IND vs PAK: విరాట్ కోహ్లీ, రోహిత్ బౌల్డ్.. ఎవరి వికెట్ను ఎంజాయ్ చేశానంటే?: షహీన్
ఆసియా కప్లో పాక్తో (IND vs PAK) మ్యాచ్ రద్దు కావడంతో భారత్ ఒక్క పాయింట్తో సరిపెట్టుకుంది. ఇక రెండో మ్యాచ్లో నేపాల్ను ఓడిస్తే నేరుగా సూపర్ -4కి (Asia Cup 2023) చేరుతుంది. మరోవైపు టీమ్ఇండియాను (Team India) కట్టడి చేయడంలో పాక్ పేసర్ షహీన్ కీలక పాత్ర పోషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ సగం జోష్ మాత్రమే అందించింది. కేవలం ఒక్క ఇన్నింగ్స్ ఆట మాత్రమే సాగడంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. భారత బ్యాటింగ్ను చూసే అవకాశం మాత్రమే వచ్చింది. పాక్ పేసర్లు విజృంభించడంతో పది వికెట్లూ వారికే దక్కాయి. మరీ ముఖ్యంగా పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది తన గేమ్ ప్లాన్ను పక్కాగా అమలు చేసి చూపించాడు. కీలకమైన వికెట్లను తీసి భారత్ను ఒత్తిడికి గురి చేశాడు. అలాగే సెకండ్ స్పెల్లోనూ మరోసారి వికెట్లను పడగొట్టాడు. దీంతో 10 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓపెనర్ రోహిత్ శర్మతోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బౌల్డ్ చేశాడు. అలాగే స్లో బంతితో హార్దిక్ పాండ్యను బోల్తా కొట్టించాడు. మరో ఆఫ్సైడ్ షార్ప్ బాల్ వేసి జడేజాను పెవిలియన్కు చేర్చాడు. అయితే, తాను మాత్రం రోహిత్ శర్మను బౌల్డ్ చేయడాన్ని ఎంజాయ్ చేసినట్లు షహీన్ చెప్పాడు.
ఊరించి.. ఉసూరుమనిపించి.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ మ్యాచ్ రద్దు
‘‘కొత్త బంతితో త్వరగా వికెట్లు తీయాలనేది మా గేమ్ ప్లాన్. భారత్తో మ్యాచ్లో ఇదే జరిగింది. విరాట్, రోహిత్ శర్మ వికెట్లు చాలా కీలకం. అయితే, అన్ని వికెట్లు ఒకటే కానీ, వారిద్దరిని బౌల్డ్ చేయడం ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ వికెట్ తీయడం మరింత ఎంజాయ్ చేశా. పేసర్లుగా మేం అనుకున్న విధంగానే ఫలితం రాబట్టగలిగాం. నసీమ్ షా 150 కి.మీ వేగంతో బంతులను సంధిస్తున్నాడు. కొత్త బంతితో స్వింగ్ వస్తుండటంతో పరుగులు చేయడం కష్టమే. అయితే, ఛేదనలో కాస్త నిలదొక్కుకుని బంతి పాతబడే వరకు వేచి చూస్తే పరుగులు చేయొచ్చు. కానీ, వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడం కాస్త నిరాశకు గురి చేసింది’’ అని షహీన్ తెలిపాడు.
ఆసియా కప్లో తొలిసారి ఇలా..
ఆసియా కప్లో తొలిసారి ఒకే మ్యాచ్లో 10 వికెట్లూ తీసిన జట్టుగా పాకిస్థాన్ అవతరించింది. ఈ మ్యాచ్లో షహీన్ 4, రవూఫ్ 3, నసీమ్ 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు 9 వికెట్లు తీసిన రికార్డు కూడా పాక్ పేరిటే ఉంది. 2004 ఆసియా కప్లో బంగ్లాదేశ్పై షమి, షోయబ్ అక్తర్, షబ్బిర్ అహ్మద్ మూడేసి వికెట్లు తీశారు. భారత పేసర్లు కూడా శ్రీలంకపై 1984లో ఎనిమిది వికెట్లు తీశారు. ఇందులో చేతన్ శర్మ, మదన్లాల్ మూడేసి వికెట్లు తీయగా.. మనోజ్ ప్రభాకర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.