Rohit on World Cup 2011: ఆ వరల్డ్ కప్ మ్యాచ్లను చూడొద్దనుకున్నా.. కానీ: రోహిత్
పన్నెండేళ్ల కిందట భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ను (ODI World Cup) భారత్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి స్వదేశంలో మెగా టోర్నీ జరగనుడటంతో టీమ్ఇండియాపై (Team India) భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే, తాము విజేతగా నిలిచేందుకు చెబుతూనే.. 2011 వరల్డ్ కప్ మ్యాచ్ల గురించి కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ రెండో వన్డే ప్రపంచకప్ను గెలిచిన 2011వ (Odi World Cup 2011) ఏడాదిని ఎవరూ మరిచిపోలేరు. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలోని టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో యువకుడైన రోహిత్ శర్మకు (Rohit Sharma) ఆ మెగా టోర్నీలో ఆడే అవకాశం రాలేదు. అతడి కంటే అంతర్జాతీయ క్రికెట్ను వెనుక ప్రారంభించిన విరాట్ కోహ్లీకి (Virat Kohli) మాత్రం జట్టులో చోటు దక్కింది. దీంతో అసంతృప్తితో వరల్డ్ కప్ మ్యాచ్లను చూడకూడదని రోహిత్ భావించాడట. అయితే, భారత్ అద్భుతంగా ఆడటంతో ప్రతి మ్యాచ్నూ వదలకుండా వీక్షించినట్లు గుర్తు చేసుకున్నాడు. అమెరికాలో ఐసీసీ ప్రపంచకప్ ప్రచార కార్యక్రమంలో రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘2011 వరల్డ్ కప్ నాతో సహా ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇంట్లో నుంచే మ్యాచ్లను వీక్షించా. అయితే, అప్పుడు నేను రెండు రకాలుగా భావోద్వేగానికి గురయ్యా. నేను జట్టులో లేను. చాలా నిరుత్సాహానికి గురయ్యా. దాంతో తొలుత వరల్డ్ కప్ను చూడకూడదని బలంగా అనుకున్నా. కానీ, టీమ్ఇండియా అద్భుతంగా ఆడింది. మరీ ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్ నుంచి దూకుడుగా ఆడింది. సెమీస్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ను ఎంజాయ్ చేశా. తీవ్ర ఒత్తిడి ఉండే ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించడం ఎప్పటికీ మరిచిపోలేను. చివరికి భారత్ విజేతగా నిలవడం ఓ అద్భుతం.
ఆసీస్ జట్టులో ట్యాక్సీ డ్రైవర్ తనయుడు
నేను 2011 వరల్డ్ కప్లో ఆడలేకపోయా. అయితే, ఆ తర్వాత జరిగిన 2015, 2019 ప్రపంచకప్లో బరిలోకి దిగా. రెండుసార్లూ సెమీస్కు చేరుకున్నాం. ప్రతి ఒక్కరం జట్టును ఫైనల్కు చేర్చి విజేతగా నిలిపేందుకు ప్రయత్నించాం. దురదృష్టవశాత్తూ సాధ్యంకాలేదు. ఇప్పుడు మళ్లీ స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్నాం. విజేతగా నిలిచేందుకు మావంతు కృషి చేస్తాం. ఒకటీ రెండు రోజుల్లో వరల్డ్ కప్ను గెలవలేం. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించాలి. జట్టుగా మేం వరల్డ్ కప్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం’’ అని రోహిత్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ విజయంతో..
దిల్లీ గెలుపుతో లీగ్ దశను ముగించింది. బ్యాటుతో పోరెల్, స్టబ్స్.. బంతితో ఇషాంత్ మెరిసిన వేళ లఖ్నవూను మట్టికరిపించింది. ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న దిల్లీ, సాంకేతికంగా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. -
ద్రవిడ్ స్థానంలో ఎవరు?
టీ20 ప్రపంచకప్తో రాహుల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ వేటను మొదలెట్టింది. ఇప్పటికే ఆ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఆసక్తికర అంశం. -
అగ్రస్థానంలో మను
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. మంగళవారం ఆఖరిదైన నాలుగో ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. -
ఆ నిబంధన మంచిదే
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది ఆటగాళ్లు, నిపుణులు విమర్శిస్తుంటే, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అది మంచిదే అంటున్నాడు. ఆ నిబంధన వల్ల మ్యాచ్లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఆ ట్రోఫీని వేలం వేయొద్దు
1986 ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన ‘గోల్డెన్బాల్ ట్రోఫీ’ని వేలం వేయొద్దని అతడి వారసులు కోర్టుకెక్కనున్నారు. -
టాప్సీడ్గా అర్జున్
యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీని అయిదో స్థానంలో ముగించిన అర్జున్.. -
మనిక @ 24
భారత టేబుల్టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ మెరిశాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు ఫైనల్కు దూసుకెళ్లాడు. -
సంక్షిప్త వార్తలు
ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గౌరవ్ చౌహాన్ పతకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే (కజకిస్థాన్)ను ఓడించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్లాష్... ఫ్లాష్... నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో