Suresh Raina: ‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్ నిష్క్రమణపై రైనా స్పష్టత
Suresh Raina: ఐపీఎల్ 2020 సీజన్ నుంచి ఆకస్మికంగా వైదొలగడంపై సురేశ్ రైనా ఎట్టకేలకు స్పష్టతనిచ్చాడు. బంధువులు హత్యకు గురవడం వల్లే స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ మహమ్మారి సమయంలో యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ 2020 నుంచి అప్పటి చెన్నై ఆటగాడు సురేశ్ రైనా (Suresh Raina) నిష్క్రమించడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఆయన టోర్నీ నుంచి వైదొలిగినప్పటికీ దీనిపై అప్పట్లో అనేక వదంతులు బయటికొచ్చాయి. ఫ్రాంచైజీ ప్రతినిధులతో విభేదాల కారణంగానే అతడు స్వదేశానికి తిరిగెళ్లినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.
అయితే, ఇన్నేళ్ల తర్వాత ఈ వదంతులపై తొలిసారి స్పందించిన సురేశ్ రైనా.. నిష్క్రమణకు అసలు కారణాన్ని వెల్లడించాడు. బంధువుల మృతి కారణంగానే టోర్నీని వీడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ‘‘అప్పుడు మా కుటుంబంలో విషాదం నెలకొంది. బంధువులు మరణించారు. పఠాన్కోట్ (పంజాబ్)లో ఉన్న మా మామయ్య కుటుంబం మొత్తాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు. ఈ ఘటనతో మా నాన్న తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అప్పటికే కొవిడ్ భయాలతో ఉన్న మా కుటుంబాన్ని ఇది మరింత కుంగుబాటుకు గురిచేసింది. ఆ సమయంలో క్రికెట్ కన్నా ఫ్యామిలీతో ఉండటమే ముఖ్యమని భావించా. ఇదే విషయాన్ని ధోనీ, టీమ్ మేనేజ్మెంట్కు చెప్పి స్వదేశానికి తిరిగొచ్చా. అయితే బయో-బబుల్ కారణంగా మళ్లీ జట్టుతో చేరలేకపోయా. ఆ మరుసటి ఏడాది 2021 సీజన్లో ఆడా. అప్పుడు మా జట్టు ట్రోఫీ కూడా గెలిచింది’’ అని రైనా తెలిపాడు.
వారికి పార్టీలు ఎక్కువ.. అందుకే ఒక్క టైటిలూ లేదు: సురేశ్ రైనా
2020 ఆగస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైనా మామ అశోక్కుమార్ ఇంట్లో దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రైనా అత్త, మామ, వారి కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఏడాది ఐపీఎల్ సీజన్ నిమిత్తం జట్టుతో కలిసి యూఏఈ వెళ్లిన రైనా.. టోర్నీ ఆరంభానికి ముందే తిరిగొచ్చాడు. అప్పట్లో దీనిపై వివాదాస్పద కథనాలు వచ్చాయి.
కరోనా భయం, దుబాయ్లో దిగినప్పటినుంచి ఒంటరిగా ఉండటం, జట్టులో పది మందికి పైగా కరోనా పాజిటివ్ అని తేలడం రైనా మానసిక ఒత్తిడికి గురయ్యాడని తొలుత వార్తలు వచ్చాయి. తనకు కేటాయించిన హోటల్ గదిలో బాల్కనీ లేకపోవడంపై రైనా జట్టు యాజమాన్యంపై ఆగ్రహించాడని, బయో బబుల్ నిబంధనల్ని కూడా ఉల్లంఘించాడని.. ఈనేపథ్యంలో ఫ్రాంఛైజీ ప్రతినిధులతో మాటామాటా పెరిగి ఐపీఎల్ నుంచి వైదొలిగాడని మరో కథనం ప్రచారంలోకి వచ్చింది. వీటిని రైనా తాజాగా కొట్టిపారేశాడు. ఇదిలాఉండగా.. 2022 సెప్టెంబరులో రైనా ఆటకు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్