Rohit Sharma: రుతురాజ్ తాత్కాలికమే.. రోహిత్ వచ్చేస్తాడు: చెన్నై కెప్టెన్సీపై మైకెల్ వాన్
ఐపీఎల్లో ముంబయిని ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన సారథి రోహిత్ శర్మ. అలాంటి అతడి స్థానంలో ముంబయి మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో ముంబయి సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి హార్దిక్ పాండ్యకు అప్పగించడంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. ముంబయి మ్యాచుల సందర్భంగా అభిమానులు కూడా రోహితే మళ్లీ కెప్టెన్సీ చేపట్టాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు క్రికెట్ విశ్లేషకులకు మాత్రం రోహిత్ను ఈ సీజన్ తర్వాత ముంబయి రిటైన్ చేసుకోదని చెబుతున్నారు. మెగా వేలంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువేనని.. ఆలోపే మరో జట్టు తీసుకొనేందుకూ ఛాన్స్ ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు. చెన్నై లేదా లఖ్నవూ రోహిత్ను తీసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందనే చర్చ వచ్చింది. తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కూడా రోహిత్ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘రోహిత్ శర్మ చెన్నైకి వెళ్తున్నాడా? ధోనీని (MS Dhoni) రీప్లేస్ చేస్తాడా? రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఈ ఏడాది మాత్రమే కెప్టెన్సీ నిర్వర్తిస్తాడా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. వచ్చే ఏడాది సారథ్య బాధ్యతలను రోహిత్కు అప్పగిస్తారు. అతడిని చెన్నైలో చూస్తానని అనుకుంటున్నా. ఇదే జరిగితే ముంబయి అభిమానులకు గుండె పగిలే న్యూస్ అవుతుంది. సన్రైజర్స్ హైదరాబాద్కు వెళ్లినా ఆశ్చర్యపడక్కర్లేదు. గతంలో డెక్కన్ ఛార్జర్స్కు అతడు ఆడాడు.
ముంబయి జట్టుకు రావడంతో హార్దిక్కు (Hardik Pandya) కష్టకాలం మొదలైంది. ఇందులో అతడి తప్పులేదు. ముంబయి కెప్టెన్సీ బాధ్యతలను అడిగి తీసుకున్నాడు. ప్రతీ భారత క్రికెటర్ ముంబయి వంటి జట్టుకు సారథ్యం చేయాలని కోరుకుంటాడు. గత కొన్నేళ్లుగా ముంబయి జట్టులో సరైన కమ్యూనికేషన్ లేదని అర్థమవుతోంది. వ్యక్తిగతంగా నేను రోహిత్ కెప్టెన్సీకే మొగ్గు చూపుతా. హార్దిక్ తిరిగి రావడం ఒత్తిడికి గురి చేసే అంశమే. వచ్చే వరల్డ్ కప్లో భారత టీ20 జట్టును నడిపించేది రోహితే. కాబట్టి, హార్దిక్ జాతీయజట్టు స్థానాన్ని దృష్టిలోపెట్టుకొనైనా రోహిత్ను ముంబయికి మళ్లీ కెప్టెన్ చేస్తే బాగుంటుంది. అలా చేయకపోతే రోహిత్ను చేజార్చుకున్నట్లే’’ అని మైకెల్ వాన్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య