IPL 2024: ఇకనైనా బౌండరీ లైన్ల పరిధిని పెంచండి..: సునీల్ గావస్కర్
ఐపీఎల్ జరిగే కొద్దీ బ్యాటర్ల హవానే కొనసాగుతోంది. బౌలర్లు చేష్టలుడిగి చూసేందుకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్లో పరుగుల సునామీ కొనసాగుతోంది. చాలా జట్లు అలవోకగా 200+ స్కోర్లు దాటేస్తున్నాయి. హైదరాబాద్ మరోఅడుగు ముందుకేసి 250+ స్కోర్లనే మూడు సార్లు చేసింది. ఇటీవల రోహిత్ శర్మ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్పై మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) బౌండరీ లైన్లను మార్చాలని సూచించాడు. బ్యాటర్లు హవా కొనసాగుతున్న ఐపీఎల్లో బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందన్నాడు.
‘‘క్రికెట్ బ్యాట్కు సంబంధించి నేనేమీ సూచనలు చేయను. ఎందుకంటే నిబంధనల ప్రకారమే దానిని తయారు చేస్తున్నారు. అయితే, బౌండరీల విషయంలో మాత్రం ఓ కీలక సూచన చేయాలనుకుంటున్నా. ప్రతి మైదానంలో బౌండరీల దూరం పెంచాలని ఎప్పటి నుంచో చెబుతున్నా. ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ను చూస్తే.. సిక్సర్కు, క్యాచ్కు తేడా తెలియడం లేదు. వాణిజ్య ప్రకటనల బోర్డులను కూడా కాస్త వెనక్కి జరపాలి. కనీసం 2 లేదా 3 మీటర్ల వరకు బౌండరీ పరిధిని పెంచాలి. లేకపోతే బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడటం ఖాయం.
క్రికెట్లో ఎప్పుడైనా సరే బ్యాటర్లు, బౌలర్లకు మధ్య భీకరపోరు జరిగితేనే మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతిసారీ బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగినా బోర్ కొడుతుంది. గత కొన్ని రోజులుగా టీ20 క్రికెట్ను చూస్తుంటే.. కేవలం బ్యాటర్లదే హవా. ప్రతి కోచ్ కూడా తమ ఆటగాళ్లకు నెట్స్లో ప్రాక్టీస్ సందర్భంగా.. ‘ఇదే చివరి మ్యాచ్. దంచి కొట్టడమే’ అని చెబుతున్నట్లున్నారు. బ్యాటర్లు క్రీజ్లోకి వచ్చీ రావడంతోనే హిట్టింగ్ మొదలుపెట్టేస్తున్నారు. తొలుత కాస్త బాగానే ఉన్నట్లు అనిపించినా.. మ్యాచ్ జరిగే కొద్దీ ఆసక్తికరంగా ఉండటం లేదు. దీని గురించి కాస్త పరుష పదాలను వాడాలని ఉన్నా.. ప్రయోగించడం లేదు’’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..