T20 World Cup: టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు.
T20 World Cup | దిల్లీ: టీ20 క్రికెట్లో టీమిండియా ఎలాంటి భయం లేకుండా ఆడాల్సిన అవసరం ఉందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, దిల్లీ ఐపీఎల్ జట్టు డైరెక్టర్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) అన్నాడు. ఈ సందర్భంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. 40 బంతుల్లో సెంచరీ చేయగల సత్తా అతడికి ఉందని సోమవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కొనియాడాడు.
భయం వీడాలి..
‘‘ఎలాంటి భయం లేకుండా ఆడడం చాలా ముఖ్యం. టీ20ల్లో ప్లేయర్ల వయసుకు సంబంధించి ఓ నిర్దిష్ట నియమేమీ లేదు. జేమ్స్ ఆండర్సన్ ఇంకా టెస్టులు ఆడుతూ.. 30 ఓవర్లు బౌలింగ్ వేస్తున్నాడు. 40 ఏళ్ల ధోని ఇంకా సిక్సర్లు బాదుతున్నాడు. బౌండరీలు కొట్టడం ముఖ్యం. జట్టు మొత్తం హిట్టింగ్పై దృష్టి సారించాలి. రోహిత్ (Rohit Sharma) , విరాట్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య.. ఇలా చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లున్నారు. బౌండరీలు బాదడంలో వారి నైపుణ్యం అద్భుతం’’ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
ఓపెనర్లుగా వీరిద్దరూ..
టీ20 ప్రపంచ కప్నకు (T20 World Cup) జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్లేయర్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత సెలక్షన్ కమిటీ, కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్పై ఉందని గంగూలీ గుర్తుచేశాడు. అయితే, తాను మాత్రం కోహ్లీ, రోహిత్ (Rohit Sharma) కలిసి ఓపెనింగ్కు దిగితే బాగుంటుందని భావిస్తున్నానన్నాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమనని.. సెలెక్టర్లు కచ్చితంగా ఇలాగే చేయాలని తాను సూచించడం లేదన్నాడు. తుది నిర్ణయం వారిదేనని స్పష్టం చేశాడు.
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
జైశ్వాల్కు అవకాశం ఉంది..
ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్, ఐపీఎల్లో (IPL) ఫామ్ను బట్టి టీ20 కప్ ఎంపికకు జైశ్వాల్ దూరమైనట్లేనా అన్న ప్రశ్నకు గంగూలీ (Sourav Ganguly) స్పందించాడు. అతడు అద్భుతమైన ప్లేయర్.. అతడి ఎంపికను అప్పుడే కొట్టిపారేయలేమని తెలిపాడు. కేవలం ఐపీఎల్ను దృష్టిలో ఉంచుకొని టీ20 కప్ జట్టు సెలెక్షన్ ఉండకూడదని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ టోర్నీలు, గత మూడు సీజన్లను సైతం పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. తాజా ఐపీఎల్ సీజన్ ఆరంభంలో నిరాశపర్చిన జైశ్వాల్ నెమ్మదిగా ఫామ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. నిన్న ముంబయితో జరిగిన మ్యాచ్లో 60 బంతుల్లో శతకం బాది రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
జట్టులో సమతూకం..
జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్లో జరగనున్న టీ20 కప్నకు (T20 World Cup) ఎంపిక చేసే జట్టులో యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులూ ఉండాల్సిన అవసరం ఉందని గంగూలీ తెలిపాడు. రెండింటి మధ్య సమతూకం అవసరమన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు