IND vs ENG: నాలుగో టెస్టులో విజయం.. సిరీస్ భారత్ వశం
టీమ్ఇండియా అదరగొట్టేసింది. ఇంగ్లాండ్ బజ్బాల్ క్రికెట్ను నిలువరించి రాంచీలోనే సిరీస్ను కైవసం చేసుకుంది. దీంతో ప్రస్తుతం 3-1 ఆధిక్యంలోకి దూసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ, పుజారా, రహానె జట్టుకు దూరమయ్యారు.. కేఎల్ రాహుల్ రెండో టెస్టు నుంచి లేడు. శ్రేయస్ అయ్యర్ ఫామ్ కోల్పోయాడు. గాయం కారణంగా వైదొలిగాడు. జట్టులో ఎక్కువ మంది కుర్రాళ్లే. కానీ, ఇంగ్లాండ్ బజ్బాల్కు ఎదురొడ్డి ఎలా ఆడతారనే సందేహాలను వారు పటాపంచలు చేసేశారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. సగర్వంగా ఐదు టెస్టుల సిరీస్ను సొంతం చేసుకున్నారు. సిరీస్లో నామమాత్రపు మ్యాచ్ అయిన చివరి టెస్టు ధర్మశాలలో జరగనుంది.
రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో (IND vs ENG) జరిగిన నాలుగో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్కు కఠిన సవాళ్లు ఎదురైన పరిస్థితుల్లో కుర్రాళ్లు ఓర్పు ప్రదర్శించారు. పర్యటక జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా ఐదు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (55), శుభ్మన్ గిల్ (52*) హాఫ్ సెంచరీలు సాధించగా.. యశస్వి జైస్వాల్ (37), ధ్రువ్ జురెల్ (39*) విలువైన పరుగులు చేశారు. రజత్ పటీదార్ , సర్ఫరాజ్ ఖాన్ డకౌట్లుగా పెవిలియన్కు చేరారు. రవీంద్ర జడేజా (4) ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3.. టామ్ హార్ట్లీ, జోరూట్ చెరో వికెట్ తీశారు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ కీలక పరుగులు చేసిన ధ్రువ్ జురెల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కొద్దిసేపు హడలెత్తించిన బషీర్..
ఓవర్ నైట్ 40/0 స్కోరుతో నాలుగో రోజులో లక్ష్యఛేదనను ప్రారంభించిన భారత్ కాసేపు బాగానే ఆడింది. అయితే, యశస్వి జైస్వాల్ ఇచ్చిన క్యాచ్ను అండర్సన్ ముందుకు దూకి అందుకొన్నాడు. దీంతో తొలి వికెట్కు 84 పరుగులు జోడించినట్లైంది. మరోవైపు రోహిత్ శర్మ నిదానంగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. అయితే, హిట్మ్యాన్ కూడా హాఫ్ సెంచరీ చేసిన కాసేపటికే ఔటయ్యాడు. భోజన విరామ సమయానికి 118/3 స్కోరుతో వెళ్లిన భారత్కు బ్రేక్ తర్వాత వచ్చీరాగానే.. భారీ ఎదురు దెబ్బ తగిలింది. షోయబ్ బషీర్ ఒకే ఓవర్లో రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్ను ఔట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా 120/5 స్కోరుతో నిలిచింది. ఈ సమయంలో మరొక వికెట్ పడి ఉంటే భారత్ పరిస్థితి భిన్నంగా ఉండేది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేసినా.. ధ్రువ్-శుభ్మన్ గిల్ పట్టుదల ప్రదర్శించారు. ఆరో వికెట్కు హాఫ్ సెంచరీ (72 పరుగులు) భాగస్వామ్యం నిర్మించి జట్టును విజయతీరాలకు చేర్చారు.
స్కోరు వివరాలు..
ఇంగ్లాండ్ : తొలి ఇన్నింగ్స్ 353, రెండో ఇన్నింగ్స్ 145
భారత్ : తొలి ఇన్నింగ్స్ 307, రెండో ఇన్నింగ్స్ 192/5 (విజయం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి