World Athletics Championships: నీరజ్లా.. నిలిచేదెవరో? మన అథ్లెట్లు ఏం చేస్తారో?
హంగేరీలోని బుడాపెస్ట్లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్(World Athletics Championships 2023) పోటీలు శనివారమే ఆరంభమయ్యాయి. నిరుడు ఈ ఛాంపియన్షిప్స్లో నీరజ్ రజతం గెలిచాడు. మరి ఈ సారి పతకంతో నీరజ్లా నిలిచేదెవరో?
2020 టోక్యో ఒలింపిక్స్ (2021)లో జావెలిన్ త్రో స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా(Neeraj Chopra). ఈ పసిడితో భారత అథ్లెటిక్స్లో విప్లవమే వచ్చింది. దేశంలో అథ్లెటిక్స్కు ఆదరణ పెరిగింది. ప్రపంచ స్థాయిలో మన ప్రదర్శన మెరుగైంది. మరోసారి భారత అథ్లెట్లు సత్తాచాటేందుకు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్(World Athletics Championships 2023) రూపంలో మరో ప్రతిష్ఠాత్మక వేదిక దొరికింది. హంగేరీలోని బుడాపెస్ట్లో ఈ పోటీలు శనివారమే ఆరంభమయ్యాయి. నిరుడు ఈ ఛాంపియన్షిప్స్లో నీరజ్ రజతం గెలిచాడు. మరి ఈ సారి పతకంతో నీరజ్లా నిలిచేదెవరో? గత నెలలో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో మన అథ్లెట్లు 6 స్వర్ణాలు సహా 27 పతకాలు సాధించారు. ఈ పోటీల చరిత్రలో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పుడిదే జోరుతో ప్రపంచ ఛాంపియన్షిప్స్లోనూ అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. నీరజ్ సారథ్యంలో 27 మందితో బరిలో దిగుతున్న బలమైన భారత అథ్లెట్ల బృందంలో కచ్చితంగా పతకం సాధించేలా కొంతమంది కనిపిస్తున్నారు.
పసిడిపై గురి
నిరుడు ప్రపంచ ఛాంపియన్షిప్స్లో రజతంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ఈ సారి పసిడిపై గురి పెట్టాడు. డైమండ్ లీగ్ దోహా అంచె పోటీల్లో స్వర్ణంతో ఈ సీˆజన్ను ఘనంగా మొదలెట్టాడు నీరజ్. ఆ పోటీల్లో 88.67 మీటర్ల దూరం ఈటెను విసిరి ఛాంపియన్గా నిలిచాడు. కానీ ఆ తర్వాత కండరాల గాయంతో కొన్ని పోటీలకు దూరమయ్యాడు. తిరిగి కోలుకున్న తర్వాత లాసానె డైమండ్ లీగ్ అంచె పోటీల్లో స్వర్ణం (87.66మీ)తో సత్తాచాటాడు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్షిప్స్లో స్వర్ణం గెలవడమే కాకుండా 90 మీటర్ల దూరాన్ని కూడా అందుకోవాలన్నది అతని లక్ష్యం. పురుషుల జావెలిన్ త్రోలో డీపీ మను, కిశోర్ కుమార్ కూడా బరిలో ఉన్నారు.
‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోలో రింకు సింగ్పై ప్రశ్న..
లాంగ్జంప్లో ఆ ఇద్దరూ
పురుషుల లాంగ్జంప్లో జెస్విన్ అల్డ్రిన్, శ్రీశంకర్ మురళీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ ఏడాదిలో ప్రపంచంవ్యాప్తంగా లాంగ్జంప్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వాళ్లలో వీళ్లిద్దరూ తొలి రెండు స్థానాల్లో ఉండడమే కారణం. 2023లో జెస్విన్ ఉత్తమ ప్రదర్శన 8.42 మీటర్లు. శ్రీశంకర్ది 8.41మీ. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో రజతం నెగ్గిన శ్రీశంకర్ వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ఈ ఏడాది పారిస్ డైమండ్ లీగ్ అంచె పోటీల్లో కాంస్యంతో.. ఆ ఘనత సాధించిన భారత తొలి లాంగ్జంపర్గా నిలిచాడు. ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్ కూడా పతకంపై ఆశలు రేకెత్తిస్తున్నాడు. అతను ఈ ఏడాది 17.37 మీటర్ల ప్రదర్శనతో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన చేసిన ట్రిపుల్ జంపర్లలో ప్రవీణ్ నాలుగోవాడు. ఈ ఏడాది బరిలో దిగిన అయిదు టోర్నీలకు గాను మూడింట్లో 17 మీటర్లకు పైగా ప్రదర్శన నమోదు చేశాడు.
మన తెలుగమ్మాయి
ఈ ప్రపంచ ఛాంపియన్షిప్స్లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజిపై ప్రత్యేక దృష్టి నెలకొంది. 100మీ. హార్డిల్స్లో సంచలన ప్రదర్శనతో సాగుతున్న ఈ విశాఖ అమ్మాయి జాతీయ రికార్డును చాలా సార్లు బద్దలుకొట్టింది. ఇటీవల ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో కాంస్యం సాధించి.. 100మీ. హార్డిల్స్లో ఈ పోటీల్లో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా 12.78 సెకన్ల టైమింగ్తో తన జాతీయ రికార్డు (12.82సె)నూ మెరుగుపర్చుకుంది. పారిస్ ఒలింపిక్స్ అర్హత (12.77సె) ప్రమాణానికి కేవలం 0.01 సెకన్ల దూరంలో నిలిచింది. అంతకంటే ముందు తన తొలి ఆసియా ఛాంపియన్షిప్స్లోనే పసిడితో చరిత్ర సృష్టించింది. ఆ పోటీల చరిత్రలో 100మీ. హార్డిల్స్లో స్వర్ణం గెలిచిన తొలి భారత అథ్లెట్ ఆమెనే. ఇప్పుడు తొలి ప్రపంచ ఛాంపియన్షిప్స్లోనూ పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు షైలి సింగ్ (లాంగ్జంప్), అవినాష్ సాబ్లె (3000మీ స్టీపుల్ఛేజ్) కూడా పతకాలకు గట్టి పోటీదారులే.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన