Ashwin- WTC Final: నాకు ముందే తెలుసు.. జట్టు అలా ఉండాలనేది మేనేజ్మెంట్ నిర్ణయం: అశ్విన్
వరుసగా రెండోసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final 2023) ఓడిన భారత్.. అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. జట్టు ఎంపికపైనే తొలి విమర్శ రాగా, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను తీసుకోకపోవడం సరైన నిర్ణయం కాదనే వాదనా ఉంది. తాజాగా అశ్విన్ (Ashwin) ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final)లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఆడించకుండా భారత్ పక్కన పెట్టేసింది. టెస్టు ఫైనల్కు టీమ్ఇండియా రావడంలో అశ్విన్దే కీలక పాత్ర. అలాంటి అతడిని కాదని ఏకైక స్పిన్నర్గా రవీంద్ర జడేజా వైపు టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. నలుగురు పేసర్లతో బరిలోకి దిగడంతోనే అశ్విన్కు చోటు దక్కలేదు. ఫైనల్ మ్యాచ్లో భారత్పై ఆస్ట్రేలియా విజయం సాధించి ‘గద’ను సొంతం చేసుకుంది. అశ్విన్ను తీసుకోకపోవడంపై విమర్శలూ వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా రవిచంద్రన్ అశ్విన్ డబ్ల్యూటీసీ ఫైనల్పై స్పందించాడు. తనకు మ్యాచ్కు ముందే ఈ విషయం తెలుసని చెప్పాడు. జట్టులో ఉంటే బాగుండేదని, అయితే భారత్ ఓడిపోవడం మాత్రం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నాడు.
‘‘ఎందుకు పక్కన పెట్టారు..? అనేది చాలా కఠినమైన ప్రశ్న. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్లోకి భారత్ అడుగు పెట్టడం అద్భుతం. అయితే, నేను ఫైనల్లో ఆడి ఉంటే ఇంకా బాగుండేది. గత డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ నేను నాలుగు వికెట్లు తీశా. బౌలింగ్ ఉత్తమంగానే వేశా. అయితే, ఈసారి కూడా భారత్ ఓడిపోవడం బాధ కలిగించింది. 2018 -19 సీజన్ నుంచి విదేశాల్లోనూ ఎక్కువగానే వికెట్లు తీశా. జట్టు విజయాల్లోనూ కీలక పాత్రే పోషించా. టెస్టుల్లో ఎప్పుడైనా సరే నాలుగో ఇన్నింగ్స్ చాలా కీలకం. స్పిన్నర్ను తట్టుకోవడం కష్టం. కానీ, ఓవల్ మైదానంలో నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. దీంతో ఏకైక స్పిన్నర్గా జడ్డూను తీసుకోవాల్సి వచ్చింది.
బయటి నుంచి వచ్చే విమర్శలను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నాకు నేనే విమర్శకుడిని. వారు నన్ను జడ్జ్ చేయడం మూర్ఖత్వం అవుతుంది. ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారనే దానిపై ఆలోచించేంత స్టేజ్లో నా కెరీర్ లేదు. నా సత్త ఏంటా నాకు తెలుసు. సరిగ్గా ప్రదర్శన లేకపోతే.. తొలి విమర్శకుడిని నేనే. దానిపై నేను తీవ్రంగా కృషి చేసి మెరుగుపర్చుకుంటా. అంతేకానీ, ఎవరు నన్ను జడ్జ్ చేస్తున్నారనేది నాకు అనవసరం’’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సొంతగడ్డపై మురిసిన చెన్నై.. రాజస్థాన్పై ఘన విజయం
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై తమ సొంతమైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. ధోనీని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే దిల్లీ, బెంగళూరుకు ఈ విజయం కీలకమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ మ్యాచ్ జరగనుంది. -
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండటానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. నాణ్యమైన ఇన్నింగ్స్లతో ఆర్సీబీ జట్టులో కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
ప్లేఆఫ్స్ కోసం తీవ్రంగా పోరాడుతున్న దిల్లీ జట్టుకు ఐపీఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఆ జట్టు సారథిపై ఒక మ్యాచ్ వేటు వేసింది. -
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి. -
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
మూడు ‘ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. అందులో ఇవాళ నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన మొదటి టీమ్గా కోల్కతా అర్హత సాధించింది. ముంబయిని చిత్తు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. -
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు