ODI World Cup 2023: వికెట్ కీపర్గా అతడే బెటర్.. సచినే ఎందుకు అత్యుత్తమమంటే?
ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) నేపథ్యంలో జట్టులో ఎవరు ఉంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే సచిన్ ఎందుకు అత్యుత్తమో అక్తర్ విశ్లేషించాడు. ఇలాంటి విషయాల సమాహారం మీ కోసం..
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్ - బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) లేకపోవడంతో వన్డే వరల్డ్ కప్లో (ODI World Cup 2023) అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిని కలిచివేస్తోంది. ముగ్గురు ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారిలో ఎవరికి అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (KL Rahul), సంజూ శాంసన్తోపాటు ఇషాన్ కిషన్ (Ishan Kishan) రేసులో ఉన్నాడు. సంజూ నుంచి గొప్ప ప్రదర్శన లేకపోవడంతో అతడికి చోటు దక్కడం కష్టమే. ఇక కేఎల్తోపాటు ఇషాన్ను బ్యాకప్గా తీసుకుంటారనే వాదనా ఉంది. కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్నాడు. పూర్తిస్థాయి వికెట్ కీపర్గా బాధ్యతలు చేపట్టడం అంత సులువేం కాదు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) తన ఎంపిక ఎవరనేది వెల్లడించాడు.
వరుస రోజుల్లో మ్యాచ్లు నిర్వహిస్తే సెక్యూరిటీ కష్టమే..
‘‘ప్రస్తుతం భారత్లో పంత్ అత్యుత్తమ వికెట్ కీపర్. అలాగే ఇషాన్ కిషన్తోపాటు కేఎల్ రాహుల్ కూడా నాణ్యమైన ఆటగాళ్లే. అయితే, కేఎల్ పూర్తిస్థాయి ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వీరిద్దరే ఇప్పుడు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ మదిలో ఉంటారు. అయితే, ఇషాన్ కిషన్ వైపే నేను మొగ్గు చూపుతా. ఏ జట్టు తరఫున ఆడినా ఇన్నింగ్స్ను ప్రారంభించగలడు. తప్పకుండా ద్రవిడ్ కూడా ఇషాన్ను తన ప్రణాళికల్లో ఉండేలా చూసుకోవాలి. వన్డే వరల్డ్ కప్ బరిలోకి దిగే జట్టులో సీనియర్లతోపాటు యువకులు ఉండేలా ఎంపిక చేయాలి. జైస్వాల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వంటి కుర్రాళ్లు ఎలాంటి బెరుకు లేకుండా ఆడేస్తారు. సెలెక్షన్ కమిటీ ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి. సరైన జట్టును ఎంపిక చేయాలి’’ అని గంగూలీ సూచించాడు.
భీకర బౌలర్లను ఎదుర్కొని మరీ..: సచిన్పై అక్తర్ ప్రశంసలు
పాకిస్థాన్పై 1989లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఇప్పటికీ ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాడు. అన్ని ఫార్మాట్లు కలిపి వంద శతకాలు బాదిన ఏకైక బ్యాటర్గా రికార్డును తనపేరిట లిఖించుకున్న సచిన్ కంటే మరెవరూ అత్యుత్తమం కాదని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు.
‘‘సచిన్ను ఆల్టైమ్ గ్రేట్ అని ఎందుకు అంటాననే దానికి కారణం ఉంది. కెరీర్ ఆరంభంలోనే షేన్ వార్న్, మెక్గ్రాత్, వసీమ్ అక్రమ్తోపాటు విండీస్, దక్షిణాఫ్రికా భీకర పేసర్లను ఎదుర్కొని మరీ భారీగా పరుగులు సాధించాడు. పదేళ్ల తర్వాత నాతోపాటు బ్రెట్లీ, డేల్ స్టెయిన్ వంటి పేసర్ల బౌలింగ్లో ఆడాడు. అందుకే ‘అత్యుత్తమం’ కంటే చిన్న పదం వాడలేం. 2003 ప్రపంచ కప్లో మా జట్టుపై అతడు సాధించిన 98 పరుగుల ఇన్నింగ్స్ అద్భుతం. సెహ్వాగ్తోపాటు ఇతర బ్యాటర్లతో కలిసి పాక్పై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అతడితోపాటు మిడిలార్డర్లో యువరాజ్ సింగ్ను అభినందించకుండా ఉండలేం. మిడిలార్డర్లో యువీ అద్భుతమైన ఆటగాడు’’ అని అక్తర్ విశ్లేషించాడు.
భారత్ కంటే మా జట్టు మిడిలార్డర్ పటిష్ఠం: పాక్ మాజీ
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) బరిలోకి దిగనున్న భారత్ మిడిలార్డర్ (IND vs PAK) కంటే తమ దేశ మిడిలార్డర్ కాస్త బలంగా ఉందని పాక్ మాజీ ఆటగాడు బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. భారత్ ఇప్పటికీ వికెట్ కీపర్గా తొలి ఎంపిక ఎవరనేది స్పష్టత ఇవ్వలేకపోతోంది. ఆసియా కప్ కోసం జట్టును సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. ‘‘పాక్ టాప్ ఆర్డర్లో బాబర్, ఫఖర్, ఇమామ్, రిజ్వాన్ ఉన్నారు. ఇఫ్తికార్ అహ్మద్, సల్మాన్ అలీ, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్తో కూడిన మిడిలార్డర్ ఉంది. భారత్తో పోలిస్తే ఇప్పటికైతే పాక్ మిడిలార్డర్ బెటర్. అయితే, ఇషాన్ కిషన్ ఐదో స్థానంలో ఆడితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక యువ బ్యాటర్ తిలక్ వర్మను మూడో స్థానంలో ఆడించి.. విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో దింపితే సమతూకంగా ఉండే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్లోని రోహిత్, గిల్, విరాట్ అద్భుతమైన ప్రదర్శన ఇస్తే ఆసియా కప్, వరల్డ్ కప్లో భారత్ను ఓడించడం చాలా కష్టం’’ అని అలీ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rishab Pant: ఆట పట్టించిన అభిమాని.. రిషభ్ పంత్ ఏం చేశాడో తెలుసా?
ప్రముఖ యూట్యూబర్, మరగుజ్జు విభు వర్షిణి (Vibhu Varshney) దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వీరాభిమాని. ప్రాక్టీస్ చేస్తున్న రిషభ్ పంత్ను.. విభు వర్షిణి పలు ప్రశ్నలు అడుగుతూ చిరాకు తెప్పించాడు. దీంతో అతడిని స్టేడియంలో ఉన్న ఓ గేటుపైకి ఎక్కించాడు.
-
KL Rahul: కేఎల్ రాహుల్ మంచి మనసు.. చక్రాల కుర్చీలో ఉన్న అభిమాని దగ్గరికెళ్లి సెల్ఫీ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా బుధవారం హైదరాబాద్తో మ్యాచ్ ఆడేందుకు లఖ్నవూ జట్టు భాగ్యనగరానికి వచ్చింది. అయితే ఓ దివ్యాంగుడు లఖ్నవూ జట్టుకు అభిమాని. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ అభిమాని దగ్గరికెళ్లి కరచాలనం చేసి.. అతడి సెల్ఫోన్ తీసుకుని స్వయంగా సెల్ఫీ దిగాడు.
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
ఐపీఎల్లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోర్లు నమోదవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే, టాప్ -4లో నిలిచి ప్లేఆఫ్స్కు అర్హత సాధించే జట్లేవనేది ఆసక్తికరంగా మారింది. -
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
హైదరాబాద్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మ్యాచ్ వచ్చేస్తోంది. లఖ్నవూతో ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్ను దిల్లీ ఫీల్డర్ షై హోప్ అద్భుతంగా పట్టాడు. కానీ, బౌండరీ లైన్కు అతడి పాదం తాకిందనే ఆరోపణలు వచ్చాయి. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. -
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
దిల్లీ మళ్లీ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. రాజస్థాన్ను ఓడించడంలో ఆ జట్టు బౌలర్ కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
క్యాచ్ల విషయంలో రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంపైర్లు పొరపాటు చేయడం సరైంది కాదనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. -
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం