World Athletics Championships: నీరజ్లా.. నిలిచేదెవరో? మన అథ్లెట్లు ఏం చేస్తారో?
హంగేరీలోని బుడాపెస్ట్లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్(World Athletics Championships 2023) పోటీలు శనివారమే ఆరంభమయ్యాయి. నిరుడు ఈ ఛాంపియన్షిప్స్లో నీరజ్ రజతం గెలిచాడు. మరి ఈ సారి పతకంతో నీరజ్లా నిలిచేదెవరో?
2020 టోక్యో ఒలింపిక్స్ (2021)లో జావెలిన్ త్రో స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా(Neeraj Chopra). ఈ పసిడితో భారత అథ్లెటిక్స్లో విప్లవమే వచ్చింది. దేశంలో అథ్లెటిక్స్కు ఆదరణ పెరిగింది. ప్రపంచ స్థాయిలో మన ప్రదర్శన మెరుగైంది. మరోసారి భారత అథ్లెట్లు సత్తాచాటేందుకు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్(World Athletics Championships 2023) రూపంలో మరో ప్రతిష్ఠాత్మక వేదిక దొరికింది. హంగేరీలోని బుడాపెస్ట్లో ఈ పోటీలు శనివారమే ఆరంభమయ్యాయి. నిరుడు ఈ ఛాంపియన్షిప్స్లో నీరజ్ రజతం గెలిచాడు. మరి ఈ సారి పతకంతో నీరజ్లా నిలిచేదెవరో? గత నెలలో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో మన అథ్లెట్లు 6 స్వర్ణాలు సహా 27 పతకాలు సాధించారు. ఈ పోటీల చరిత్రలో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పుడిదే జోరుతో ప్రపంచ ఛాంపియన్షిప్స్లోనూ అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. నీరజ్ సారథ్యంలో 27 మందితో బరిలో దిగుతున్న బలమైన భారత అథ్లెట్ల బృందంలో కచ్చితంగా పతకం సాధించేలా కొంతమంది కనిపిస్తున్నారు.
పసిడిపై గురి
నిరుడు ప్రపంచ ఛాంపియన్షిప్స్లో రజతంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ఈ సారి పసిడిపై గురి పెట్టాడు. డైమండ్ లీగ్ దోహా అంచె పోటీల్లో స్వర్ణంతో ఈ సీˆజన్ను ఘనంగా మొదలెట్టాడు నీరజ్. ఆ పోటీల్లో 88.67 మీటర్ల దూరం ఈటెను విసిరి ఛాంపియన్గా నిలిచాడు. కానీ ఆ తర్వాత కండరాల గాయంతో కొన్ని పోటీలకు దూరమయ్యాడు. తిరిగి కోలుకున్న తర్వాత లాసానె డైమండ్ లీగ్ అంచె పోటీల్లో స్వర్ణం (87.66మీ)తో సత్తాచాటాడు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్షిప్స్లో స్వర్ణం గెలవడమే కాకుండా 90 మీటర్ల దూరాన్ని కూడా అందుకోవాలన్నది అతని లక్ష్యం. పురుషుల జావెలిన్ త్రోలో డీపీ మను, కిశోర్ కుమార్ కూడా బరిలో ఉన్నారు.
‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోలో రింకు సింగ్పై ప్రశ్న..
లాంగ్జంప్లో ఆ ఇద్దరూ
పురుషుల లాంగ్జంప్లో జెస్విన్ అల్డ్రిన్, శ్రీశంకర్ మురళీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ ఏడాదిలో ప్రపంచంవ్యాప్తంగా లాంగ్జంప్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వాళ్లలో వీళ్లిద్దరూ తొలి రెండు స్థానాల్లో ఉండడమే కారణం. 2023లో జెస్విన్ ఉత్తమ ప్రదర్శన 8.42 మీటర్లు. శ్రీశంకర్ది 8.41మీ. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో రజతం నెగ్గిన శ్రీశంకర్ వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ఈ ఏడాది పారిస్ డైమండ్ లీగ్ అంచె పోటీల్లో కాంస్యంతో.. ఆ ఘనత సాధించిన భారత తొలి లాంగ్జంపర్గా నిలిచాడు. ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్ కూడా పతకంపై ఆశలు రేకెత్తిస్తున్నాడు. అతను ఈ ఏడాది 17.37 మీటర్ల ప్రదర్శనతో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన చేసిన ట్రిపుల్ జంపర్లలో ప్రవీణ్ నాలుగోవాడు. ఈ ఏడాది బరిలో దిగిన అయిదు టోర్నీలకు గాను మూడింట్లో 17 మీటర్లకు పైగా ప్రదర్శన నమోదు చేశాడు.
మన తెలుగమ్మాయి
ఈ ప్రపంచ ఛాంపియన్షిప్స్లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజిపై ప్రత్యేక దృష్టి నెలకొంది. 100మీ. హార్డిల్స్లో సంచలన ప్రదర్శనతో సాగుతున్న ఈ విశాఖ అమ్మాయి జాతీయ రికార్డును చాలా సార్లు బద్దలుకొట్టింది. ఇటీవల ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో కాంస్యం సాధించి.. 100మీ. హార్డిల్స్లో ఈ పోటీల్లో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా 12.78 సెకన్ల టైమింగ్తో తన జాతీయ రికార్డు (12.82సె)నూ మెరుగుపర్చుకుంది. పారిస్ ఒలింపిక్స్ అర్హత (12.77సె) ప్రమాణానికి కేవలం 0.01 సెకన్ల దూరంలో నిలిచింది. అంతకంటే ముందు తన తొలి ఆసియా ఛాంపియన్షిప్స్లోనే పసిడితో చరిత్ర సృష్టించింది. ఆ పోటీల చరిత్రలో 100మీ. హార్డిల్స్లో స్వర్ణం గెలిచిన తొలి భారత అథ్లెట్ ఆమెనే. ఇప్పుడు తొలి ప్రపంచ ఛాంపియన్షిప్స్లోనూ పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు షైలి సింగ్ (లాంగ్జంప్), అవినాష్ సాబ్లె (3000మీ స్టీపుల్ఛేజ్) కూడా పతకాలకు గట్టి పోటీదారులే.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం