Ricky Ponting: ఇప్పుడు భారత ప్రధాన కోచ్గా రాలేను..: రికీ పాంటింగ్
భారత ప్రధాన కోచ్ పదవికి ఉన్నంత డిమాండ్ మరెక్కడా ఉండదేమో. అదే సమయంలో ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టును నడిపించడం సాధారణ విషయం కాదు.
ఇంటర్నెట్ డెస్క్: మరో నాలుగు రోజుల్లో భారత ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఈ రేసులో కొత్త పేర్లు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే స్టీఫెన్ ప్లెమింగ్, జస్టిన్ లాంగర్, గౌతమ్ గంభీర్, సెహ్వాగ్.. ఇలా లిస్ట్ చాలా ఉంది. అయితే, ఇప్పటివరకు ‘మేం రెడీ’ అంటూ ఎవరూ చెప్పలేదు. అసలు ఎవరు దరఖాస్తు చేశారనేదీ బీసీసీఐ వెల్లడించలేదు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్, దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) ‘ఈసారి’ నేను అప్లై చేయడం లేదంటూ స్పష్టంచేశాడు. దానికి కారణం ఏంటనేది కూడా వెల్లడించాడు.
‘‘భారత ప్రధాన కోచ్ పదవి అత్యంత క్లిష్టమైందని ఇప్పటికే చెప్పా. బాధ్యతలు చేపట్టిన వ్యక్తిపై భారీ అంచనాలు ఉంటాయి. అయితే, నేను ఇప్పుడు ఈ స్థానంలో పని చేసేందుకు సిద్ధంగా లేను. తప్పకుండా భవిష్యత్తులో దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకపోలేదు. సీనియర్ జాతీయ జట్టుకు కోచ్గా బాధ్యతలు చేపట్టడం అత్యంత గౌరవంగా భావిస్తా. కానీ, ఈసారి మాత్రం అలాంటి అవకాశం లేదు. వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమైందే. కుటుంబం కోసం సమయం వెచ్చించాల్సి ఉంది. ఇక భారత కోచ్గా దాదాపు పది నెలలపాటు విధుల్లోనే ఉండాలి. ఐపీఎల్తో సంబంధం ఉండకూడదు.
ఇప్పుడు నా జీవన శైలికి అది సరిపడదు. జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు గత ఐదు వారాలు నా కుటుంబం, పిల్లలు నాతోనే ఉన్నారు. ప్రతి ఏడాది ఇలా రావడం చాలా బాగుంటుంది. భారత ప్రధాన కోచ్గా మాత్రం అలాంటి అవకాశం ఉండదు. అయితే, నా కుమారుడు మాత్రం ఈ ఛాన్స్ వస్తే వదులుకోవద్దని సూచించాడు. ఇప్పుడు మాత్రం దానికి సరిపోయేలా జీవనశైలి లేదని కచ్చితంగా చెప్పగలను. భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి’’ అని పాంటింగ్ వెల్లడించాడు. ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం జూన్ చివరితో ముగియనుంది. కొత్తగా వచ్చే కోచ్ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు జట్టును నడిపించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చివరిది వరుణుడికి
అనుకున్నదే జరిగింది. గ్రూప్- ఎ లో భారత్ చివరి మ్యాచ్ను వరుణుడు ఆడనివ్వలేదు. కీలకమైన సూపర్- 8 పోరుకు ముందు అన్ని విభాగాల్లోనూ మరోసారి సత్తాచాటాలని చూసిన టీమ్ఇండియా ఆశ తీరలేదు. -
చిన్నోళ్లు దమ్మున్నోళ్లు
ఎవరైనా ఊహించారా.. టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ను వెనక్కినెట్టి అమెరికా సూపర్- 8కు చేరుతుందని! ఎవరైనా అనుకున్నారా.. ప్రపంచకప్ల్లో అత్యంత నిలకడగా ఆడే న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుందని! కానీ ఇవి జరిగాయి. -
నేపాల్ ఒక్క పరుగు తేడాతో..
టీ20 ప్రపంచకప్లో మరో సంచలనం కొద్దిలో తప్పింది. కూనల చేతిలో షాక్ తిన్న జట్ల జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరేదే. నేపాల్పై ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో అతికష్టంగా గట్టెక్కింది. -
కివీస్ తొలి గెలుపు
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ సూపర్-8కు దూరమైన న్యూజిలాండ్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది. -
జర్మనీ ఘన బోణీ
యూరో కప్ను ఆతిథ్య జర్మనీ విజయంతో మొదలెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్- ఎ మ్యాచ్లో ఆ జట్టు 5-1 తేడాతో స్కాట్లాండ్ను చిత్తుచేసింది. -
ఏ జట్టునైనా ఓడించగలం
పూర్తి స్థాయిలో ఆడితే ఏ జట్టునైనా ఓడించగలమని అమెరికా వైస్ కెప్టెన్ అరోన్ జోన్స్ అన్నాడు. ‘‘సూపర్-8 సవాల్కు సిద్ధంగా ఉన్నాం. రెండో రౌండ్ చేరడం మాకో పెద్ద ఘనత. -
గంభీర్ సమర్థుడే కానీ..
టీమ్ఇండియా కోచ్ పదవి రేసులో గౌతమ్ గంభీర్ ముందున్నాడు. మెంటార్గా ఇటీవల కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
సంక్షిప్త వార్తలు(5)
జాతీయ జట్టు తరపున ఇదే తనకు చివరి టీ20 ప్రపంచకప్ అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ప్రకటించాడు. కానీ కివీస్ జట్టుతో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే విషయంపై మాత్రం అతను స్పష్టత ఇవ్వలేదు. -
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. దీంతో పాక్ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు వెల్లడి?
-
ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!
-
అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల
-
వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు