IND vs SL: భారత్కు ఇలాంటి విజయాలు కావాలన్న రవిశాస్త్రి.. ఫిక్సింగ్ ఆరోపణలను తోసిపుచ్చిన షోయబ్ అక్తర్!
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్లో శ్రీలంకపై భారత్ కష్టపడి గెలిచింది . పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటర్లు ఓ మోస్తరు స్కోరే (213) చేయగలిగారు. అయితే, దానినే కాపాడుకుని మరీ టీమ్ఇండియా విజయం సాధించింది. ఈ క్రమంలో భారత్ విజయం సాధించడంపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. టీమ్ఇండియా ఆటగాళ్లను అభినందనలతో ముంచెత్తాడు. మరోవైపు పాక్ ఫైనల్కు రాకుండా భారత్ - శ్రీలంక మ్యాచ్ను ఫిక్స్ చేశారని తమ దేశంలో వచ్చిన ఆరోపణలను షోయబ్ అక్తర్ కొట్టిపడేశాడు.
వారికీ క్రెడిట్ ఇవ్వాలి: భారత మాజీ ప్రధాన కోచ్
‘‘భారత్ - శ్రీలంక జట్ల మధ్య అద్భుతమైన మ్యాచ్ జరిగింది. ఇందులో శ్రీలంక ఓడిపోయినా సరే ఆ టీమ్కూ క్రెడిట్ ఇవ్వాలి. భారత్ 80/0తో ఉన్నప్పటి నుంచి 213 పరుగులకు ఆలౌట్ చేయడమే కాకుండా.. బ్యాటింగ్లోనూ చివరి వరకు పోరాడింది. యువ ఆటగాడు దునిత్ వెల్లలాగె ఇటు బౌలింగ్తోపాటు బ్యాటింగ్లోనూ రాణించాడు. తన అనుభవానికి మించి ఉత్తమ ప్రదర్శన చేశాడు. అయితే, భారత్కు ఇలాంటి మ్యాచ్లు కావాలి. ఇలాంటి విజయాలు అవసరం. పోరాడి గెలిస్తే వచ్చే మజా భలేగా ఉంటుంది. క్లిష్టమైన పిచ్పై విజయం సాధించడం సాధారణ విషయం కాదు. బ్యాటింగ్, బౌలింగ్తోపాటు ఫీల్డింగ్లోనూ టీమ్ఇండియా అదరగొట్టేసింది. సమష్టి కృషితో సాధించిన గెలుపు. తప్పకుండా ఈ విజయం ఫైనల్లో భారత్కు సానుకూలంగా మారుతుంది’’ అని తెలిపాడు.
ఫిక్స్ అయిందన్న వ్యాఖ్యలను కొట్టిపడేసిన అక్తర్
ఆసియా కప్ ఫైనల్కు తమ జట్టు రాకుండా అడ్డుకునేందుకే భారత్ చేతిలో శ్రీలంక ఓడిపోయిందని పాక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించారు. అయితే, పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాత్రం అలాంటి వ్యాఖ్యలను కొట్టిపడేశాడు. ఫిక్స్ చేసిందని మీమ్స్, మెసేజ్లు చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘‘ఎందుకు ఇలా వారు (పాక్ అభిమానులు) చేస్తున్నారో అర్థం కావడం లేదు. శ్రీలంక చేతిలో కావాలనే భారత్ ఓడిపోతుందనే విధంగా మీమ్స్, మెసేజ్లు వచ్చాయి. ఇదంతా తప్పని నిరూపించగలను. శ్రీలంక అద్భుతంగా బౌలింగ్ చేసింది. వెల్లలాగె, అసలంక ఉత్తమ ప్రదర్శనతో భారత్ను కట్టడి చేశారు. ఓ 20 ఏళ్ల కుర్రాడు (వెల్లలాగె) 43 పరుగులు చేసి నాటౌట్గా ఉండటంతోపాటు ఐదు వికెట్లు తీశాడు. విజయం కోసం శ్రీలంక తీవ్రంగా పోరాడింది. మరోవైపు భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి తన జట్టును గెలిపించాడు. రెండుజట్ల మధ్య జరిగిన పోరు అద్భుతంగా ఉంది. పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు మాత్రం పోటీనివ్వలేకపోయారు. మన ఫాస్ట్బౌలర్లు సరిగ్గా ఆడలేదు. అలాంటప్పుడు ఇలాంటి ఫిక్సింగ్ మాటలు ఎలా చెప్పగలం..? అయితే, తప్పకుండా పాక్ పుంజుకుంటుందనే ఆశాభావం ఉంది’ అని అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్లో వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి