IND vs ENG: నాలుగో టెస్టులో విజయం.. సిరీస్ భారత్ వశం
టీమ్ఇండియా అదరగొట్టేసింది. ఇంగ్లాండ్ బజ్బాల్ క్రికెట్ను నిలువరించి రాంచీలోనే సిరీస్ను కైవసం చేసుకుంది. దీంతో ప్రస్తుతం 3-1 ఆధిక్యంలోకి దూసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ, పుజారా, రహానె జట్టుకు దూరమయ్యారు.. కేఎల్ రాహుల్ రెండో టెస్టు నుంచి లేడు. శ్రేయస్ అయ్యర్ ఫామ్ కోల్పోయాడు. గాయం కారణంగా వైదొలిగాడు. జట్టులో ఎక్కువ మంది కుర్రాళ్లే. కానీ, ఇంగ్లాండ్ బజ్బాల్కు ఎదురొడ్డి ఎలా ఆడతారనే సందేహాలను వారు పటాపంచలు చేసేశారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. సగర్వంగా ఐదు టెస్టుల సిరీస్ను సొంతం చేసుకున్నారు. సిరీస్లో నామమాత్రపు మ్యాచ్ అయిన చివరి టెస్టు ధర్మశాలలో జరగనుంది.
రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో (IND vs ENG) జరిగిన నాలుగో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్కు కఠిన సవాళ్లు ఎదురైన పరిస్థితుల్లో కుర్రాళ్లు ఓర్పు ప్రదర్శించారు. పర్యటక జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా ఐదు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (55), శుభ్మన్ గిల్ (52*) హాఫ్ సెంచరీలు సాధించగా.. యశస్వి జైస్వాల్ (37), ధ్రువ్ జురెల్ (39*) విలువైన పరుగులు చేశారు. రజత్ పటీదార్ , సర్ఫరాజ్ ఖాన్ డకౌట్లుగా పెవిలియన్కు చేరారు. రవీంద్ర జడేజా (4) ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3.. టామ్ హార్ట్లీ, జోరూట్ చెరో వికెట్ తీశారు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ కీలక పరుగులు చేసిన ధ్రువ్ జురెల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కొద్దిసేపు హడలెత్తించిన బషీర్..
ఓవర్ నైట్ 40/0 స్కోరుతో నాలుగో రోజులో లక్ష్యఛేదనను ప్రారంభించిన భారత్ కాసేపు బాగానే ఆడింది. అయితే, యశస్వి జైస్వాల్ ఇచ్చిన క్యాచ్ను అండర్సన్ ముందుకు దూకి అందుకొన్నాడు. దీంతో తొలి వికెట్కు 84 పరుగులు జోడించినట్లైంది. మరోవైపు రోహిత్ శర్మ నిదానంగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. అయితే, హిట్మ్యాన్ కూడా హాఫ్ సెంచరీ చేసిన కాసేపటికే ఔటయ్యాడు. భోజన విరామ సమయానికి 118/3 స్కోరుతో వెళ్లిన భారత్కు బ్రేక్ తర్వాత వచ్చీరాగానే.. భారీ ఎదురు దెబ్బ తగిలింది. షోయబ్ బషీర్ ఒకే ఓవర్లో రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్ను ఔట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా 120/5 స్కోరుతో నిలిచింది. ఈ సమయంలో మరొక వికెట్ పడి ఉంటే భారత్ పరిస్థితి భిన్నంగా ఉండేది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేసినా.. ధ్రువ్-శుభ్మన్ గిల్ పట్టుదల ప్రదర్శించారు. ఆరో వికెట్కు హాఫ్ సెంచరీ (72 పరుగులు) భాగస్వామ్యం నిర్మించి జట్టును విజయతీరాలకు చేర్చారు.
స్కోరు వివరాలు..
ఇంగ్లాండ్ : తొలి ఇన్నింగ్స్ 353, రెండో ఇన్నింగ్స్ 145
భారత్ : తొలి ఇన్నింగ్స్ 307, రెండో ఇన్నింగ్స్ 192/5 (విజయం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276