కృనాల్ పాండ్య (3) రాణించకపోవడంతో లఖ్నవూకు ఓటమి తప్పలేదు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ 2 వికెట్లు తీయగా, బర్గర్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.
అదరగొట్టిన కెప్టెన్ సంజూ
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. సంజు శాంసన్ (82*; 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. రియాన్ పరాగ్ (43; 29 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (11; 9 బంతుల్లో 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ధ్రువ్ జురెల్ (20*) పరుగులు చేయగా.. పవర్ హిట్టర్ హెట్మయర్ (5) నిరాశపర్చాడు. లఖ్నవూ బౌలర్లలో నవీనుల్ హక్ 2, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..