Jay Shah: జై షాపై రణతుంగ వ్యాఖ్యలు.. స్పందించిన శ్రీలంక ప్రభుత్వం
ఎస్ఎల్సీని బీసీసీఐ కార్యదర్శి జై షా నియంత్రిస్తున్నారని మాజీ క్రికెటర్ అర్జున రణతుంగా చేసిన ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది.
కొలంబో: బీసీసీఐ (BCCI) కార్యదర్శి జై షా (Jay Shah)పై శ్రీలంక (SriLanka)మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యలపై శ్రీలంక ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం శ్రీలంక పార్లమెంట్ సమావేశాల్లో మంత్రులు హరీన్ ఫెర్నాండో, కాంచన విజేశేఖర ఒక ప్రకటన చేశారు. ‘‘ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షాపై కొందరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను శ్రీలంక ప్రభుత్వం ఖండిస్తుంది. వాటిపై విచారం వ్యక్తం చేస్తున్నాం. మా సంస్థలోని లోపాలను ఏసీసీ అధ్యక్షుడు, కార్యదర్శికి ఆపాదించలేం. అది పూర్తిగా తప్పుడు భావన’’ అని మంత్రి విజేశేఖర అన్నారు.
ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC)పై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని జై షాను శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కోరినట్లు మంత్రి హరీన్ ఫెర్నాండో తెలిపారు. ‘‘ఎస్ఎల్సీపై ఐసీసీ విధించిన నిషేధం శ్రీలంకతోపాటు, వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఐసీసీ నిషేధం ఎత్తేయకుంటే.. శ్రీలంకకు ఎవరూ రారు. క్రికెట్ టోర్నమెంట్ ద్వారా శ్రీలంకకు ఆర్థికంగా ఎలాంటి లాభం ఉండదు’’ అని హరీన్ ఫెర్నాండో అన్నారు.
‘చోకర్స్’కు అర్థమే వేరు.. మేం ఆసీస్పై చివరి వరకూ పోరాడాం: దక్షిణాఫ్రికా కోచ్
వన్డే ప్రపంచకప్లో శ్రీలంక ఘోర వైఫల్యం తర్వాత ఆ దేశ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎల్సీ బీసీసీఐ కార్యదర్శి జై షా నియంత్రిస్తున్నారని శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ ఆరోపించారు. ‘‘ఎస్ఎల్సీ అధికారులు, బీసీసీఐ మధ్య ఉన్న పరిచయాలతో వారు ఎస్ఎల్సీని నియంత్రించగలమని భావిస్తున్నారు. జై షా కనుసన్నల్లో ఎస్ఎల్సీ పనిచేస్తుంది. ఆయన ఒత్తిడితోనే ఎస్ఎల్సీ నాశనం అయింది’’ అని రణతుంగ ఆరోపించారు. మరోవైపు ఎస్ఎల్సీని రద్దు చేస్తూ ఆ దేశ క్రీడల మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి కోర్డు కొట్టేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్