Rajasthan vs Lucknow: పూరన్, కేఎల్ రాహుల్ పోరాటం వృథా.. రాజస్థాన్దే విజయం
ఐపీఎల్ 17లో భాగంగా లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది
జైపుర్: ఐపీఎల్-17లో భాగంగా లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో లఖ్నవూ 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. అర్ధశతకం చేసిన సంజూ శాంసన్ (82*) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. లక్ష్య ఛేదనకు దిగిన లఖ్నవూ ప్రారంభం నుంచే తీవ్ర ఒత్తిడిలో కొనసాగింది. తొలి ఓవర్ చివరి బంతికే ఓపెనర్ డికాక్ (4) బర్గర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్డౌన్ వచ్చిన పడిక్కల్ (0) పరుగులేమీ చేయకుండానే బౌల్ట్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే ఆయుష్ బదోనీ (1) బర్గర్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి జట్టు స్కోరు 11 పరుగులు మాత్రమే. తీవ్ర కష్టాల్లోకి వెళ్లిన జట్టును ఆదుకునేందుకు దీపక్ హుడా (26)తో కలిసి కెప్టెన్ కేఎల్ రాహుల్ (58; 44 బంతుల్లో 4×4,2×6) తీవ్రంగా శ్రమించాడు.
క్రీజులో నిలదొక్కుకుంటున్న ఈ జోడీని చాహల్ విడగొట్టాడు. ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి హుడా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పూరన్ (64*; 41 బంతుల్లో 4×4, 4×6), రాహుల్తో కలిసి తీవ్రంగా పోరాడాడు. అయితే, జట్టు స్కోరు 145 పరుగుల వద్ద రాహుల్ భారీ షాట్కు ప్రయత్నించి మళ్లీ ధ్రువ్ చేతికే చిక్కిపోయాడు. చివర్లో వచ్చిన స్టాయినిస్ (3), కృనాల్ పాండ్య (3) రాణించకపోవడంతో లఖ్నవూకు ఓటమి తప్పలేదు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ 2 వికెట్లు తీయగా, బర్గర్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.
అదరగొట్టిన కెప్టెన్ సంజూ
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. సంజు శాంసన్ (82*; 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. రియాన్ పరాగ్ (43; 29 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (11; 9 బంతుల్లో 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ధ్రువ్ జురెల్ (20*) పరుగులు చేయగా.. పవర్ హిట్టర్ హెట్మయర్ (5) నిరాశపర్చాడు. లఖ్నవూ బౌలర్లలో నవీనుల్ హక్ 2, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్